Latest Updates
-
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే..
Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలంటే...!
మనలో చాలా మందికి అక్షయ తృతీయ పేరు వింటే టక్కున గుర్తొచ్చే బంగారమే. ఈ పవిత్రమైన రోజున పసిడితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే అవి అక్షయం అవుతాయని చాలా మంది నమ్మకం.

పురాణాల ప్రకారం అక్షయం అంటే క్షయం కానిది(ఎన్నటికీ తరగనిది). హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈరోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు.

ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7.49AM గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఏప్రిల్ 22వ తేదీన తెల్లవారు జామున 12.21PM గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.

ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అయితే బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువులను ఎలాంటి సమయంలో కొనాలి.. ఎప్పుడు కొంటే శుభ ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వైశాఖ మాసంలో..
పురాణాల ప్రకారం, వైశాఖ మాసంలో శుద్ధ తదియ రోజున ఏ పని చేసినా.. ఏ వ్రతం చేసినా.. ఏ పూజ చేసిన పుణ్య ఫలితాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. ఇదే రోజున పరమేశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించాడు. ఈ పవిత్రమైన రోజున ఏ వస్తువు సొంతం చేసుకున్నా అది అక్షయం అవుతుంది.

విష్ణువు పూజ..
అక్షయ తృతీయ రోజున బ్రహ్మతో తృతీయ తిథి కలిసి ఉండటం వల్ల ఈరోజున పవిత్రమైనదిగా ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజించడం వల్ల అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని పండితులు చెబుతారు. ఈ రోజున శ్రీ మహా విష్ణువుకు పూజలు, ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి. అలాగే ఏ వస్తువు అయినా దానం చేసినా మంచిగా ఉంటుంది.

ద్రౌపదికి అక్షయ పాత్ర..
మరో కథనం మేరకు.. మహా భారతంలో శ్రీ క్రిష్ణుడు ద్రౌపదికి అక్షయపాత్రను కూడా అక్షయ తృతీయ రోజునే అందించాడు. దీంతో తను మరింత సంపన్నుడు అయ్యాడు. అలా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజున ప్రజలందరూ విలువైన వస్తువులను, బంగారం వంటి వాటిని కొంటూ ఉంటారు.

ఎప్పుడు కొనాలంటే..
ఇక అసలు విషయానికొస్తే.. అక్షయ తృతీయ రోజున ఏ సమయంలో బంగారం లేదా ఇతర విలువైన కొనుగోలు చేయాలంటే.. హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలో శుక్ల పక్ష తదియ మే 3వ తేదీ ఉదయం 5:18 నుండి ప్రారంభమై.. మరుసటి రోజు అంటే మే 4వ తేదీ ఉదయం 5:38 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎప్పుడైనా బంగారం, వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను కొనొచ్చు.

బంగారం కొనలేని వారు..
ఈ పవిత్రమైన రోజున బంగారం కొనే సామర్థ్యం లేనివారు.. అక్షయ తృతీయ రోజున శ్రీ మహా విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి, ఆ దేవునికి ఇష్టమైన పువ్వులు, వస్తువులతో పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంలో సిరి సంపదలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనలేని వారు ఇలా చేసి పుణ్యం పొందొచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు.. ఈ పవిత్రమైన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కాబట్టి.. ఈ సమయంలో నీటితో నిండిన కలశాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది.అలాగే నీటితో నిండిన మట్టి కుండలను దానం చేయడం వల్ల ఎన్నో తీర్థయాత్రలను దర్శనం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజున చాలా మంది జలదానం చేస్తారు.



Click it and Unblock the Notifications