Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
జస్ట్ 10 నిమిషాల్లోనే హెల్తీ,టేస్టీ బ్రేక్ ఫాస్ట్..టమాటో పచ్చడితో తింటే స్వర్గమే..ఎలా చేసుకోవాలంటే..
పొద్దున్నే మనం తినే బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా దోశ, ఇడ్లీ.పూరీ, బోండా లేదా వడ వంటివి ఉంటాయి. అయితే ఎప్పుడూ ఇవే తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి కొత్తగా గోంధుమపిండితో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి. గోధుమ పిండితో చేసుకునే దోశలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిని కేవలం 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, రుచికరంగా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ కావాలి అనిపించేలా ఉంటాయి. బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇది. ఈజీగా 10 నిమిషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-అల్లం
-టమాటో
-ఉల్లిపాయ
-ఉప్పు
-మిరపకాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-గోధుమ పిండి

తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి కరిగిన తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు వేసి వీటన్నింటిని లైట్ గా వేయించుకోవాలి.
-పోపు దినుసులు లైట్ గా వేయించాక అందులో 1 టీస్పూన్ సన్నగా తరగిన అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని లైట్ గా వేగేంతవరకు వేయించుకోండి.
-తర్వాత అందులో సన్నగా కట్ చేసిన రెండు రెమ్మల కరివేపాకు వేసి వేపుకున్నాక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి.
-ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేదాకా వేయించుకున్నాక అందులో 1 టమాటో ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడేదాకా వేయించి కొత్తిమీర తరుగు చల్లుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాన్ ను పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఓ బౌల్ లో ఒకటిన్నర కప్పు గోధుమపిండి, రుచికి సరిపడా ఉప్పు, ముందుగా వేయించిన మిశ్రమం మొత్తాన్ని వేసి, 2 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండేట్లు కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేశాక దోశలను వేసుకొని మీడియం మంట మఅద కాల్చుకోండి. వీటిని టమాటో చట్నీతో తింటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
