Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
దాబా స్టైల్ మేథీ మటర్ మలై..చపాతీలోకి కేక..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
ఈ శీతాకాలంలో మార్కెట్కి వెళ్తే పచ్చని మెంతికూర, తాజా బఠానీలు విరివిగా కనిపిస్తాయి. మరి వీటిని ఉపయోగించి రొటీన్ కూరలు కాకుండా, కాస్త కొత్తగా, రిచ్గా ఏదైనా ట్రై చేయాలని ఉందా? అయితే ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మేథీ మటర్ మలై ట్రై చేయండి.
మెంతికూరలో ఉండే సన్నని చేదు, బఠానీలలో ఉండే తీపి, వీటన్నింటినీ కలుపుతూ వచ్చే క్రీమీ గ్రేవీ.. ఆ రుచే వేరు. ఇది అన్నంలోకి మాత్రమే కాదు, చపాతీ, నాన్, పరాఠాల్లోకి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నా లేదా డిన్నర్ ని స్పెషల్ గా మార్చాలన్నా ఈ రెసిపీ బెస్ట్ ఛాయిస్. మరి ఇంటిల్లిపాది వేళ్లు నాక్కుంటూ తినేలా ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మెంతికూర - 1 కప్పు
పచ్చి బఠానీలు- అర కప్పు
ఉల్లిపాయలు - 2
జీడిపప్పు - 15
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
ఫ్రెష్ క్రీమ్ - అర కప్పు
పాలు - అర కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
పసుపు - చిటికెడు
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
చక్కెర - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా మెంతికూరను శుభ్రం చేసి ఒక గిన్నెలో నీళ్లు, కొంచెం ఉప్పు వేసి అందులో ఆకులను 10-15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీటిని గట్టిగా పిండేసి ఆకులను పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల చేదు తగ్గుతుంది.
-జీడిపప్పును వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టండి.
-తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తని పేస్ట్లా రుబ్బుకోండి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక జీలకర్ర, బిర్యానీ ఆకు వేయండి. అవి చిటపటలాడాక సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ-జీడిపప్పు పేస్ట్ను వేయండి. మంటను మీడియంలో పెట్టి,పచ్చి వాసన పోయి పేస్ట్ నుండి నెయ్యి వేరుపడే వరకు వేయించండి.
-ఇప్పుడు అందులో పసుపు, ధనియాల పొడి వేసి కలిపాక శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి మరో 2-3 నిమిషాలు వేయించండి. ఆకు మెత్తబడిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీలను వేసి కలపండి.
-ఇప్పుడు కూరలో పాలు, ఫ్రెష్ క్రీమ్ పోసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ముఖ్యంగా అర స్పూన్ చక్కెర వేయండి. చక్కెర వేయడం వల్ల మెంతిలోని వగరు తగ్గి, రెస్టారెంట్ రుచి వస్తుంది. మూత పెట్టి సన్నని మంటపై ఒక 5 నిమిషాలు ఉడికించండి.
-గ్రేవీ చిక్కబడి, కమ్మని వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన, క్రీమీ మేథీ మటర్ మలై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




