Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఉల్లి, టమాటా లేకుండా..కేవలం 10 నిమిషాల్లో బాంబే పూరీ మసాలా!
వీక్ డేస్ లో అయినా లేదా వీకెండ్స్ లో అయినా పండుగలు వచ్చినా మన తెలుగు ఇళ్లలో టిఫిన్ ప్లేట్లలో వేడివేడి పూరీలు లేదా చపాతీలు ప్రత్యక్షమవుతాయి. అయితే వీటిని తయారు చేయడం ఎంత ఇష్టమో, వాటిలోకి సరైన సైడ్ డిష్ చేయడం కొన్నిసార్లు అంత తలనొప్పిగా అనిపిస్తుంది.
ఎప్పుడూ చేసే బంగాళాదుంప కుర్మా లేదా శనగపిండితో చేసే బొంబాయి చట్నీ తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొంచెం వెరైటీగా బాంబే పూరీ మసాలా ట్రై చేయండి. ఉల్లిపాయలు, టమాటాలు లేకుండా కేవలం బంగాళాదుంపలతో 10 నిమిషాల్లో హోటల్ స్టైల్ రుచితో బాంబే పూరీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు: 4
నూనె: 2 టీస్పూన్లు
కసూరి మేతి: అర టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
ఇంగువ: పావు టీస్పూన్
పసుపు: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం కొద్దిగా
తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, రెండు ముక్కలుగా కోసి కుక్కర్ లో వేయాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ముక్కలు మునిగేంత నీరు పోసి మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
-బంగాళాదుంపలు మెత్తగా ఉడికిన తర్వాత పొట్టు తీసి చేత్తో మెత్తగా (మరీ పేస్ట్ లా కాకుండా అక్కడక్కడా చిన్న ముక్కలు తగిలేలా) స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక మంటను పూర్తిగా తగ్గించి కసూరి మేతిని అరచేతిలో వేసుకుని నలిపి నూనెలో వేయాలి. ఇలా నలపడం వల్ల మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు అదే నూనెలో కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇంగువ వేసి దోరగా వేయించాలి. మసాలాల పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం వేయిస్తే చాలు.
-ఇప్పుడు ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పాన్లో వేసి మసాలాలతో బాగా కలపాలి. కూర మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకుని, రుచికి సరిపడా ఉప్పు, ఇంకొంచెం పసుపు వేసి బాగా కలపాలి.
-పాన్ మీద మూత పెట్టి, సుమారు 5 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి. దీనివల్ల బంగాళాదుంపలకు మసాలా రుచి బాగా పడుతుంది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే బాంబే పూరీ మసాలా రెడీ. వేడివేడి పూరీల్లోకి లేదా చపాతీల్లోకి ఈ కూర ఉంటే లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












