Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఎన్నో పోషకాలున్న మల్టీవిటమిన్ కారం పొడి..రోజుకు ఒక్క ముద్ద దీంతో తింటే ఏ రోగాలు రావు!
మన ఆధునిక జీవనశైలిలో సమయానికి తినడం కూడా కష్టం అయిపోతుంది. ఇక పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఇంకా పెద్ద సవాలు. విటమిన్లు, మినరల్స్ కోసం చాలామంది సప్లిమెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మన వంటింట్లోనే, మన పూర్వీకులు వాడిన పదార్థాలతోనే ఒక అద్భుతమైన పోషకాల గనిని తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?
అదే మల్టీవిటమిన్ కారం పొడి. ఈ కారం పొడి కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మల్టీవిటమిన్ కారం పొడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-గుమ్మడి గింజలు
-పుచ్చ గింజలు
-నువ్వులు
-ధనియాలు
-జీలకర్ర
-ఎండుమిర్చి
-ఆయిల్
-కరివేపాకు
-ఉప్పు
-పసుపు
-ఆమ్చూర్ పౌడర్
-వెల్లుల్లి
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు(75గ్రా)గుమ్మడి గింజలు వేసి లైట్ గా కలర్ మారేంతవరకు వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో అరకప్పు పుచ్చ గింజలు వేసి లైట్ గా కలర్ మారేంతవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో అరకప్పు నువ్వులు వేసి తక్కువ మంట మీద చిటపటలాడేంతవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లో అరకప్పు అవిసె గింజలు వేసి తక్కువ మంట మీద 2 నిమిషాలు వేయించి ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి కాగిన తర్వాత పావు కప్పు కంటె కొంచెం ఎక్కువ(20గ్రా)ధనియాలు వేసి లైట్ గా కలర్ మారేదాకా వేయించాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని 2 నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోండి
-తర్వాత స్టవ్ మీద పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేశాక ముప్పావు కప్పు(20గ్రా)ఎండుమిరపకాయల ముక్కలు వేసి ఇవి మాడిపోకుండా తక్కువవ మంట మీద కరకరలాడేవరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లో శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టిన 1 కప్పు కరివేపాకు వేసి నూనె లేకుండానే కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించి స్టవ్ ఆపేసి కరివేపాకును ప్లేట్ లోకి తీసుకోవాలి.
-వేయించినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందుకోసం ఫస్ట్ వేయించిన ధనియాలు,జీలకర్ర,ఎండుమిర్చి,కరివేపాకు మిక్సీ గిన్నెలో వేసి తగినంత ఉప్పు,పావు టీస్పూన్ పసుపు కూడా వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే వేయించిన అవిసె,పుచ్చ,గుమ్మడి గింజలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక ఇందులోనే పావు కప్పు(35గ్రా)పొట్టు తీసిన వెల్లల్లి రెబ్బలు వేసి కలిపి ఒకసారి పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చాగానే ఉంటే బాగుంటుంది.
-గ్రైండ్ చేసిన పొడి మొత్తాన్ని ఓ ప్లేట్ లో వేసి పులుపు కోసం ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆమ్చూర్ పౌడర్ లేదా ఉసిరికాయ పొడి అయినా వేసి మెత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఈ రెడీ అయిన పొడిని గాజు సీసాలో పెట్టి బయట పెట్టుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా ఉంటంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





