Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన అత్త.. ఎందుకో తెలుసా?
పూర్వ కాలంలో మన దేశంలో బంధాలకు బంధుత్వాలకు ఎంత విలువ ఇచ్చేవారో ఇప్పుడు అంతలా దిగజారిపోతున్నారు. కొడుకు తండ్రి, అత్తా కోడలు, భార్య భర్త.. ఇలా తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. వాటి నుంచి అందరూ నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ అత్త కోడలికి ఎలుకల మందు ఇచ్చి చంపిన ఘటన తెలంగాణలో చోటు చేసుకుంటుంది. అసలు అత్త కోడలికి ఎందుకు ఎలుకల మందు తాగించింది, దానికి ఎందుకు కారణమయ్యింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు ఏం జరిగిందంటే?
తరచూ తనతో గొడవ పడుతుందని ఓ అత్త తన కోడలికి ఎలుకల మందు ఇచ్చి హత్య చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్లోని రామాంజపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే ముడావత్ ధూళి(38) అనే మహిళ గత రెండు నెలలుగా కనిపించడం లేదని ఆమె భర్త ముడావత్ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా పోలీసులు విచారణ జరపగా.. ధూళి అత్త తులసి ధూళిని హత్య చేసినట్లు తేలింది. దీనికి కారణం ఏంటంటే?

వేధింపులే
తన కోడలు ధూళి ఎప్పుడూ తనతో గొడవ పడుతుండేదని, అసలు తనకు మనశ్శాంతి లేకుండా చేసేదని తులసి తెలిపింది. దీంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న తులసి.. కోడలిని పథకం ప్రకారం తన వద్దకు పిలిపించుకుంది. కోడలిని ఆ పథకం ప్రకారమే కల్లు దుకాణానికి పిలిపించి.. కల్లులో ఎలుకల మందు కలిపి తాగించింది. దీంతో ధూళి మరణించగా.. ఆమెను కళ్ళు దుకాణం పక్కనే ఉన్న మట్టి కుప్పలో పాతిపెట్టినట్లు తులసి నిజాలు ఒప్పుకుంది. దీంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఏం నేర్చుకోవాలంటే?
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచంలో అత్త కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. అత్త అంటే కోడలికి, కోడలు అంటే అత్తకు పడని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అయితే ఎలాంటి సందర్భంగా అత్త అయినా కోడలైనా కొంత ఓపికతో ఉండాలి. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకోకూడదు. ఇద్దరూ ఎంతో ఓపికగా ఉంటూ ఒకరిని ఒకరు అర్ధం చేసుకోవాలి. అప్పుడే వారి మధ్య బంధం బలంగా ఉంటుంది.
అలాగే కొడుకుపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. చాలామంది బయటికి చెప్పుకోరు కానీ.. అత్త కోడలి గొడవల కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. బయటి ఘర్షణలతో పాటు అత్త కోడలి ఘర్షణ కారణంగా ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకే అత్త కోడలు మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications