Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
వీకెండ్ స్పెషల్..మనసు దోచే ఎగ్ యఖ్ని పులావ్..ఎలా చేసుకోవాలంటే..
యఖ్ని అంటే సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన పోషకాలతో నిండిన స్టాక్ (సూప్). సాంప్రదాయకంగా మటన్తో చేసే ఈ యఖ్ని పులావ్ను, గుడ్లతో కూడా అంతే అద్భుతంగా తయారుచేయవచ్చు. ఎగ్ యఖ్ని పులావ్ బిర్యానీలా ఘాటుగా కాకుండా చాలా మృదువైన, సున్నితమైన రుచులతో ఉంటుంది.
కావలసిన పదార్థాలు
నీళ్ళు - 5 కప్పులు
పెరుగు (గట్టిది) - అర కప్పు
ఉల్లిపాయలు - 2
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8
సోంపు - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
నల్ల యాలకులు - 2
పచ్చి యాలకులు - 4
లవంగాలు - 5
నల్ల మిరియాలు - 10
బిర్యానీ ఆకు - 2
ఉప్పు - రుచికి సరిపడా
పాలు - పావు కప్పు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
ఉడికించిన గుడ్లు - 6
నెయ్యి లేదా నూనె - 4 టేబుల్ స్పూన్లు
షాజీరా- 1 టీస్పూన్
పచ్చి మిర్చి - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పసుపు - పావు టీస్పూన్
కారం -అర టీస్పూన్
వేయించిన ఉల్లిపాయలు - అలంకరణ కోసం
కొత్తిమీర,పుదీనా - అలంకరణ కోసం
పాలలో నానిన కుంకుమపువ్వు - చిటికెడు
తయారుచేయు విధానం
-సోంపు, ధనియాలు, దాల్చినచెక్క, యాలకులు (నల్లవి, పచ్చివి), లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వంటి పొడి మసాలాలన్నింటినీ ఒక శుభ్రమైన పల్చటి బట్టలో కట్టి ఒక చిన్న మూటలా కట్టండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో 5 కప్పుల నీళ్ళు పోయండి. అందులో ముక్కలుగా కోసిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ఉప్పు, సిద్ధం చేసుకున్న మసాలా మూట వేయండి.
-మీడియం మంట మీద నీరు మరగడం ప్రారంభించాక మంటను తగ్గించి సుమారు 20-25 నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వండి. దీంతో మసాలాల సువాసనలన్నీ నీటిలోకి బాగా ఇంకుతాయి.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి యఖ్నిని కొద్దిగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మసాలా పోట్లీని గట్టిగా పిండి రసం తీసి వడకట్టండి.
-వడకట్టిన యఖ్నిలో గిలకొట్టిన పెరుగు, పాలు వేసి బాగా కలపండి. పెరుగు యఖ్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు కలపాలి.
-ఇప్పుడు ఒక చిన్న పాన్ లో కొద్దిగా నూనె వేసి పసుపు, కారం వేసి, గుడ్లను వేసి బంగారు రంగు వచ్చేవరకు ఒకటి లేదా రెండు నిమిషాలు తక్కువ మంట మీద వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మందపాటి గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి వేడి చేశాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యంలోని నీటిని పూర్తిగా వడకట్టి, ఆ బియ్యాన్ని స్టవ్ మీద ఉన్న గిన్నెలో వేసి రెండు నిమిషాలు వేయించండి.
-ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న 4 కప్పుల యఖ్నిని బియ్యంలో పోయండి. మంటను ఎక్కువగా పెట్టి యఖ్ని మరగడం ప్రారంభమయ్యే వరకు ఉంచండి.
-నీరు మరుగుతున్నప్పుడు, వేయించిన గుడ్లను నెమ్మదిగా అన్నంలో అమర్చండి. నీరు బియ్యం పైకి సమానంగా వచ్చినప్పుడు మంటను పూర్తిగా తగ్గించి గిన్నెపై మూత పెట్టండి.
-ఆవిరి బయటకు పోకుండా మూత అంచులను చపాతీ పిండితో సీల్ చేయవచ్చు లేదా బరువైన వస్తువును పెట్టవచ్చు. దీనినే దమ్ చేయడం అంటారు.
- 15-20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాల పాటు మూత తీయకుండా అలాగే వదిలేయండి.
-తర్వాత మూత తీసి పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వును పైన చల్లి, ఒక ఫోర్క్ సహాయంతో అన్నాన్ని సున్నితంగా కలపండి. అంతే ఎగ్ యఖ్ని పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












