Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
మంచాన పడ్డ భర్త..ఆరేళ్లు సేవలు చేసిన భార్య..కోలుకున్నాక వదిలేసిన మొగుడు!
తమకు ఎంత సేవ చేసినా కృతజ్ణతా భావం లేని జాతి ప్రజలు అంటూ రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఓ వ్యక్తి దానిని నిజం చేసి చూపించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రమాదంలో గాయపడి మంచాన పడితే, ఆ భార్య అతడికి కంటికి రెప్పలా సేవ చేసింది. ఆరేళ్ల పాటు చంటిబిడ్డను చూసుకున్నట్లు సేవలు చేసింది. తీరా కోలుకున్నాక ఆమెను వదిలేశాడు మొగుడు. అంతటితో ఆగకుండా అతడు చేసిన పనికి అందరూ ఛీ నీచుడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మలేషియా దేశానికి చెందిన నూరుల్ సయాజ్వానీ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. వారి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో పెళ్లయిన రెండేళ్లకే ఆమె భర్త ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి, పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి నూరుల్ జీవితం మారిపోయింది. తన భర్తను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆరేళ్ల పాటు అతడికి తినిపించడం, స్నానం చేయించడం, డైపర్లు మార్చడం వంటి పనులన్నీ తానే దగ్గరుండి చేసింది. కన్నబిడ్డలా చూసుకుంటూ అతనికి పునర్జన్మ ఇచ్చింది. అయితే, అందరి ప్రార్థనలు ఫలించి, నూరుల్ సేవలు ఫలించి అతను పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఆరోగ్యం కుదుటపడ్డాక అతను తన అసలు రంగు చూపించాడు. తన కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన భార్యను కృతజ్ఞత లేకుండా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల నూరుల్ కు విడాకులు ఇచ్చి సరిగ్గా వారం రోజులకే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ దారుణమైన నిజాన్ని నూరుల్ సోషల్ మీడియాలో ఎంతో హుందాగా పంచుకుంది. తన మాజీ భర్త రెండో పెళ్లి ఫోటోను పోస్ట్ చేస్తూ..నా భర్తకు శుభాకాంక్షలు. నువ్వు ఎంచుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను. నాలానే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని ఆశిస్తున్నాను. నా బాధ్యత పూర్తయింది అని రాసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.
నెటిజన్లు ఆ భర్తపై విమర్శల వర్షం కురిపించారు. ప్రాణాలు కాపాడిన భార్యకే ద్రోహం చేస్తావా? అంటూ అతన్ని నమ్మకద్రోహి అని నిందించారు. ఇంత కృతజ్ఞత లేని మనుషులు ఉంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం పెరగడంతో నూరుల్ ఆ పోస్ట్ను తొలగించింది. కానీ ఈ సంఘటన మానవ సంబంధాల్లోని కృతజ్ఞత, త్యాగం, నమ్మకద్రోహం వంటి అంశాలపై తీవ్రమైన చర్చకు దారితీసింది.



Click it and Unblock the Notifications