Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయాన్నే ఇలా టేస్టీ,సూపర్ క్రిస్పీ దోసె..ఎలా చేసుకోవాలంటే..
రాత్రి వండిన అన్నం మిగిలిపోయిందా? ఉదయం లేవగానే దాన్ని ఏం చేయాలో అర్థం కాక పారేస్తున్నారా? లేక అదే చల్లటి అన్నం తినలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మిగిలిపోయిన అన్నంతో కేవలం 10 నిమిషాల్లో కరకరలాడే క్రిస్పీ దోసె తయారుచేసుకోవచ్చు.
దీనివల్ల అన్నం వృధా కాదు, పైగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ చిటికెలో రెడీ అయిపోతుంది. దీని కోసం ఎలాంటి పప్పులు నానబెట్టే పని ఉండదు, పిండి పులియబెట్టే అవసరం లేదు.

కావలసిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం - 2 కప్పులు
-బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - అర కప్పు
-పెరుగు- అర కప్పు
-ఉప్పు - తగినంత
-నీళ్లు - సరిపడా
-నూనె లేదా నెయ్యి - దోసె కాల్చుకోవడానికి
తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల మిగిలిన అన్నం, అరకప్పు బొంబాయి రవ్వ వేయండి. రవ్వ వేయడం వల్లే దోసెకు హోటల్ స్టైల్ లో లాగా మంచి క్రిస్పీనెస్ వస్తుంది.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో అర కప్పు పెరుగు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నం పలుకులు ఎక్కడా తగలకుండా, సాధారణ దోసె పిండిలా సాఫ్ట్ గా ఉండేలా రుబ్బుకోవాలి.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోండి. రవ్వ నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోసెల పెనం పెట్టుకోండి. పెనం బాగా వేడయ్యాక కొద్దిగా నీళ్లు చల్లి క్లాత్ తో తుడవండి. ఆ తర్వాత గరిటెతో పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి గుండ్రంగా, పల్చగా పరుచుకోండి.
-దోసె అంచుల వెంబడి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. మీడియం మంటపై దోసె ఎర్రగా, కరకరలాడేలా కాలే వరకు ఉంచండి. ఈ దోసె చాలా పల్చగా ఉంటుంది కాబట్టి రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదు. అంతే, వేడివేడి క్రిస్పీ దోసె రెడీ.
-ఈ ఇన్ స్టంట్ రైస్ దోసెకు పల్లి చట్నీ లేదా కొబ్బరి చట్నీ అద్భుతమైన కాంబినేషన్. కొద్దిగా స్పైసీగా, పుల్లగా కావాలనుకునే వారు టమాటో చట్నీతో ట్రై చేయవచ్చు. వేడి వేడి సాంబార్ లేదా ఏదైనా వెజ్, నాన్ వెజ్ గ్రేవీతో తిన్నా దీని రుచి అదుర్స్ అనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications