Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఆంధ్ర భోజన ప్రియుల కోసం..శక్తినిచ్చే అసలైన కంది పొడి
కంది పొడి కేవలం ఒక పొడి కాదు, అది ఒక అనుభూతి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ కంది పొడిని కలుపుకుని తింటుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. అమ్మ చేతి రుచిని, మన సంప్రదాయాన్ని గుర్తుచేసే ఈ కంది పొడి కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలో కూడా మేటి.
ఇది మన శరీరానికి అందించే శక్తి మాత్రం అనంతం. కంది పొడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు తక్కువ, కానీ దాని రుచి మాత్రం అమోఘం. కంది పొడి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
కంది పప్పు - 1 కప్పు (200 గ్రాములు)
శనగ పప్పు- 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 15
జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ధనియాలు- 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు- 6
చింతపండు -నిమ్మకాయంత
కరివేపాకు- రెండు రెమ్మలు
ఇంగువ- పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్ మీద పెట్టి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఇప్పుడు కంది పప్పు వేసి దోరగా వేయించాలి. పప్పు మంచి బంగారు రంగులోకి మారి, చక్కటి సువాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి.
-వేగిన పప్పును ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీలో శనగ పప్పు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత అదే బాండీలో ఎండు మిరపకాయలు వేస, అవి కొద్దిగా ఉబ్బి, కరకరలాడే వరకు వేయించుకోవాలి. వాటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి.
-తర్వాత జీలకర్ర, మిరియాలు, ధనియాలు బాండీలో వేసి అవి చిటపటలాడి, మంచి వాసన వచ్చే వరకు ఒక నిమిషం పాటు వేయించి తీసేయాలి.
-ఇప్పుడు బాండీలో కరివేపాకు వేసి అందులోని తేమ పోయి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-తర్వాత పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-వేయించుకున్న పదార్థాలన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ముందుగా ఎండు మిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత, వేయించుకున్న పప్పులు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే కంది పొడి రెడీ.
-తయారు చేసుకున్న కంది పొడిని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా చేస్తే, దాని రుచి, సువాసన నెలల తరబడి ప్రెష్ గా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






