Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సంక్రాంతి స్పెషల్.. కరకరలాడే వెన్న జంతికలు..ఇలా చేస్తే రుచి అదుర్స్!
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ అంటేనే భోగి మంటలు, గాలిపటాలు, కొత్త అల్లుళ్లు, ముఖ్యాంగా నోరూరించే పిండి వంటలు. సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటా ఘుమఘుమలాడే వాసనలు వస్తుంటాయి.
అరిసెలు, సకినాలు, గారెలు ఎన్ని రకాలు ఉన్నప్పటికీ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే, సాయంత్రం పూట టీతో పాటు అద్భుతంగా రుచినిచ్చే స్నాక్ జంతికలు. వీటిని కొన్ని ప్రాంతాల్లో మురుకులు అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం సంక్రాంతికి మీ ఇంట్లో కరకరలాడే రుచికరమైన జంతికలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పెసరపప్పు
-మినపప్పు
-వెన్న
-వాము
-నువ్వులు
-ఉప్పు
-కారం
-పుట్నాల పప్పు
-ఇంగువ
-ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కేజీ బియ్యం(4 గ్లాసులు)వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరగ్లాసు(125 గ్రా)తెల్ల మినపప్పు వేసి ఎర్రగా వేయించుకున్నాక వాటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో అర గ్లాసు పెసరపప్పు(125గ్రా)వేసి లైట్ గా కలర్ మారేవరకు వేయించుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు బియ్యం,వేయించిన మినపప్పు,పెసరపప్పు,అరగ్లాసు తినే శనగపప్పు(పుట్నాల పప్పు)మొత్తాన్ని మిల్లుకి ఇచ్చి మెత్తని పిండిలా పట్టించుకోవాలి.
-తర్వాత పిండిని జల్లించుకోవాలి.
-జల్లించుకున్న పిండిలో 1టేబుల్ స్పూన్ వాము, 3 టేబుల్ స్పూన్ల పచ్చి నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ ఇంగువ వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇందులోనే 80 గ్రాముల వెన్న వేసి పిండికి పట్టేలా బాగా కలుపుకోండి.
-కలిపిన పిండిని కొంచెం ఓ ప్లేట్ లోకి తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని నీళ్లను పోసి లైట్ గా మెత్తగా ఉండేలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చెయ్యాలి. జంతికల గొట్టంలో పిండి పెట్టే ముందు ఒకసారి ఆ పిండి మళ్లీ చేత్తో కలుపుకొని పెట్టండి. తర్వాత ఆయిల్ లో జంతికలు వత్తుకోవాలి.
-మీడియం మంట మీద బాగా కాలనిచ్చి పైన వచ్చే నురగలు తగ్గిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండువైపులా బాగా కాలిన తర్వాత నూనెలో నుంచి బయటకు తీసేయాలి. మిగిలిన పిండితో కూడా ఇలాగే చేసుకోండి. అంతే క్రిస్పీ జంతికలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications