Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
మానసిక మోసం vs శారీరక ద్రోహం..ఏది ఎక్కువ ప్రమాదకరం? హీరోయిన్స్ ఏమంటున్నారు?
ఈ ప్రపంచంలో ఏ రిలేసన్ కి అయినా ముఖ్యమైన పునాదులు రెండు..అవే ప్రేమ,నమ్మకం. అయితే ఒక వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తూ రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటి చర్యలు ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీస్తుంది, వారి మనశ్శాంతిని దూరం చేస్తుంది.
అయితే ఈ షోలో కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. శారీరక మోసం కన్నా భావోద్వేగ మోసం ఎక్కువ ప్రమాదకరమా? అని అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ రెండు మోసాలూ తప్పే, ఒకదానితో మరొకదాన్ని పోల్చలేం అని సమాధానమిచ్చారు.

కానీ కాజోల్, ట్వింకిల్, కరణ్ జోహార్ మాత్రం ముక్తకంఠంతో భావోద్వేగ మోసమే ఎక్కువ బాధిస్తుంది అని తేల్చిచెప్పారు. వారి ప్రకారం శారీరక ద్రోహం అనేది ఒక క్షణంలో జరిగిపోయే పొరపాటు కావచ్చు, కానీ మనసు వేరొకరిపైకి మళ్లడం అంటే బంధం పునాది కదిలిపోయినట్టే. ఇది నమ్మకాన్ని, హృదయాన్ని ముక్కలు చేస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
సెలబ్రిటీల మాటలు పక్కన పెడితే రిలేషన్ షిప్ నిపుణులు ఏంటున్నారంటే.. శారీరక ద్రోహం జరిగిన తర్వాత జంటలు తిరిగి ఒకటి కావడం సాధ్యమేమో కానీ భావోద్వేగ ద్రోహం తర్వాత బంధంలో నమ్మకాన్ని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఈ రోజుల్లో కౌన్సెలింగ్ కోసం వచ్చే చాలామంది జంటలుతమ భాగస్వామి శారీరకంగా మోసం చేశారని కాకుండా, తమను మానసికంగా ఒంటరిని చేశారనే బాధతోనే వస్తారని చెబుతున్నారు.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, వాట్సాప్ చాట్లు, అర్థరాత్రి సంభాషణలు కంటికి కనిపించని ఈ మానసిక ద్రోహానికి సులభమైన మార్గాలుగా మారాయి. స్నేహం పేరుతో మొదలయ్యే ఈ బంధం, క్రమంగా భావోద్వేగ ఆధారపడటంగా మారి అసలు సంబంధాన్ని బలహీనపరుస్తుంది.
పరిష్కారం ఏమిటి?
ఒకప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నా కూడా సామాజిక భయం, పరువు పోతుందనే సిగ్గుతో ఎవరూ వాటి గురించి బయటపడేవారు కాదు. కానీ నేటి తరం ఈ విషయాలపై బహిరంగంగా చర్చిస్తోంది. అయితే శారీరక, భావోద్వేగ ద్రోహాలకు మూల కారణాలు దాదాపు ఒకటే.. భాగస్వాముల మధ్య భావోద్వేగ దూరం, తీరని కోరికలు, సరైన సంభాషణ లేకపోవడం. బంధంలో నమ్మకం, అనుబంధం తగ్గినప్పుడు, ఎలాంటి మోసానికైనా ఆస్కారం ఉంటుంది.
మీ భాగస్వామి మీకు దూరమవుతున్నారని అనిపిస్తే, మొహమాటం లేకుండా వారితో మాట్లాడండి. మీ భావాలను పంచుకోండి. ఏ సంబంధమూ పరిపూర్ణంగా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుని, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. నిజాయితీ, సంభాషణ ద్వారా విరిగిన నమ్మకాన్ని కూడా తిరిగి పొందవచ్చు.



Click it and Unblock the Notifications











