మష్రూమ్ పన్నీర్ మసాలా

Mushroom Paneer Masala
కావలసిన పదార్ధాలు:
మష్రూమ్స్ : 250grm
పనీర్‌ : 150grm
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
పసుపు : 1/2 tsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1 tsp
పచ్చి మిర్చి : 4 (తరిగి)
ధనియాల పొడి : 1 tsp
గరం మసాలా పొడి : 1/2 tsp
కొబ్బరి పొడి : 2tsp
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 tsp
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : 4 స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా

తయారు చేయు విధానము:
1. మష్రూమ్స్ ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్‌, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి.
3. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసి కలపాలి. పనీర్‌ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి సాస్‌ వేసి సర్వ్ చేయాలి. అంతే మష్రూమ్, పన్నీ మసాలా రెడీ..

Story first published: Tuesday, August 2, 2011, 17:11 [IST]
Desktop Bottom Promotion