Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Relatioship Tips: మీ శృంగారానికి ఇదే అడ్డం.. దాన్ని పక్కన పెట్టారంటే..
చాలా సంబంధాలను స్మార్ట్ ఫోన్లు చంపేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వారి భార్య లేదా భర్తతో గడిపిన సమయం కంటే కూడా స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
సంబంధాలు చాలా మధురమైనవి.. అలాగే చాలా క్లిష్టమైనవి. ప్రతి దంపతుల మధ్య శృంగారం ఎంతో కీలకం. అది బాగుంటేనే ఆ బంధం సాఫీగా సాగుతుంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం చాలా అవసరం. సాన్నిహిత్యం బాగుంటే అది శృంగారానికి దారి తీస్తుంది. అయితే స్మార్ట్ డివైజుల వాడకం పెరిగిన ఈ కాలంలో భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతోందని రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా సంబంధాలను స్మార్ట్ ఫోన్లు చంపేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వారి భార్య లేదా భర్తతో గడిపిన సమయం కంటే కూడా స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 2020లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం 41 శాతం మంది భారతీయులు తమ భాగస్వాములతో మాట్లాడటం కంటే తమ స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతున్నారని పేర్కొంది.

1. కమ్యూనికేషన్
స్మార్ట్ ఫోన్లు సంబంధాల్లో శృంగారాన్ని చంపేస్తున్నాయి. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడానికి స్మార్ట్ ఫోన్లు కారణం. కొంత మంది వ్యక్తులు తమ భాగస్వాములు మాట్లాడుతున్నప్పుడ, తమ భాగస్వాములతో మాట్లాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. సోషల్ మీడియా, వాట్సాప్, మెసేజెస్, ఈ-మెయిల్స్ చెక్ చేస్తూ పరధ్యానంగా మాట్లాడుతుంటారు. దీని వల్ల వారిద్దరి మధ్య కమ్యూనికేషన్ దెబ్బతింటుంది.
అందుకే జీవిత భాగస్వామితో మాట్లాడే సమయంలో ఫోన్ సహా ఏ ఇతర కార్యకలాపాల్లోనూ మునిగిపోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఒకరితో ఒకరు గడపడానికి సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో అది నాణ్యంగా ఉండటం కూడా అంతే ముఖ్యం.

2. సాన్నిహిత్యం తగ్గడం
చాలా మంది వ్యక్తులు వారు పడుకునే ఆఖరి నిమిషం వరకు ఫోన్లు వాడుతూనే ఉంటారు. బెడ్ పై ఉండి కూడా ఫోన్ వాడుతూ, సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. కళ్లు మూతలు పడే వరకు ఫోన్ వాడి, ఆతర్వాత నిద్రలోకి జారుకుంటారు. దీని వల్ల బెడ్ పై కూడా దంపతులు సాన్నిహిత్యంగా ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది.
బెడ్రూములో ఫోన్ వాడకాన్ని పరిమితం చేయాలి. ఒక సమయం వరకు ఫోన్ వాడి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత కొంత సమయాన్ని భాగస్వామి కోసం వెచ్చించాలి. దీని వల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది.

3. సోషల్ మీడియా
సోషల్ మీడియా ప్రస్తుత కాలంలో జీవితంలో భాగమైపోయింది. అది సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సోషల్ మీడియా అనారోగ్యకరమైన పోలికలు, అసూయకు దారి తీస్తుంది. ప్రత్యేకించి మన భాగస్వామి ఆన్ లైన్ లో ఇతరులతో చాటింగ్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు.
అతి ఎప్పుడూ అనర్థమే. సోషల్ మీడియాను వీలైనంత వరకు పరిమితిలో ఉంచాలి. మొత్తానికే వాడకుండా ఉండటం కూడా సరైన పరిష్కారం కాదు.

4. ఎమోషనల్ కనెక్షన్
దంపతుల మధ్య స్మార్ట్ ఫోన్లు భావోద్వేగ కనెక్షన్ కు ఆటంకం కలిగిస్తాయి. మాట్లాడకపోవడం, కలిసి సమయం వెచ్చించకపోవడం, సాన్నిహిత్యం లేకపోవడం వల్ల ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉండదు. దీని వల్ల సంబంధాలు చీలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.



Click it and Unblock the Notifications