Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
అమృతం లాంటి వాము ఆకు చారు..వేడి అన్నంలోకి తింటే రుచి అదుర్స్..రోగాలు పరార్!
ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధ మొక్కలలో వాము ఆకు ఒకటి. మన పెరటిలో లేదా కుండీలలో చాలా సులభంగా పెరిగే ఈ మొక్కకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఘాటైన సువాసన, మందపాటి ఆకులు దీని ప్రత్యేకత. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు వాము ఆకు ఒక దివ్యౌషధం. ఈ ఆకుతో చేసే చారు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన పూర్వీకులు అందించిన గొప్ప వంటకం ఈ వాము ఆకు చారు. వేడివేడి అన్నంలో ఈ చారు వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు సూప్ లాగా గ్లాసులో పోసుకుని తాగవచ్చు. వారానికి ఒకసారైనా ఈ చారును ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. వాము ఆకు చారు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-వెల్లుల్లి
-వాము ఆకులు
-చింతపండు
-ఎండుమిర్చి
-కరివేపాకు
-ఆయిల్
-జీలకర్ర
-మెంతులు
-ఆవాలు
-మిరియాలు
-ధనియాలు
-పసుపు
-ఉప్పు
-బెల్లం పొడి
వాము ఆకు చారు తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండుని నీటిలో నానబెట్టుకోండి.
-తర్వాత రోట్లో లేదా మిక్సీ గిన్నెలో 1 టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాలు వేసి మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు గ్రైండ్ చేసిన పొడిలోనే 8 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే దంచుకోండి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేశాక అందులో 10 మెంతులు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయల ముక్కలు వేసి వేయించుకోవాలి.
-తాలింపు వేగాక అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒక నిమిషం వేయించుకోండి.
-ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 20 వామాకులు సన్నగా తరిగి పాన్ లో వేసుకోండి.
-వామాకు కొంచెం మెత్తబడే వరకు వేయించుకున్నాక అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండులో నుంచి 3 కప్పుల నీళ్లు పోసి, అర టీస్పూన్ బెల్లం పొడి వేసి మీడియం మంట మీద 5 నిమిషాలు మరిగించాలి. అంతే వాము ఆకు చారు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







