Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఛీఛీ..ఏం మనిషివమ్మా: రంకు మొగుడి కోసం కన్న పిల్లల్ని చంపేసిన తల్లి
వివాహేతర సంబంధాల మోజులో పడి కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటి నుంచి వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా తమ బంధానికి అడ్డుపడతారనే అనుమానం ఉన్నా కూడా కట్టుకున్న భర్తను,భార్యను,పిల్లలను హత్య చేయడానికి వెనుకాడట్లేదు. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడి మోజులో పడి అత్యంత దారుణానికి ఒడిగట్టింది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిచ వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కి చెందిన చెన్నయ్య, రజిత భార్యాభర్తలు. 2013లో రజితకి తనకంటే వయస్సులో 20 ఏళ్లు పెద్దవాడైన చెన్నయ్యతో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె భర్త ట్యాంకర్ డ్రైవర్ గా చేస్తున్నాడు. హాయిగా సంసారం సాగిపోతున్న సమయంలో మూడో వ్యక్తి ప్రవేశం జరిగింది. దీంతో అసలు కథ మొదలైంది.

ఇటీవల జరిగిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రజిత తన పాత స్నేహితుడు శివకుమార్ ని కలిసింది. అక్కడ ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఎక్సేంజ్ చేసుకున్నారు. తర్వాత ఫోన్ కాల్స్,చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యారు. క్రమంగా ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని.. పిల్లలు, భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 27న తాను అనుకున్న ప్లాన్ అమలు చేయాలని భావించింది రజిత. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు, భర్తకు విషం కలిపిన అన్నం తినిపించి వారిని చంపాలని ప్లాన్ వేసింది. ఫ్లాన్ ప్రకారం పెరుగన్నంలో విషం కలపాలని నిర్ణయించుకుంది.
అయితే భర్త పప్పు మాత్రమే తిని బయటకి వెళ్లిపోయాడు. పెరుగన్నం తిన్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారని అందరినీ నమ్మించేలా ఫ్లాన్ చేసింది. రాత్రి 11 గంటల సమయంలో భర్త ఇంటికి వచ్చి చూడగా పిలలు చనిపోయి ఉన్నారు. రజిత తొలుత ఫుడ్ పాయిజన్ అని నాటకమాడింది. కడుపు నొప్పి అంటూ డ్రామాలాడటంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించాడు భర్త. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజం అలా బయటపడింది
తన నేరాన్ని దాచిపెట్టడానికి మొదట రజిత పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి పెరుగు అన్నంలో విషం కలిపి చంపానని ఆమె చెప్పింది. పిల్లలు చనిపోయినప్పటికీ తాను బతికి బయటపడ్డానని పోలీసులకు మొదట రజిత చెప్పింది. అయితే పోస్టుమార్టం నివేదిక ప్రకారం పిల్లల శరీరంలో ఎలాంటి విషం కనిపించలేదు. తర్వాత పోలీసులు రజితను తమ స్టైల్ లో విచారించినప్పుడు ఆమె అసలు విషయం బయటపెట్టింది. రజితనే పిల్లలను చంపిందని పోలీసులు నిర్థారించారు. టవల్ తో పిల్లను ఉరి వేసి చంపినట్లు రజిత పోలీసుల విచారణలో అంగీకరించింది. దీంతో రజితను,ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



Click it and Unblock the Notifications











