Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఆంధ్ర భోజన ప్రియుల కోసం..శక్తినిచ్చే అసలైన కంది పొడి
కంది పొడి కేవలం ఒక పొడి కాదు, అది ఒక అనుభూతి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ కంది పొడిని కలుపుకుని తింటుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. అమ్మ చేతి రుచిని, మన సంప్రదాయాన్ని గుర్తుచేసే ఈ కంది పొడి కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలో కూడా మేటి.
ఇది మన శరీరానికి అందించే శక్తి మాత్రం అనంతం. కంది పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు తక్కువ, కానీ దాని రుచి మాత్రం అమోఘం. కంది పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కంది పప్పు - 1 కప్పు (200 గ్రాములు)
శనగ పప్పు- 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 15
జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ధనియాలు- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 6
చింతపండు -నిమ్మకాయంత
కరివేపాకు- రెండు రెమ్మలు
ఇంగువ- పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్ మీద పెట్టి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు కంది పప్పు వేసి దోరగా వేయించాలి. పప్పు మంచి బంగారు రంగులోకి మారి, చక్కటి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి.
-వేగిన పప్పును ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో శనగ పప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత అదే బాండీలో ఎండు మిరపకాయలు వేస, అవి కొద్దిగా ఉబ్బి, కరకరలాడే వరకు వేయించుకోవాలి. వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-తర్వాత జీలకర్ర, మిరియాలు, ధనియాలు బాండీలో వేసి అవి చిటపటలాడి, మంచి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి.
-ఇప్పుడు బాండీలో కరివేపాకు వేసి అందులోని తేమ పోయి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-వేయించుకున్న పదార్థాలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా ఎండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత, వేయించుకున్న పప్పులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే కంది పొడి రెడీ.
-తయారు చేసుకున్న కంది పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే, దాని రుచి, సువాసన నెలల తరబడి ప్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications