Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన అత్త.. ఎందుకో తెలుసా?
పూర్వ కాలంలో మన దేశంలో బంధాలకు బంధుత్వాలకు ఎంత విలువ ఇచ్చేవారో ఇప్పుడు అంతలా దిగజారిపోతున్నారు. కొడుకు తండ్రి, అత్తా కోడలు, భార్య భర్త.. ఇలా తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వాటి నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ అత్త కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంటుంది. అసలు అత్త కోడలికి ఎందుకు ఎలుకల మందు తాగించింది, దానికి ఎందుకు కారణమయ్యింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏం జరిగిందంటే?
తరచూ తనతో గొడవ పడుతుందని ఓ అత్త తన కోడలికి ఎలుకల మందు ఇచ్చి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్లోని రామాంజపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే ముడావత్ ధూళి(38) అనే మహిళ గత రెండు నెలలుగా కనిపించడం లేదని ఆమె భర్త ముడావత్ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా పోలీసులు విచారణ జరపగా.. ధూళి అత్త తులసి ధూళిని హత్య చేసినట్లు తేలింది. దీనికి కారణం ఏంటంటే?

వేధింపులే
తన కోడలు ధూళి ఎప్పుడూ తనతో గొడవ పడుతుండేదని, అసలు తనకు మనశ్శాంతి లేకుండా చేసేదని తులసి తెలిపింది. దీంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న తులసి.. కోడలిని పథకం ప్రకారం తన వద్దకు పిలిపించుకుంది. కోడలిని ఆ పథకం ప్రకారమే కల్లు దుకాణానికి పిలిపించి.. కల్లులో ఎలుకల మందు కలిపి తాగించింది. దీంతో ధూళి మరణించగా.. ఆమెను కళ్ళు దుకాణం పక్కనే ఉన్న మట్టి కుప్పలో పాతిపెట్టినట్లు తులసి నిజాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఏం నేర్చుకోవాలంటే?
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచంలో అత్త కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అత్త అంటే కోడలికి, కోడలు అంటే అత్తకు పడని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి సందర్భంగా అత్త అయినా కోడలైనా కొంత ఓపికతో ఉండాలి. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకోకూడదు. ఇద్దరూ ఎంతో ఓపికగా ఉంటూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి. అప్పుడే వారి మధ్య బంధం బలంగా ఉంటుంది.
అలాగే కొడుకుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. చాలామంది బయటికి చెప్పుకోరు కానీ.. అత్త కోడలి గొడవల కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బయటి ఘర్షణలతో పాటు అత్త కోడలి ఘర్షణ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే అత్త కోడలు మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications