Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఛీఛీ..ఏం మనిషివమ్మా: రంకు మొగుడి కోసం కన్న పిల్లల్ని చంపేసిన తల్లి
వివాహేతర సంబంధాల మోజులో పడి కన్న బిడ్డలను కూడా చంపేస్తున్నారు. అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ లు వచ్చినప్పటి నుంచి వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా తమ బంధానికి అడ్డుపడతారనే అనుమానం ఉన్నా కూడా కట్టుకున్న భర్తను,భార్యను,పిల్లలను హత్య చేయడానికి వెనుకాడట్లేదు. తాజాగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి తెలంగాణలో చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడి మోజులో పడి అత్యంత దారుణానికి ఒడిగట్టింది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో వివాహేతర సంబంధం కారణంగా ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిచ వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ కి చెందిన చెన్నయ్య, రజిత భార్యాభర్తలు. 2013లో రజితకి తనకంటే వయస్సులో 20 ఏళ్లు పెద్దవాడైన చెన్నయ్యతో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. రజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, ఆమె భర్త ట్యాంకర్ డ్రైవర్ గా చేస్తున్నాడు. హాయిగా సంసారం సాగిపోతున్న సమయంలో మూడో వ్యక్తి ప్రవేశం జరిగింది. దీంతో అసలు కథ మొదలైంది.

ఇటీవల జరిగిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రజిత తన పాత స్నేహితుడు శివకుమార్ ని కలిసింది. అక్కడ ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఎక్సేంజ్ చేసుకున్నారు. తర్వాత ఫోన్ కాల్స్,చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యారు. క్రమంగా ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని.. పిల్లలు, భర్తను అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మార్చి 27న తాను అనుకున్న ప్లాన్ అమలు చేయాలని భావించింది రజిత. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు, భర్తకు విషం కలిపిన అన్నం తినిపించి వారిని చంపాలని ప్లాన్ వేసింది. ఫ్లాన్ ప్రకారం పెరుగన్నంలో విషం కలపాలని నిర్ణయించుకుంది.
అయితే భర్త పప్పు మాత్రమే తిని బయటకి వెళ్లిపోయాడు. పెరుగన్నం తిన్న పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారని అందరినీ నమ్మించేలా ఫ్లాన్ చేసింది. రాత్రి 11 గంటల సమయంలో భర్త ఇంటికి వచ్చి చూడగా పిలలు చనిపోయి ఉన్నారు. రజిత తొలుత ఫుడ్ పాయిజన్ అని నాటకమాడింది. కడుపు నొప్పి అంటూ డ్రామాలాడటంతో వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించాడు భర్త. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిజం అలా బయటపడింది
తన నేరాన్ని దాచిపెట్టడానికి మొదట రజిత పోలీసులకు తప్పుడు వాంగ్మూలం ఇచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి పెరుగు అన్నంలో విషం కలిపి చంపానని ఆమె చెప్పింది. పిల్లలు చనిపోయినప్పటికీ తాను బతికి బయటపడ్డానని పోలీసులకు మొదట రజిత చెప్పింది. అయితే పోస్టుమార్టం నివేదిక ప్రకారం పిల్లల శరీరంలో ఎలాంటి విషం కనిపించలేదు. తర్వాత పోలీసులు రజితను తమ స్టైల్ లో విచారించినప్పుడు ఆమె అసలు విషయం బయటపెట్టింది. రజితనే పిల్లలను చంపిందని పోలీసులు నిర్థారించారు. టవల్ తో పిల్లను ఉరి వేసి చంపినట్లు రజిత పోలీసుల విచారణలో అంగీకరించింది. దీంతో రజితను,ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.



Click it and Unblock the Notifications











