Latest Updates
-
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!
మంచాన పడ్డ భర్త..ఆరేళ్లు సేవలు చేసిన భార్య..కోలుకున్నాక వదిలేసిన మొగుడు!
తమకు ఎంత సేవ చేసినా కృతజ్ణతా భావం లేని జాతి ప్రజలు అంటూ రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఓ వ్యక్తి దానిని నిజం చేసి చూపించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రమాదంలో గాయపడి మంచాన పడితే, ఆ భార్య అతడికి కంటికి రెప్పలా సేవ చేసింది. ఆరేళ్ల పాటు చంటిబిడ్డను చూసుకున్నట్లు సేవలు చేసింది. తీరా కోలుకున్నాక ఆమెను వదిలేశాడు మొగుడు. అంతటితో ఆగకుండా అతడు చేసిన పనికి అందరూ ఛీ నీచుడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మలేషియా దేశానికి చెందిన నూరుల్ సయాజ్వానీ 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుంది. వారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. వారి జీవితం సంతోషంగా సాగిపోతున్న సమయంలో పెళ్లయిన రెండేళ్లకే ఆమె భర్త ఘోర కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి, పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అప్పటి నుంచి నూరుల్ జీవితం మారిపోయింది. తన భర్తను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆరేళ్ల పాటు అతడికి తినిపించడం, స్నానం చేయించడం, డైపర్లు మార్చడం వంటి పనులన్నీ తానే దగ్గరుండి చేసింది. కన్నబిడ్డలా చూసుకుంటూ అతనికి పునర్జన్మ ఇచ్చింది. అయితే, అందరి ప్రార్థనలు ఫలించి, నూరుల్ సేవలు ఫలించి అతను పూర్తిగా కోలుకున్నాడు. మళ్లీ మామూలు మనిషి అయ్యాడు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఆరోగ్యం కుదుటపడ్డాక అతను తన అసలు రంగు చూపించాడు. తన కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన భార్యను కృతజ్ఞత లేకుండా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల నూరుల్ కు విడాకులు ఇచ్చి సరిగ్గా వారం రోజులకే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ దారుణమైన నిజాన్ని నూరుల్ సోషల్ మీడియాలో ఎంతో హుందాగా పంచుకుంది. తన మాజీ భర్త రెండో పెళ్లి ఫోటోను పోస్ట్ చేస్తూ..నా భర్తకు శుభాకాంక్షలు. నువ్వు ఎంచుకున్న వ్యక్తితో సంతోషంగా ఉంటావని ఆశిస్తున్నాను. నాలానే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుందని ఆశిస్తున్నాను. నా బాధ్యత పూర్తయింది అని రాసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.
నెటిజన్లు ఆ భర్తపై విమర్శల వర్షం కురిపించారు. ప్రాణాలు కాపాడిన భార్యకే ద్రోహం చేస్తావా? అంటూ అతన్ని నమ్మకద్రోహి అని నిందించారు. ఇంత కృతజ్ఞత లేని మనుషులు ఉంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం పెరగడంతో నూరుల్ ఆ పోస్ట్ను తొలగించింది. కానీ ఈ సంఘటన మానవ సంబంధాల్లోని కృతజ్ఞత, త్యాగం, నమ్మకద్రోహం వంటి అంశాలపై తీవ్రమైన చర్చకు దారితీసింది.



Click it and Unblock the Notifications











