Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
నెయ్యి ఘుమఘుమలతో స్పెషల్ రొయ్యల వేపుడు.. గుండె ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్.!
సీ ఫుడ్లో చేపల తర్వాత అంతటి స్పెషల్ ఫుడ్ రొయ్యలు. వీటిని వండే విధానం కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. రొయ్యల వేపుడు, రొయ్యల కూర, ప్రాన్స్ బిర్యానీ ఇలా చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. ఈ సారి కొద్దిగా నెయ్యిని జతచేసి ఆ ఘుమఘుమలతో రొయ్యల వేపుడు చేయండి.. ఇంటిల్లిపాదీ ఫిదా అయిపోతారు.

మాంసకృత్తులు, విటమిన్లు, ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉండే రొయ్యలను రెగ్యులర్గా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే రొయ్యలను ఎప్పుడూ చేసుకునేలా రొటీన్ స్టైల్లో కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి.. రుచితో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.
నెయ్యి సువాసనతో రొయ్యల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు
రొయ్యలు- అర కేజీ
ఎండు మిర్చి- 12
వెల్లుల్లి- 8
ధనియాలు- రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర- టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
మిరియాలు- టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
గసగసాలు- టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
బెల్లం- టీస్పూన్
చింతపండు - నిమ్మకాయ సైజు
ధనియాల పొడి- అర టీస్పూన్
జీడిపప్పు- 6
నిమ్మకాయ- ఒకటి
కరివేపాకు- కొద్దిగా
నెయ్యి- 5 టేబుల్ స్పూన్లు
నెయ్యి సువాసనతో రొయ్యల వేపుడు తయారీ విధానం
ముందుగా చింతపండును కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, జీడిపప్పులో కొన్ని వేడినీళ్లు పోసి అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక.. ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, గసగసాలు వేసి వేగాక చల్లారనివ్వాలి.
ఇప్పుడు మిక్సీలో వేసి వీటితో పాటు నానబెట్టిన ఎండుమిర్చి, జీడిపప్పు, బెల్లం, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు గుజ్జుతో పాటు నీళ్లు పోసి మెత్తగా పేస్ట్లా రుబ్బుకోవాలి.
ఒక గిన్నెలో కడిగిన రొయ్యలను తీసుకుని అందులో పసుపు, ఉప్పు వేసి నిమ్మకాయ రసం పండి బాగా కలుపుకోవాలి.
స్టవ్ పైన పాన్ పెట్టుకుని వేడయ్యాక సగం నెయ్యి వేసి కాగనివ్వాలి. ఇందులో మసాలా మిశ్రమాన్ని వేసి మంచిగా ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
ఇప్పుడు మరో స్టవ్పైన పాన్ పెట్టుకుని మిగిలిన నెయ్యి వేసి వేడయ్యాక రొయ్యలను వేసుకోవాలి. రొయ్యల్లోని నీరు పైకి తేలి ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ నీళ్లు సగానికి రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి.

ఆ రొయ్యలను మరో పాన్లో ఉడుకుతున్న మసాలా మిశ్రమంలో వేసి బాగా ఉడకనివ్వాలి. నీళ్లు ఇంకిపోయి దగ్గరగా అయ్యేవరకు చిన్న మంట మీద వేగనివ్వాలి. మంచి సువాసన వస్తుండగా నిమ్మరసం పిండుకోవాలి. చివరిగా ధనియాల పొడి, కరివేపాకు వేసి మరికాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఘీ ప్రాన్స్ ఫ్రై రెడీ.
రొయ్యల వేపుడును అప్పుడప్పుడూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. త్వరగా కడుపు నిండిన భావన కలిగించి.. బరువును నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఒమెగా- 3 యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications