Latest Updates
-
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.!
మహారాష్ట్ర స్పెషల్ పనీర్ తేచా..వారెవ్వా అనిపించే టేస్ట్
భారతీయ వంటకాల్లో పచ్చళ్లు,చట్నీలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ మహారాష్ట్ర వంటకమైన తేచా తన ఘాటైన రుచికి పెట్టింది పేరు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆరోగ్య స్పృహ కలిగిన వారు ఈ సంప్రదాయ వంటకానికి పనీర్ జోడించి పనీర్ తేచాగా మార్చారు. ఇది నోరూరించే రుచితో పాటు శరీరానికి కావాల్సిన ప్రోటీన్లను కూడా అందిస్తుంది.
ఇది చాలా సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోగలిగే వంటకం. దీనిని రోటీ, చపాతీ, జొన్న రొట్టె లేదా అన్నంతో సైడ్ డిష్ గా తీసుకోవచ్చు. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా కూడా ఓ ఇంటర్వ్యూ పందర్భంగా తాను పనీర్ తేచాని చాలా ఇష్టంగా తింటానని, తమ ఇంట్లో తరచుగా దీనిని తయారుచేసుకుంటామని తెలిపారు. మహారాష్ట్ర ఫేమస్ పనీర్ తేచా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పనీర్: 200 గ్రాములు
పచ్చిమిర్చి: 10-12
వెల్లుల్లి రెబ్బలు: 10-12
వేరుశెనగ గుళ్లు: 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
కొత్తిమీర: గుప్పెడు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో వేరుశెనగ గుళ్లను నూనె లేకుండా దోరగా వేయించుకోండి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయండి. ఆ వెంటనే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి మధ్యలో చిన్న గాట్లు పెట్టి వేయండి. పచ్చిమిర్చి రంగు మారే వరకు, వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత దీనిని చల్లారనివ్వండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో లేదా రోటిలో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, వేరుశెనగలు, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా పల్స్ మోడ్ లో తిప్పండి. తేచా ఎప్పుడూ కాస్త పలుకులుగా ఉంటేనే రుచి బాగుంటుంది.
-ఇప్పుడు పాన్ లో మరో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, చిన్న ముక్కలుగా చేసిన పనీర్ ను వేసి 2 నిమిషాలు పనీర్ పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న మిర్చి-వెల్లుల్లి పేస్ట్ (తేచా)ను పనీర్ తో కలపండి.
-సన్నని మంటపై పనీర్, మసాలా బాగా కలిసేలా 2-3 నిమిషాలు వేయించండి. చివరగా కావాలనుకుంటే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. అంతే ఎంతో రుచికరమైన పనీర్ తేచా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications