Latest Updates
-
భార్యా భర్తలు పక్కపక్కన కూర్చుని ఫోన్లు చూస్తున్నారు ఈ దృశ్యం మీ ఇంట్లోనూ ఉందా? -
చికెన్ లవర్స్ కు పండుగే.. రెండు రకాల సాస్ లతో అదరగొట్టే బ్యాంగ్ బ్యాంగ్ చికెన్.. -
బయట దొరికేలాగే.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రెడ్ సాస్ పాస్తా ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు! -
బాధ పెడుతున్నా వదిలిపెట్టలేకపోతున్నారా? మనస్తత్వ శాస్త్రం చెప్పే కారణం ఇది -
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా! -
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.! -
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు -
ప్రేమ పేరిట జైలు జీవితం గడుపుతున్నారా? మీ భాగస్వామిలో ఈ లక్షణాలు ఉంటే అది విషపూరిత బంధమే! -
కొబ్బరి చేపల పులుసు ఇలా చేస్తే అద్భుతమైన రుచి..రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం ఆ సీక్రెట్ రివీల్!
సోషల్ మీడియాలో 'లైక్' కొట్టారా? అయితే మీ కాపురం డేంజర్లో పడ్డట్టే!..కోర్టు సంచలన తీర్పు
ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి లేడు అని చెప్పొచ్చు. బిక్షాటన చేస్తున్నవాళ్లు కూడా మంచి మంచి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ అనేది అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. అయితే మంచి ఉన్నచోట చెడు కూడా ఉంటది అన్నట్లు స్మార్ట్ ఫోన్ వల్ల నేరాలు పెరుగుతున్నాయి, కాపురాలు కూలిపోతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం.
స్మార్ట్ ఫోన్ వాడే అందరూ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లను కూడా ఉపయోగిస్తుంటారు. సోషల్ మీడియాలో నచ్చిన ఫోటోకి లైక్ కొట్టడం లేదా నచ్చిన వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేమడం వంటిది అందరూ చేసే పనే. సోషల్ మీడియాలో పోస్టులకు లైక్ కొడితే కాపురాలు కూలిపోతాయా? ఈ ప్రశ్నకు ఓ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సోషల్ మీడియాలో భర్త వేరే మహిళల ఫోటోలను లైక్ చేయడం వల్ల ఓ కాపురం కోర్టు మెట్లెక్కింది.

అసలేం జరిగింది?
టర్కీకి చెందిన ఓ వివాహిత మహిళ తన భర్త ప్రవర్తనపై విసిగిపోయి కోర్టును ఆశ్రయించింది. తన భర్త సోషల్ మీడియాలో నిరంతరం ఇతర మహిళల ఫోటోలను చూస్తున్నాడని, వాటిని లైక్ చేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ప్రవర్తన తనను తీవ్రంగా అవమానించడమే కాకుండా, తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని వాపోయింది.
నా భర్త ప్రవర్తన వల్ల మా మధ్య నమ్మకం సన్నగిల్లింది, ఇది మా దాంపత్య జీవితానికి ముప్పుగా మారింది అని ఆమె న్యాయస్థానం ముందు కన్నీరు పెట్టుకుంది. దీనికి పరిహారంగా భర్త నుంచి భరణం, నష్టపరిహారం కావాలని డిమాండ్ చేసింది.
కోర్టు సంచలన తీర్పు
ఈ కేసును విచారించిన టర్కీ సివిల్ కోర్టు అప్పీలేట్ డివిజన్..భర్తదే తప్పు అని తేల్చిచెప్పింది. భర్త చేసిన పనిని తీవ్రమైన దోషంగా పరిగణించింది. వేరే మహిళల ఫోటోలను లైక్ చేయడం నేరుగా వివాహేతర సంబంధం కాకపోయినా అది భార్యకు మానసిక వేదన కలిగిస్తుందని,వివాహ బంధంలోని నమ్మకాన్ని దెబ్బతీస్తుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
శిక్షగా భర్తకు 85,000 రూపాయల భౌతిక పరిహారం, మరో 85,000 నైతిక పరిహారం, భార్యకు నెలవారీ జీవనోపాధి చెల్లించాలని ఆదేశించింది. భవిష్యత్తులో వచ్చే వైవాహిక వివాదాలకు ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని కోర్టు తెలిపింది.
సోషల్ మీడియా వల్ల కాపురాల్లో చిచ్చు రేగకూడదంటే
-మీరు చేసే పోస్ట్, కామెంట్ లేదా లైక్ మీ భాగస్వామిని బాధపెడుతుందా లేదా అని ఒక్క క్షణం ఆలోచించండి. వారి భావాలకు విలువ ఇవ్వండి.
-సోషల్ మీడియాలో ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరితో చాట్ చేయాలి అనే విషయంలో ఇద్దరూ మాట్లాడుకుని ఒక అవగాహనకు రండి. పరస్పర సమ్మతి చాలా ముఖ్యం.
-మీ వ్యక్తిగత విషయాలు, గొడవలు లేదా అతిగా భావోద్వేగమైన పోస్టులను సోషల్ మీడియాలో పంచుకోవద్దు.
-నిరంతరం నోటిఫికేషన్లు చూసుకోవడం, లైకుల కోసం ఆరాటపడటం అనే వ్యసనం మీ నిజ జీవిత బంధాలను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications