Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రోడ్డు పక్కన బండి మీద దొరికే దోశ సాంబార్..ఆ ఒక్క పదార్థంతో చిక్కగా, కమ్మగా!
పొద్దున్నే వేడివేడిగా దోశ లేదా మెత్తటి ఇడ్లీ ప్లేటులో ఉంటే దానికి తోడుగా కొబ్బరి చట్నీ, కారప్పొడి ఉన్నా మన మనసు మాత్రం కొన్నిసార్లు ప్రత్యేకమైన సాంబార్ కోసం వెతుకుతుంది. ముఖ్యంగా రోడ్డు పక్కన చిన్న బండ్ల మీద దొరికే సాంబార్ రుచి అమోఘం. ఆ సాంబార్ లో దోశను ముంచుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది.
ఆ సాంబార్ ప్రత్యేకత ఏంటంటే.. అది కేవలం పప్పుతోనే కాదు, దానిలో వాడే పదార్థాల మిశ్రమం దానికి ఆ అద్భుతమైన రుచిని ఇస్తుంది. పుల్లపుల్లగా ఉండే టమోటాలు, ఘుమఘుమలాడే సాంబార్ పొడి, ఒక చిన్న రహస్య పదార్థం.. అదే శనగపిండి. రుచికరమైన రోడ్ సైడ్ దోశ సాంబార్ ను ఇంట్లోనే, అంతే రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
కందిపప్పు - అర కప్పు
సాంబార్ ఉల్లిపాయలు- 10-15
పెద్ద టమోటాలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 2
పచ్చిమిర్చి - 3
ఇంగువ - చిటికెడు
క్యారెట్ - 1
పసుపు గుమ్మడికాయ ముక్కలు - అర కప్పు
సాంబార్ పొడి - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర - కొద్దిగా
నీరు - అవసరమైనంత
నూనె - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
పోపు కోసం:
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్ కంటే తక్కువ
ఎండు మిరపకాయలు - 2
కరివేపాకు - ఒక రెమ్మ

తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా రెండుసార్లు కడిగి, ఒక ప్రెషర్ కుక్కర్ లో తీసుకోండి. పప్పు మునిగేంత నీరు పోసి పది నిమిషాల పాటు నాననివ్వండి.
-ఇప్పుడు అదే కుక్కర్ లో చిన్న ఉల్లిపాయలు, తరిగిన టమోటాలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు, సాంబార్ పొడి, పసుపు, ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు ఒక టీస్పూన్ నూనె వేయండి. మరో కప్పు నీళ్లు పోసి బాగా కలపండి. కుక్కర్ మూతపెట్టి, స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-పప్పు, కూరగాయలు మెత్తగా ఉడికిపోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి, పప్పు గరిటతో లేదా మాషర్ తో మెత్తగా అయ్యేలా కొద్దిగా మెదపండి. కూరగాయ ముక్కలు మరీ గుజ్జులా కాకుండా చూసుకోండి.
-ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి సాంబార్ కావలసినంత చిక్కగా లేదా పల్చగా ఉండేలా వేడి నీటిని కలుపుకుని స్టవ్ మీద పెట్టి మరిగించండి.
-ఈలోపు ఒక చిన్న గిన్నెలో టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుని, ఉండలు లేకుండా కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న సాంబార్ లో పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల సాంబార్ చిక్కగా, మంచి రుచితో వస్తుంది.
-చివరగా పోపు కోసం వేరే చిన్న పాన్ లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత మెంతులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించి, ఈ ఘుమఘుమలాడే పోపును మరుగుతున్న సాంబార్ లో కలపాలి.
-పైన కొత్తిమీర చల్లి ఒక నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే, కమ్మనైన రోడ్ సైడ్ దోశ సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications