Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం..టేస్ట్ అదిరిపోద్ది అంతే..ఎలా చేసుకోవాలో చూడండి
పాయసం అనేది రుచికి, సంస్కృతికి, ఆరోగ్యానికి సమతుల్యతను అందించే అద్భుతమైన వంటకం. కిరిసి పాయసం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక, ప్రత్యేకమైన పాయసం. పండుగలు,ప్రత్యేక సందర్భాల్లో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దీనిని తప్పనిసరిగా చేస్తారు. కృష్ణా,గుంటూరు ప్రాంతాల్లో చేసే పాల తాలికలను ఇది పోలి ఉంటుంది. ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కిరిసి పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బియ్యం
-చక్కెర
-పచ్చి కొబ్బరి
-నానబెట్టిన 1 టీస్పూన్ పాలు

కిరిసి పాయసం తయారీ విధానం
ఒక గ్లాసు బియ్యాన్ని కనీసం 2 గంటలు నానబెట్టాలి.
తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం వేసి,ఇందులోనే అర గ్లాసు పాలలో గ్లాసున్నర నీళ్లు కలిపిన దాంట్లో సగం మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండి మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే మిగిలిన పాలను కూడా వేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను తక్కువలో ఉంచి దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో 6 గ్లాసుల పాలు, 1 గ్లాసు చక్కెర, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించాలి.
పాలు మరిగేలోగా కీర్సాట మెషీన్(వాంపూస వత్తుకోడానికి వాడేటువంటుది) కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి.
ఉడికించిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని కీర్సాట మెషీన్ లోని గుంటలో పెట్టి స్టవ్ మీద పాలలోనే నొక్కుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక మళ్లీ ఇంకొంచెం పిండి మిశ్రమాన్ని మెషీన్ లో పెట్టి పాలలో వత్తుకోవాలి. దీనివల్ల ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. మంటను మళ్లీ సిమ్ లో పెట్టేయాలి.
గరిట పెట్టకుండానే గుడ్డతో గిన్నెను పుట్టుకొని అటు ఇటూ తిప్పాలి. తర్వాత ఇందులో రెండు గంటల పాటు నానబెట్టిన 1 టీస్పూన్ పాలను వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గరిటతో కలబెట్టుకొని స్టవ్ ఆపేయండి. అంతే కిరిసి పాయసం రెడీ. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications