Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
రెస్టారెంట్ రుచిని మరిపించే రైస్ ఖీర్.. ఇంట్లోనే చాలా ఈజీగా!
భోజనం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా, చివరలో కాస్త తీపి లేకపోతే ఆ ఆనందం సంపూర్ణం కాదు. పండుగ రోజుల్లోనైనా, వీకెండ్ పార్టీల్లోనైనా మనందరికీ గుర్తొచ్చే మొదటి స్వీట్ రైస్ ఖీర్(బియ్యం పాయసం). అయితే మనం ఇంట్లో చేసే పాయసం కంటే హోటల్స్ లేదా రెస్టారెంట్లలో లభించే ఖీర్ ఎంతో చిక్కగా, క్రీమీగా, అద్భుతమైన రుచితో ఉంటుంది.
ఆ రుచి వెనుక ఉన్న రహస్యం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లల నుండి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తినే ఆ హోటల్ స్టైల్ రైస్ ఖీర్ ను మీరు కూడా చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అచ్చం రెస్టారెంట్ స్టైల్ రుచితో రైస్ ఖీర్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
ముఖ్యంగా ఫుల్ క్రీమ్ మిల్క్ లేదాచిక్కటి పాలు- 1 లీటరు
బాస్మతి బియ్యం- అర కప్పు
చక్కెర - రుచికి సరిపడా (సుమారు 1 కప్పు)
యాలకుల పొడి - అర టీస్పూన్
కుంకుమ పువ్వు రేకులు - చిటికెడు
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, కిస్మిస్, బాదం) - గుప్పెడు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, మంచినీటిలో కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యం త్వరగా ఉడకడమే కాకుండా, పాయసం మంచి క్రీమీ ఆకృతిలోకి వస్తుంది.
-అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో లీటరు చిక్కటి పాలను పోసి మీడియం మంటపై మరిగించాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం నుండి నీటిని పూర్తిగా వడకట్టి, బియ్యాన్ని పాలల్లో వేయాలి.
-మంటను సిమ్ లో ఉంచి, బియ్యం మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. బియ్యం పాలతో కలిసిపోయి చిక్కబడే వరకు ఓపికగా మరిగించాలి.
-బియ్యం సగం ఉడికిన తర్వాత గరిటెతో బియ్యాన్ని కొద్దిగా మెదపాలి. ఇలా చేయడం వల్ల పాయసం నీళ్లలా కాకుండా, హోటల్ స్టైల్ లా చిక్కగా, క్రీమీగా మారుతుంది.
-బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాతే మీ రుచికి తగినంత చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగిన తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. కుంకుమ పువ్వు పాయసానికి మంచి సువాసనతో పాటు, ఆకర్షణీయమైన లేత పసుపు రంగును ఇస్తుంది.
-వేరొక చిన్న పాన్ లో నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఈ నేతి మిశ్రమాన్ని నేరుగా ఉడుకుతున్న పాయసంలో వేసి కలపాలి.
-అంతే ఎంతో రుచికరమైన, చిక్కటి హోటల్ స్టైల్ రైస్ ఖీర్ రెడీ. దీనిని వేడివేడిగా తిన్నా అద్భుతంగా ఉంటుంది, లేదా ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే పిల్లలు ఐస్క్రీమ్ లా ఇష్టపడి తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








