Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
మిరాకిల్ ! ఎవ్వరితో ఎలాంటి శారీరక సంబంధం లేకుండానే పండంటి పాపాయికి జన్మనిచ్చిన మహిళ...
ఓ మహిళ ఏ పురుషుడితోనూ శారీరక సంబంధం పెట్టుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. అదెలా సాధ్యపడిందో మీరే చూడండి.
చాలా మంది కపుల్స్ కు గర్భం విషయంలో.. ఆ కార్యం విషయంలో అనేక సందేహాలు.. అపొహాలు ఉంటాయి. ఏ సమయంలో కలయికలో పాల్గొంటే పిల్లలు పుడతారు..

ఒకవేళ తమకు ఇప్పుడు పిల్లలు వద్దనుకుంటే ఎంత సమయం వరకు వేచి ఉండొచ్చు అనే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు.

అయితే కొంత మంది దంపతులు మాత్రం వివాహం కాగానే, సంతానం కోసం తెగ ప్రయత్నాలు చేస్తారు. అయితే వారికి ఫలితం మాత్రం కొన్నిసార్లు ప్రతికూలంగా వస్తూనే ఉంటుంది. ఇందుకోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వైద్యులను సంప్రదిస్తుంటారు.
అయితే ఏ మహిళ అయిన గర్భం దాల్చడానికి కచ్చితంగా మగాడితో కలయికలో పాల్గొన్న తర్వాత.. అది కూడా నవ మాసాలపాటు కడుపులో బిడ్డను మోసిన తర్వాతనే పండంటి పాపాయికి జన్మనిస్తుంది.

పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. కానీ ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ మాత్రం ఇందుకు విరుద్ధంగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

విచిత్రమేమిటంటే.. ఆమె గర్భవతి అని తెలుసుకున్న గంట వ్యవధిలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది. అయితే అంతకుముందు ఆమె తన భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనలేదట. అయితే ఇది ఎలా సాధ్యపడిందోనని వైద్యులు ఆమెను వెంటనే పరీక్షించారు. దీంతో కొన్ని విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆరోజు రాత్రి..
ఇండోనేషియాకు చెందిన హెనీ అనే మహిళకు ఆరోజు రాత్రి అకస్మాత్తుగా పొత్తి కడుపులో కుడివైపున ఏదో కదులుతున్నట్లు అనిపించిందట.

గంటలోపే బిడ్డకు జననం..
తనకు నొప్పి తీవ్రమవ్వడంతో పొరుగింటి వాళ్ల సాయంతో తన తండ్రి ఇంటికి వెళ్లింది. అయితే అక్కడికి వెళ్లిన గంట వ్యవధిలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చినట్లు ఆ మహిళ తెలిపింది.

అప్పటికే ఇద్దరు పిల్లలు..
అయితే ఆమెకు ఈ బిడ్డ పుట్టకముందే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత 9 నెలలుగా ఆమెకు పీరియడ్స్ కూడా క్రమం తప్పకుండా వచ్చేవట. ఒకవేళ అది ఆగినా ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసేదే.

ఆ లక్షణాలు కనిపించలేదట..
అయితే ఆమెకు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చే సమయంలో సాధారణంగా అందరి శరీరంలో ఏర్పడే వికారం, వాంతులు, బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా ఆమెలో కనిపించలేదట. అయితే రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఆమె కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది.

కలయికకు దూరంగా..
ఈ కారణంగానే ఆమె తన భర్తతో కలయికకు దూరంగా ఉందట. దీంతో ఆమెకు గర్భం వచ్చే అవకాశాలు లేవని డాక్టర్లు చెబున్నారు.

ఈ సంఘటన ఎప్పుడంటే..
30 ఏళ్ల వయసున్న హెనీ నురేని ఇండోనేషియా దేశంలోని మండలసరి అనే గ్రామంలో నివసిస్తోంది. గత కొన్ని నెలలుగా తనకు ప్రెగ్నెంటుకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించలేదని ఆమె తెలిపింది. అయితే, గత నెల జులై 18వ తేదీ రాత్రి అకస్మాత్తుగా వాంతులు అయ్యాయని, ఉన్నట్టుండి కడుపు నొప్పి వచ్చినట్లు తెలిపింది.

దేవుడిచ్చిన వరం..
తనకు నొప్పులు మొదలైన గంట వ్యవధిలోనే పండంటి బిడ్డ పుట్టడం అంటే.. తనకు అది దేవుడు ఇచ్చిన వరమని చెబుతోంది. అయితే ఆమె భర్తతో కలయికలో పాల్గొనకుండా ప్రెగ్నెన్సీ రావడం ఆశ్చర్యమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడి మీడియా, వైద్యులు ఆమె ఇంటికి క్యూ కట్టారు.
మీరు ఇప్పటికీ ఈ విషయాన్ని నమ్మకపోతే.. పైన ఉన్న యూట్యూబ్ వీడియోను చూడండి.. మీరే నమ్ముతారు.



Click it and Unblock the Notifications