తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు, మొదటి రోజు ఇలా

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆదివారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ భక్తిశ్రద్దలతో తిరుమలలో వేదపండితులు, శ్రీవారి ఆలయం అర్చకులు హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.

Annual Pavitrotsavam, Snapana Thirumanjanam in First Day in Tirumala in telugu

అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ట జరిగింది. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు.

అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.

Annual Pavitrotsavam, Snapana Thirumanjanam in First Day in Tirumala in telugu

శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథంతో సహ టీటీడీకి చెందిన అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని పవిత్రోత్సవాలు జరుగుతున్న సందర్బంగా తిరుమలకు వెలుతున్న భక్తుల సంఖ్య మోస్తారుగా ఉంది. ఆదివారం సెలవు రోజులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. మంగళవారం వరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్సోత్సవాలు నిర్వహిస్తారు.

Story first published: Monday, August 28, 2023, 12:37 [IST]
Desktop Bottom Promotion