Latest Updates
-
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్వెజ్ కూడా దిగదుడుపే.!
కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన అత్త.. ఎందుకో తెలుసా?
పూర్వ కాలంలో మన దేశంలో బంధాలకు బంధుత్వాలకు ఎంత విలువ ఇచ్చేవారో ఇప్పుడు అంతలా దిగజారిపోతున్నారు. కొడుకు తండ్రి, అత్తా కోడలు, భార్య భర్త.. ఇలా తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వాటి నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ అత్త కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంటుంది. అసలు అత్త కోడలికి ఎందుకు ఎలుకల మందు తాగించింది, దానికి ఎందుకు కారణమయ్యింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏం జరిగిందంటే?
తరచూ తనతో గొడవ పడుతుందని ఓ అత్త తన కోడలికి ఎలుకల మందు ఇచ్చి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్లోని రామాంజపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే ముడావత్ ధూళి(38) అనే మహిళ గత రెండు నెలలుగా కనిపించడం లేదని ఆమె భర్త ముడావత్ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా పోలీసులు విచారణ జరపగా.. ధూళి అత్త తులసి ధూళిని హత్య చేసినట్లు తేలింది. దీనికి కారణం ఏంటంటే?

వేధింపులే
తన కోడలు ధూళి ఎప్పుడూ తనతో గొడవ పడుతుండేదని, అసలు తనకు మనశ్శాంతి లేకుండా చేసేదని తులసి తెలిపింది. దీంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న తులసి.. కోడలిని పథకం ప్రకారం తన వద్దకు పిలిపించుకుంది. కోడలిని ఆ పథకం ప్రకారమే కల్లు దుకాణానికి పిలిపించి.. కల్లులో ఎలుకల మందు కలిపి తాగించింది. దీంతో ధూళి మరణించగా.. ఆమెను కళ్ళు దుకాణం పక్కనే ఉన్న మట్టి కుప్పలో పాతిపెట్టినట్లు తులసి నిజాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఏం నేర్చుకోవాలంటే?
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచంలో అత్త కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అత్త అంటే కోడలికి, కోడలు అంటే అత్తకు పడని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి సందర్భంగా అత్త అయినా కోడలైనా కొంత ఓపికతో ఉండాలి. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకోకూడదు. ఇద్దరూ ఎంతో ఓపికగా ఉంటూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి. అప్పుడే వారి మధ్య బంధం బలంగా ఉంటుంది.
అలాగే కొడుకుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. చాలామంది బయటికి చెప్పుకోరు కానీ.. అత్త కోడలి గొడవల కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బయటి ఘర్షణలతో పాటు అత్త కోడలి ఘర్షణ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే అత్త కోడలు మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications