సామాజిక ఉద్యమకారిణి మేధా పట్కర్!

By B N Sharma

Medha Patkar
నర్మదా బచావో ఆందోళనతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ డిసెంబరు 1, 1954 న ముంబాయిలో జన్మించింది. తల్లితండ్రులు ఇందు, వసంత కనోల్కర్ ఇద్దరూ సామాజిక సేవా కార్యకర్తలు. టాటా సంస్థలో ఎం.ఏ.సోషల్ వర్క్, తరువాత 7 సంవత్సరాలు వివిధ స్వచ్చంద సంస్థల్లో పనిచేసింది. ఆమె పాట్కర్ ను వివాహం చేసుకుంది అయితే తర్వాతి రోజుల్లో ఆయనతో సామరస్యంగా విడాకులు పొందింది.

ఈమె ఒక ట్రేడ్ యూనియన్ నాయకురాలు, స్వాతంత్ర సమర యోధురాలు. ఆమె తండ్రి స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. నర్మదా బచావ్ ఆందోళనకు సంబంధించి ఈమె బాంబే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ పిటీషన్ కూడా వేసింది.

సర్దార్ సరోవర్ డ్యామ్ పై ఆమె రెండు దశాబ్దాలపాటు నిరంతర పోరాటం సాగించింది. తన సామాజిక కృషికిగాను, ఆమ్ నాస్టీ ఇంటర్నేషనల్, బి.బి.సి మొదలైన సంస్ధలనుండి అనేక అవార్డులు పొందింది.1991 వ సంవత్సరంలో ఆమె రైట్ లైవ్ లీ హుడ్ అవార్డు, 1999 లో ఎం.ఎ. ధామస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు తీసుకుంది. దీనా నాధ్ మంగేష్కర్ అవార్డు, మహాత్మ ఫూలే అవార్డు కూడా ఆమె పొందింది.

ఒకప్పుడు ఆమె టాటా సంస్ధలలో ఉద్యోగం చేసినప్పటికి, సింగూరులో టాటా నానో ప్లాంట్ స్ధాపనకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టి అది అక్కడినుండి తరలిపోవటానికి కారణమయింది.

Story first published: Thursday, March 1, 2012, 17:59 [IST]
Desktop Bottom Promotion