Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
మానసిక మోసం vs శారీరక ద్రోహం..ఏది ఎక్కువ ప్రమాదకరం? హీరోయిన్స్ ఏమంటున్నారు?
ఈ ప్రపంచంలో ఏ రిలేసన్ కి అయినా ముఖ్యమైన పునాదులు రెండు..అవే ప్రేమ,నమ్మకం. అయితే ఒక వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తూ రహస్యంగా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటి చర్యలు ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీస్తుంది, వారి మనశ్శాంతిని దూరం చేస్తుంది.
అయితే ఈ షోలో కరణ్ జోహార్, జాన్వీ కపూర్ కూడా పాల్గొన్నారు. శారీరక మోసం కన్నా భావోద్వేగ మోసం ఎక్కువ ప్రమాదకరమా? అని అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ రెండు మోసాలూ తప్పే, ఒకదానితో మరొకదాన్ని పోల్చలేం అని సమాధానమిచ్చారు.

కానీ కాజోల్, ట్వింకిల్, కరణ్ జోహార్ మాత్రం ముక్తకంఠంతో భావోద్వేగ మోసమే ఎక్కువ బాధిస్తుంది అని తేల్చిచెప్పారు. వారి ప్రకారం శారీరక ద్రోహం అనేది ఒక క్షణంలో జరిగిపోయే పొరపాటు కావచ్చు, కానీ మనసు వేరొకరిపైకి మళ్లడం అంటే బంధం పునాది కదిలిపోయినట్టే. ఇది నమ్మకాన్ని, హృదయాన్ని ముక్కలు చేస్తుంది.
నిపుణులు ఏమంటున్నారు?
సెలబ్రిటీల మాటలు పక్కన పెడితే రిలేషన్ షిప్ నిపుణులు ఏంటున్నారంటే.. శారీరక ద్రోహం జరిగిన తర్వాత జంటలు తిరిగి ఒకటి కావడం సాధ్యమేమో కానీ భావోద్వేగ ద్రోహం తర్వాత బంధంలో నమ్మకాన్ని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఈ రోజుల్లో కౌన్సెలింగ్ కోసం వచ్చే చాలామంది జంటలుతమ భాగస్వామి శారీరకంగా మోసం చేశారని కాకుండా, తమను మానసికంగా ఒంటరిని చేశారనే బాధతోనే వస్తారని చెబుతున్నారు.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, వాట్సాప్ చాట్లు, అర్థరాత్రి సంభాషణలు కంటికి కనిపించని ఈ మానసిక ద్రోహానికి సులభమైన మార్గాలుగా మారాయి. స్నేహం పేరుతో మొదలయ్యే ఈ బంధం, క్రమంగా భావోద్వేగ ఆధారపడటంగా మారి అసలు సంబంధాన్ని బలహీనపరుస్తుంది.
పరిష్కారం ఏమిటి?
ఒకప్పుడు వివాహేతర సంబంధాలు ఉన్నా కూడా సామాజిక భయం, పరువు పోతుందనే సిగ్గుతో ఎవరూ వాటి గురించి బయటపడేవారు కాదు. కానీ నేటి తరం ఈ విషయాలపై బహిరంగంగా చర్చిస్తోంది. అయితే శారీరక, భావోద్వేగ ద్రోహాలకు మూల కారణాలు దాదాపు ఒకటే.. భాగస్వాముల మధ్య భావోద్వేగ దూరం, తీరని కోరికలు, సరైన సంభాషణ లేకపోవడం. బంధంలో నమ్మకం, అనుబంధం తగ్గినప్పుడు, ఎలాంటి మోసానికైనా ఆస్కారం ఉంటుంది.
మీ భాగస్వామి మీకు దూరమవుతున్నారని అనిపిస్తే, మొహమాటం లేకుండా వారితో మాట్లాడండి. మీ భావాలను పంచుకోండి. ఏ సంబంధమూ పరిపూర్ణంగా ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుని, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. నిజాయితీ, సంభాషణ ద్వారా విరిగిన నమ్మకాన్ని కూడా తిరిగి పొందవచ్చు.



Click it and Unblock the Notifications