Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఆస్తి ఉన్న భర్తను వదిలేసి బిచ్చగాడితో లేచిపోయిన భార్య.. ఎందుకంటే?
140 కోట్ల మంది ఉన్న మన భారత దేశంలో ప్రతి రోజూ ఎదో ఒక మూల ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. ఎదో ఒక ప్రదేశంలో ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఎదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. వాటి గురించి తెలిసినప్పుడు యావత్ దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఈ ఘటన వినడానికి విడ్డూరంగా ఉన్నా.. కొందరికి గుణపాఠం కూడా అవ్వబోతుంది. అసలు ఉత్తప్రదేశ్లో ఏం జరిగింది? ఎవరికి ఇది గుణపాఠంగా మారబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
అసలు ఏం జరిగిందంటే..
ఉత్తర ప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో ఓ రాజేశ్వరి అనే ఓ మహిళ తన భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి నన్హే పండిట్ అనే బిచ్చగాడితో లేచిపోయింది. ఈ మేరకు రాజేశ్వరి భర్త రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నన్హే పండిట్ తమ విధితో పాటు చుట్టూ పక్కల ప్రతిరోజూ భిక్షం అడుక్కుంటూ ఉండేవాడని, పెట్టింది తిని వెళ్లిపోయేవాడని రాజ్ కుమార్ తెలిపారు. కానీ కొన్ని రోజులుగా అతను తన భార్యతో అనువుగా మాట్లాడడం, తనకు అనుమానం వస్తుందని వారు ఫోన్లో కూడా మాట్లాడుకునేవారని తెలిపారు.

జనవరి 3వ తేదీన కూరగాయలు, బట్టలు తీసుకొస్తానని చెప్పి తన భార్య ఇంట్లో నుంచి వెళ్లిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని పోలీసులకు తెలిపాడు. నన్హే పండిట్తోనే వెళ్ళిపోయి ఉండొచ్చని, తన భార్య పోయినప్పటి నుంచి ఆ బిచ్చగాడు కూడా కనిపించడం లేదని తెలిపాడు. గేదె అమ్మడంతో పాటు, నగలు అమ్మి వచ్చిన డబ్బులు తీసుకొని ఇద్దరూ పారిపోయారని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగానే కాదు, దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
భర్తలు ఇది తెలుసుకోండి..
ప్రత్యేకంగా ఈ ఘటన అని మాత్రమే కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. చాలా మంది మహిళలు తమ భర్తలను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్లిపోవడం, భర్తలను చంపేయడం వంటివి జరుగుతున్నాయి. వీటికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే.. భర్తలు భార్యలను పట్టించుకోకపోవడం. భార్యలను పట్టించుకోకపోవడం వల్ల వారి ద్రుష్టి వేరే వ్యక్తులపై పడుతుంది. వారి మోహ కోరికలు తీర్చకపోవడం కూడా ఇందుకు ఓ కారణం అవుతుంది. అందుకే భర్తలు తమ భార్యలను పట్టించుకోవాలి. వారికి కావాల్సింది సమకూర్చాలి.
వారి సమస్యను విని, వారితో ప్రేమగా మెలగాలి. భార్యల లైంగిక కోరికలను తీర్చడంతో పాటు, వేరే వ్యక్తుల వైపు వారి ద్రుష్టి మరలకుండా వారిని కనిపెడుతూ ఉండాలి. ఇప్పటికైనా మీలో ఎవరైనా ఈ టిప్స్ పాటించకపోతే కచ్చితంగా పాటించండి. లేకపోతే కష్టమైపోతుంది గురూ!



Click it and Unblock the Notifications











