Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బయట కరకర.. లోపల జ్యూసీ.. సంక్రాంతి స్పెషల్ గా బెల్లం గోరుమిటీలు
సంక్రాంతి పండుగ అంటేనే పంటల పండుగ, పిండివంటల పండుగ. తెలుగు వారి లోగిళ్ళలో ఈ పండుగకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అరిసెలు, బూరెలు, సకినాలు, చెక్కలు వంటి ఎన్నో రకాల పిండివంటలతో ఇల్లంతా సందడిగా మారుతుంది. అయితే ఈ సంక్రాంతికి అందరూ ఇష్టపడే, చూడగానే నోరూరించే సంప్రదాయ వంటకం బెల్లం గోరుమిటీలు.
బయట కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ గోరుమిటీలు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇవి కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, చలికాలంలో శరీరానికి కావలసిన శక్తిని కూడా అందిస్తాయి. బెల్లం గోరుమిటలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావలసిన పదార్థాలు
మైదా పిండి: 2 కప్పులు.
బొంబాయి రవ్వ (సుజీ): పావు కప్పు
బెల్లం: 1.5 కప్పులు
నెయ్యి లేదా కాచిన నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: 1 టీస్పూన్
ఉప్పు: చిటికెడు
వంట సోడా: చిటికెడు
నూనె: డీప్ ఫ్రైకి
నీళ్లు: తగినన్ని
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండి, బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 చెంచాల వేడి వేడి నెయ్యిని వేయాలి.
-నెయ్యి వేసిన తర్వాత పిండిని చేతితో బాగా రబ్ చేస్తూ కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు.
-కలిపిన పిండిపై తడి గుడ్డ కప్పి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. పిండిని మరోసారి బాగా పిసికి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు వీటిని గోరుమిటీల చెక్కపై గానీ లేదా కొత్త దువ్వెనపై గానీ పెట్టి బొటనవేలితో ఒత్తి, మెల్లగా చుట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిపై చారల వంటి డిజైన్ వచ్చి చూడటానికి శంఖం ఆకారంలో అందంగా ఉంటాయి.
-స్టవ్ వెలిగించి, బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. మీడియం మంటపై ఉన్నప్పుడు తయారు చేసుకున్న గోరుమిటీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి గోరుమిటీలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-వేయించిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాలి.
-మరొక గిన్నెలో తురిమిన బెల్లం వేసి, అందులో అర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.
-బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి.
-వడపోసిన బెల్లం నీటిని మళ్ళీ స్టవ్ మీద పెట్టి పాకం రానివ్వాలి. మనకు తీగ పాకం లేదా "గులాబ్ జామ్ పాకం కంటే కాస్త చిక్కగా" ఉండాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, యాలకుల పొడి వేసి కలపాలి.
-పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే ముందుగా వేయించి పెట్టుకున్న గోరుమిటీలను అందులో వేయాలి.
-ఒక 2-3 నిమిషాలు పాకంలో ఉంచి పాకం బాగా పట్టిన తర్వాత వాటిని తీసి వేరే ప్లేట్లో ఆరబెట్టాలి.
-పూర్తిగా ఆరిన తర్వాత వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 10 నుండి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications