Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
వివాహేతర సంబంధాల్లో దేశంలోనే ఈ ఊరు టాప్!..సగం మందికి పైగా ఎపైర్లు
రోజు రోజుకి సమాజంలో, బంధాల్లో కొత్త కొత్త మార్పులు వచ్చేస్తున్నాయి. సామాజిక కట్టుబాట్లు, సంబంధాల స్వరూపం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్, కెనడా,స్వీడన్,జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం అనుకున్న డేటింగ్ కల్చర్..ఇప్పుడు భారతీయ యువతరాన్ని సైతం అమితంగా ఆకర్షిస్తోంది. అందుకే గత కొంతకాలంగా మనదేశంలో డేటింగ్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మూరుమూల పల్లెటూర్లలో నివసించే వ్యక్తులు కూడా డేటింగ్స్ యాప్ లను వాడటం మొదలుపెట్టారు. అయితే ఈ మార్పు కేవలం యువతకే పరిమితం కాలేదు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నోళ్లు కూడా సరికొత్త సంబంధాల వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోంది. వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నది కలవరపరిచే వాస్తవం.
వివాహేతర సంబంధాలు కోరుకునే వారి కోసమే ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ డేటింగ్ ప్లాట్ ఫామ్ ఆష్లే మాడిసన్ విడుదల చేసిన తాజా నివేదిక భారతీయ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదిక ప్రకారం వివాహేతర సంబంధాల కోసం సైన్ అప్ అవుతున్న వారి సంఖ్యలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ నివేదికలో అత్యంత నివ్వెరపర్చే విషయం ఏంటంటే.. దేశంలోనే అత్యధికంగా వివాహేతర సంబంధాల కోసం సైన్ అప్ లు నమోదైన నగరంగా తమిళనాడులోని కాంచీపురం మొదటి స్థానంలో నిలవడం.

టైర్-2 నగరమైన కాంచీపురం..ఢిల్లీ,ముంబై వంటి మహానగరాలను వెనక్కి నెట్టడం పెద్ద ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జాబితాలో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం నుండి ఏకంగా తొమ్మిది నగరాలు టాప్ 20లో చోటు దక్కించుకోగా..దేశ ఆర్థిక రాజధాని ముంబైకి కనీసం స్థానం కూడా లభించకపోవడం గమనార్హం. జైపూర్, రాయ్గఢ్, చండీగఢ్ వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
భారతదేశంలో వివాహ సంబంధిత సమస్యలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో చెప్పడానికి ఏప్రిల్ లో ఆష్లే మాడిసన్ విడుదల చేసిన సర్వేనే నిదర్శనం. ఆ సర్వేలో పాల్గొన్న భారతీయులలో ఏకంగా 53శాతం మంది తాము వివాహేతర సంబంధం కలిగి ఉన్నామని అంగీకరించారు. భారత్ మాకు ప్రపంచంలో ఆరవ అతిపెద్ద మార్కెట్. ఈ ఏడాది చివరి నాటికి ఇది మరింత వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం అని ఆష్లే మాడిసన్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పాల్ కీబుల్ చెప్పడం ఈ ధోరణి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ వివాహేతర సంబంధాల పెరుగుదల కేవలం సామాజిక మార్పుగానే కాకుండా అనేక నేరాలకు కూడా దారితీస్తోంది. ఇటీవల కాలంలో ఇలాంటి సంబంధాల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు, దాడులు వంటి తీవ్రమైన నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో మానవ సంబంధాలు ఎంత వేగంగా బలహీనపడుతున్నాయో..వివాహ బంధం ఎంత వీక్ గా మారుతోందో ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.



Click it and Unblock the Notifications











