కూర మాత్రమే కాదు..క్యాబేజీతో కమ్మని పాయసం కూడా..అతిథులను ఆశ్చర్యపరిచే సరికొత్త స్వీట్

Posted By:

శీతాకాలం వచ్చిందంటే చాలు మన వంటిళ్లలో కూరగాయల సందడి మొదలవుతుంది. మార్కెట్ అంతా తాజా కాలీఫ్లవర్, క్యారెట్లతో కళకళలాడుతున్నా వాటి మధ్య ఓ మూలన నిరాడంబరంగా కనిపించే క్యాబేజీ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. క్యాబేజీతో వేపుడు, కూర, పచ్చడి వంటివి మనం రోజూ చేసుకునేవే.

క్యాబేజీ వాసన కొందరికి అంతగా నచ్చదు. అయితే ఆ వాసనను మరిపించి, అద్భుతమైన రుచిని పంచే ఒక కొత్త ప్రయోగం చేస్తే ఎలా ఉంటుంది? అదే ఈ క్యాబేజీ పాయసం. వినడానికి వింతగా ఉన్నా, ఒక్కసారి రుచి చూస్తే మాత్రం మళ్లీ మళ్లీ కావాలనడం ఖాయం. క్యాబేజీ పాయసం మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
తాజా క్యాబేజీ: 1
చిక్కటి పాలు: 1 లీటర్లు
కండెన్స్‌డ్ మిల్క్: అర కప్పు
చక్కెర: అర కప్పు
స్వచ్ఛమైన నెయ్యి: మూడు, నాలుగు టేబుల్ స్పూన్లు
చిన్న యాలకులు- 4
పెద్ద యాలకులు-1
దాల్చిన చెక్క- 1 ఇంచు
జీడిపప్పు, ఎండుద్రాక్ష- గుప్పెడు
ఉప్పు: చిటికెడు

తయారీ విధానం

-ముందుగా క్యాబేజీని శుభ్రంగా కడిగి, దాని పై పొరలను తీసేయండి. లోపల ఉండే తెల్లని, లేత భాగాన్ని మాత్రమే ఎంచుకుని, దాన్ని వీలైనంత సన్నగా తురమండి.

-ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోసి దానిపై ఒక జల్లెడ గిన్నె పెట్టి అందులో తురిమిన క్యాబేజీని వేసి ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. క్యాబేజీని నేరుగా నీటిలో ఉడకబెట్టకూడదు, కేవలం ఆవిరితో దాని పచ్చి వాసన పోతే చాలు.

-ఆ తర్వాత ఉడికిన క్యాబేజీని ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి గట్టిగా పిండి అందులోని నీటిని పూర్తిగా తొలగించాలి. ఎందుకంటే క్యాబేజీలో నీరు ఉంటే పాయసం రుచి మారిపోతుంది.

-ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో రెండు లీటర్ల పాలు పోసి సన్నని మంట మీద మరిగించడం ప్రారంభించండి. పాలు అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి.

-పాలు సగానికి పైగా చిక్కబడ్డాక అందులో దంచిన చిన్న యాలకులు, పెద్ద యాలకులు, దాల్చిన చెక్క వేయండి. ఈ సుగంధ ద్రవ్యాల పరిమళం పాలలో కలిసిపోయి, పాయసానికి ఒక అద్భుతమైన వాసన వస్తుంది. పాలు చిక్కబడి, కోవాలా మారేంత వరకు మరిగించాలి.

-పాలు బాగా చిక్కబడ్డాక ముందుగా సిద్ధం చేసుకున్న క్యాబేజీ తురుమును అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు చిటికెడు ఉప్పు కూడా వేసి కలపండి. ఆ తర్వాత కండెన్స్‌డ్ మిల్క్, చక్కెర కూడా వేసి అన్నీ బాగా కలిసేలా తిప్పాలి.

-చిన్న పాన్‌ లో నెయ్యి వేడి చేసి ఇందులో జీడిపప్పును బంగారు రంగులోకి, ఎండుద్రాక్షను ఉబ్బేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

-పాయసంలో వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలపండి. ఇప్పుడు గిన్నెపై మూతపెట్టి, మంటను పూర్తిగా తగ్గించి, సుమారు 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి.

-మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. పాయసం చిక్కగా, క్రీమీగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే క్యాబేజీ పాయసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 11, 2025, 7:50 [IST]
Desktop Bottom Promotion