Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పంజాబీ స్టైల్ ఆలూ పరాఠా..పిల్లల లంచ్ బాక్స్కి బెస్ట్..ఇలా చేస్తే వావ్ అనాల్సిందే
ఆలూ పరాఠా అంటే గుర్తొచ్చేది పంజాబీ స్టైల్. ఉదయాన్నే అల్పాహారంగా గానీ, సాయంత్రం వేళ అల్పాహారంగా గానీ ఆలూ పరాఠా తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఆలూ పరాఠా అనేది కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సరైన పోషకాలు, మంచి రుచితో కూడిన అల్పాహారం కావాలనుకునేవారికి ఆలూ పరాఠా చాలా మంచి ఎంపిక. రుచికరమైన పంజాబీ స్టైల్ ఆలూ పరాఠా మీ ఇంట్లోనే తయారుచేసే విధానం, దానికి కావలసిన పదార్థాలు ఇక్కడ చూడండి.
ఆలూ పరాఠా తయారీకి కావలసిన పదార్థాలు
-గోధుమ పిండి: 2 కప్పులు
-ఉడికించిన ఆలూ: 4
-ఉల్లిపాయలు: 1
-పచ్చిమిర్చి: 2
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
-ధనియాల పొడి: 1 టీస్పూన్
-గరం మసాలా: 1/2 టీస్పూన్
-కారం: 1/2 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-నూనె/నెయ్యి: పరాఠాలు కాల్చడానికి సరిపడా

తయారుచేసే విధానం
-ముందుగా గోధుమ పిండిలో తగినంత ఉప్పు, నీరు వేసి చపాతీ పిండిలా మెత్తగా కలపాలి. పిండిని 15-20 నిమిషాలు పక్కన పెట్టాలి.
-ఉడికించిన బంగాళాదుంపల పొట్టు తీసి వాటిని మెత్తగా చిదమాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మెత్తగా చిదిమిన బంగాళాదుంపలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
-పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీ మాదిరిగా కొద్దిగా వత్తుకోవాలి.
-వత్తిన పిండి మధ్యలో ఆలూ మిశ్రమాన్ని పెట్టి దాన్ని జాగ్రత్తగా మూసేసి, మళ్లీ పరాఠాలా వత్తుకోవాలి.
-ఇప్పుడు ఒక పెనం మీద కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి పరాఠాని రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకూ కాల్చాలి.
-వేడివేడి పరాఠాను పెరుగు, ఊరగాయ లేదా వెన్నతో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది.
ఆలూ పరాఠా తినడం వలన కలిగే ప్రయోజనాలు
ఆలూ పరాఠాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బంగాళాదుంప, గోధుమ
పిండి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ఉదయం అల్పాహారంగా
తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఆలూ పరాఠాలో ఫైబర్ ఎక్కువగా
ఉండటం వలన ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో
బంగాళాదుంపలు ఉండటం వలన విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6 వంటి
ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.
ఇందులో కొత్తిమీర, అల్లం, మసాలా వంటివి ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం, కొత్తిమీర జీర్ణక్రియ ఎంజైమ్ లను పెంచడంలో సహాయపడతాయి. ఆలూ పరాఠాలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో పొటాషియం ఉండటం వలన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో ఉన్న కార్బోహైడ్రేట్లు, ఫైబర్ వలన ఆరోగ్యకరమైన బరువును పెంచుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications