Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మానసిక మోసం vs శారీరక ద్రోహం..ఏది ఎక్కువ ప్రమాదకరం? హీరోయిన్స్ ఏమంటున్నారు?
ఈ ప్రపంచంలో ఏ రిలేసన్ కి అయినా ముఖ్యమైన పునాదులు రెండు..అవే ప్రేమ,నమ్మకం. అయితే ఒక వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తూ రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటి చర్యలు ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీస్తుంది, వారి మనశ్శాంతిని దూరం చేస్తుంది.
అయితే ఈ షోలో కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. శారీరక మోసం కన్నా భావోద్వేగ మోసం ఎక్కువ ప్రమాదకరమా? అని అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ రెండు మోసాలూ తప్పే, ఒకదానితో మరొకదాన్ని పోల్చలేం అని సమాధానమిచ్చారు.

కానీ కాజోల్, ట్వింకిల్, కరణ్ జోహార్ మాత్రం ముక్తకంఠంతో భావోద్వేగ మోసమే ఎక్కువ బాధిస్తుంది అని తేల్చిచెప్పారు. వారి ప్రకారం శారీరక ద్రోహం అనేది ఒక క్షణంలో జరిగిపోయే పొరపాటు కావచ్చు, కానీ మనసు వేరొకరిపైకి మళ్లడం అంటే బంధం పునాది కదిలిపోయినట్టే. ఇది నమ్మకాన్ని, హృదయాన్ని ముక్కలు చేస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
సెలబ్రిటీల మాటలు పక్కన పెడితే రిలేషన్ షిప్ నిపుణులు ఏంటున్నారంటే.. శారీరక ద్రోహం జరిగిన తర్వాత జంటలు తిరిగి ఒకటి కావడం సాధ్యమేమో కానీ భావోద్వేగ ద్రోహం తర్వాత బంధంలో నమ్మకాన్ని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఈ రోజుల్లో కౌన్సెలింగ్ కోసం వచ్చే చాలామంది జంటలుతమ భాగస్వామి శారీరకంగా మోసం చేశారని కాకుండా, తమను మానసికంగా ఒంటరిని చేశారనే బాధతోనే వస్తారని చెబుతున్నారు.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, వాట్సాప్ చాట్లు, అర్థరాత్రి సంభాషణలు కంటికి కనిపించని ఈ మానసిక ద్రోహానికి సులభమైన మార్గాలుగా మారాయి. స్నేహం పేరుతో మొదలయ్యే ఈ బంధం, క్రమంగా భావోద్వేగ ఆధారపడటంగా మారి అసలు సంబంధాన్ని బలహీనపరుస్తుంది.
పరిష్కారం ఏమిటి?
ఒకప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నా కూడా సామాజిక భయం, పరువు పోతుందనే సిగ్గుతో ఎవరూ వాటి గురించి బయటపడేవారు కాదు. కానీ నేటి తరం ఈ విషయాలపై బహిరంగంగా చర్చిస్తోంది. అయితే శారీరక, భావోద్వేగ ద్రోహాలకు మూల కారణాలు దాదాపు ఒకటే.. భాగస్వాముల మధ్య భావోద్వేగ దూరం, తీరని కోరికలు, సరైన సంభాషణ లేకపోవడం. బంధంలో నమ్మకం, అనుబంధం తగ్గినప్పుడు, ఎలాంటి మోసానికైనా ఆస్కారం ఉంటుంది.
మీ భాగస్వామి మీకు దూరమవుతున్నారని అనిపిస్తే, మొహమాటం లేకుండా వారితో మాట్లాడండి. మీ భావాలను పంచుకోండి. ఏ సంబంధమూ పరిపూర్ణంగా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుని, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. నిజాయితీ, సంభాషణ ద్వారా విరిగిన నమ్మకాన్ని కూడా తిరిగి పొందవచ్చు.



Click it and Unblock the Notifications