Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పండిన అరటిపండ్లు పారేయకండి..ఇలా కమ్మటి బోండాలు చేసుకోండి!
సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తుంటే చేతిలో వేడి వేడి టీ లేదా కాఫీ ఉంటే ఎంత బాగుంటుందో. సరిగ్గా ఇదే సమయానికి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు, లేదా ఆఫీస్ పని ముగించుకుని రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఆ సమయంలో ఏదైనా వేడిగా, రుచిగా తినాలి అని మనసు కోరుకోవడం సహజం.
అలాంటప్పుడు వంటింట్లో గంటల తరబడి శ్రమించకుండా కేవలం 10-15 నిమిషాల్లో అయిపోయే హెల్దీ స్నాక్ గోధుమ పిండి అరటిపండు బోండా. పండిన అరటిపండ్లు, గోధుమ పిండి కాంబినేషన్ ఈ బోండాలకు అదిరిపోయే రుచిని ఇస్తుంది. ఒక్కసారి చేసి పెడితే మీ పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు. నోరూరించే ఈ తీపి బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
పండిన అరటిపండ్లు: 2
బెల్లం తురుము: ముప్పావు కప్పు
నీళ్లు: అర కప్పు
యాలకుల పొడి: అర టీస్పూన్
వంట సోడా: పావు టీస్పూన్
ఉప్పు: చిటికెడు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ముప్పావు కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. బెల్లం పూర్తిగా కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. బెల్లం కరిగాక స్టవ్ ఆపేసి, ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు అరటిపండ్లను తొక్క తీసి వేయండి. వీటిని చేత్తో లేదా ఫోర్క్ స్పూన్ సహాయంతో మెత్తని గుజ్జులా అయ్యేలా బాగా మెదపాలి. అరటిపండు ముక్కలు లేకుండా చూసుకోండి.
-మెదిపి ఉంచుకున్న అరటిపండు గుజ్జులో 2 కప్పుల గోధుమ పిండి, మంచి సువాసన కోసం యాలకుల పొడి, వంట సోడా,చిటికెడు ఉప్పు వేయాలి.
-ఇప్పుడు ముందుగా కరిగించి చల్లార్చుకున్న బెల్లం నీళ్లను వడపోస్తూ
పిండిలో పోయాలి. చేత్తో పిండిని బాగా కలపాలి. బోండాల పిండి మరీ జారుగా
కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా
చూసుకోవాలి.
అవసరమైతే మరికొన్ని నీళ్లు చల్లి కలపండి.
-స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక, మంటను మీడియంలో ఉంచండి. ఇప్పుడు చేతిని కాస్త నీటిలో తడిపి, పిండిని చిన్న చిన్న బంతులుగా నూనెలో వేయాలి.
-మంట ఎక్కువగా ఉంటే పైన రంగు వస్తుంది కానీ లోపల ఉడకదు, కాబట్టి మీడియం మంట మీదే వేయించాలి. గరిటతో అటు ఇటు తిప్పుతూ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలి.
-క్రిస్పీగా వేగిన బోండాలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి. అంతే గుమగుమలాడే, మెత్తటి గోధుమ పిండి అరటిపండు బోండాలు రెడీ. వీటిని వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications