Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గుడిలో ప్రసాదంగా పెట్టే చక్కెర పొంగలి.. ఇంట్లోనే ఇలా చేస్తే మృదువుగా,మంచి రుచిగా
చక్కెర పొంగలి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి ఇది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రసాదం దాదాపు అన్ని ఆలయాలలో పంపిణీ చేస్తారు. ఈ స్వీట్ దక్షిణ భారతదేశంలో ఉగాది, సంక్రాంతి, పొంగల్, నవరాత్రులు వంటి పండుగలు, శుభకార్యాలలో తయారు చేస్తారు. సాధారణ రోజుల్లో తినడానికి కూడా ఇది బాగుంటుంది. ప్రసాదం చక్కెర పొంగలి ఇంట్లోనే అదే టేస్ట్ తో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ప్రసాదం చక్కెర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-బియ్యం
-బెల్లం
-నీళ్లు
-నెయ్యి
-చక్కెర
-జీడిపప్పు
-పచ్చ కర్పూరం
-కిస్మిస్
-ఎండుకొబ్బరి
-యాలకల పొడి

ప్రసాదం చక్కెర పొంగలి తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో అరకప్పుపెసరపప్పు వేసి మీడియం మంట మీద లైట్ గా బంగారు రంగు వచ్చేదాకా బాగా ఫ్రై చేశాక ఓ గిన్నెలోకి తీసుకోండి.
-వేయించిన పెసరపప్పులో 1 కప్పు బియ్యం వేసి రెండూ కలిసేలా కలుపుకున్నాక శుభ్రంగా కడిగి అర గంట నీళ్లు పోసి నానబెట్టండి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నీరు ఒంపేసిన నానబెట్టిన బియ్యం,పెపరప్పు మిశ్రమం వేసి 4 కప్పుల నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
-అది ఉడికేలోగా స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర కప్పుల పాత బెల్లం తురుము, అరకప్పు చక్కెర, 1కప్పు నీళ్లు పోసి బాగా కరిగించాలి. పాకం అక్కర్లేదు..జస్ట్ అది కరిగిపోయి మరగడం స్టార్ట్ అయినప్పుడు స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఉడికిన బియ్యం,పెసరపప్పు మిశ్రమాన్ని గరిటతో లైట్ గా మెదుపుకున్నాక ఇందులోనే కరగబెట్టిన బెల్లం నీళ్లను వడకట్టి పోయాలి. మధ్య మధ్యలో కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకొని దించేయాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి వేడయ్యాక అందులో 15 జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేశాక సన్నగా కట్ చేసిన ఎండుకొబ్బరి ముక్కలు, కొన్ని కిస్మిస్ వేసి బాగా ఫ్రై చెయ్యాలి.
-ఇప్పుడు నెయ్యితో సహా వేయించిన డ్రఫ్రూట్స్ అన్నీ పొంగలిలో వేసి కలుపుకోవాలి. అర టీస్పూన్ యాలకల పొడి, పెసరపప్పు సైజు అంత పచ్చి కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. అంతే రుచికరమైన చక్కెర పొంగలి రెడీ.
ఆయుర్వేదం ప్రకారం చక్కెర పొంగలి
ఆయుర్వేదంలో చక్కెర పొంగలిని సత్వగుణ ప్రధానమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇది పవిత్రమైన, శుభప్రదమైనది. ఆయుర్వేదం ప్రకారం, పాలు, బెల్లం, నెయ్యి కలయిక వల్ల శరీరానికి బలం, శక్తి లభిస్తుంది. ఈ పదార్థాలన్నీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో అత్యంత ఉత్తమమైన ఆహారంగా పరిగణిస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications