Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
హోటల్ స్టైల్ మైసూర్ మసాలా దోశ..ఎర్రగా, కరకరలాడుతూ కేక టేస్ట్
దోశలంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందులోనూ మైసూర్ మసాలా దోశ అంటే ఆ క్రేజ్ వేరు. పైన బంగారు రంగులో కరకరలాడే క్రిస్పీ పొర, లోపల వెన్నలాంటి మృదుత్వం, నాలికను తాకే ఆ ఘాటైన ఎర్ర కారం, మధ్యలో నోరూరించే బంగాళాదుంప మసాలా.. అబ్బో ఈ కాంబినేషన్ తలుచుకుంటేనే ఆకలి మొదలవుతుంది.
సాధారణంగా ఇలాంటి పర్ఫెక్ట్ దోశ తినాలంటే మనం హోటల్ కి లేదా రెస్టారెంట్ కి వెళ్లాలని అనుకుంటాం. కానీ అసలైన మైసూర్ మసాలా దోశ రుచి రహస్యం తెలిస్తే, మీ వంటింట్లోనే హోటల్ కంటే అద్భుతమైన దోశను తయారు చేసుకోవచ్చు. హోటల్ కి మించిన రుచితో మైసూర్ మసాలా దోశ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
దోశ బియ్యం లేదా సోనా మసూరి బియ్యం
మినపప్పు (పొట్టు లేనిది)
మెంతులు
ఉప్పు
బంగాళాదుంపలు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
ఆవాలు
కరివేపాకు
పసుపు
నూనె.
ఎండు మిరపకాయలు
వెల్లుల్లి రెబ్బలు
చింతపండు
తయారీ విధానం
-ముందుగా బియ్యం, మినపప్పు, మెంతులను శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఆ పిండిని సుమారు 8 నుండి 10 గంటల పాటు పులియబెట్టాలి. పిండి ఎంత బాగా పులిస్తే, దోశ అంత రుచిగా, రంధ్రాలతో వస్తుంది. దోశ పోసే ముందు తగినంత ఉప్పు కలపండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి రాగానే పసుపు, ఉప్పు వేసి, ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని కలపాలి. దీన్ని రెండు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోండి.
-మైసూర్ మసాలా దోశకు అసలైన రుచినిచ్చేది ఎర్ర చట్నీనే. ఇందుకోసం ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లతో గట్టిగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఇది దోశ మీద రాయడానికి వీలుగా ఉండాలి.
-స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కాక మంటను తగ్గించి పిండిని పల్చగా, గుండ్రంగా పరచాలి. దోశ కాస్త ఉడకడం మొదలయ్యాక తయారు చేసుకున్న స్పెషల్ ఎర్ర కారం ఒక చెంచా వేసి దోశ అంతటా ఎర్రగా కనిపించేలా రాయాలి. ఆ తర్వాత దోశపై దోశ చుట్టూ వెన్న వేయండి. వెన్న వాడితే రుచి రెట్టింపు అవుతుంది.
-దోశ బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయినప్పుడు మధ్యలో ఆలూ మసాలా పెట్టి మడవాలి. అంతే వేడి వేడి మైసూర్ మసాలా దోశ రెడీ.
-దోశ హోటల్ లో లాగా మంచి ఎరుపు-బంగారు రంగులో రావాలంటే పిండి రుబ్బేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పంచదార లేదా కొంచెం బొంబాయి రవ్వ కలపండి. ఇది దోశను ఎక్స్ ట్రా క్రిస్పీగా మారుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










