Latest Updates
-
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే! -
ఎండ దెబ్బకు చెక్: బార్లీ నీళ్లా? చెరకు రసమా? వేసవి వ్యర్థాలను తరిమికొట్టే బెస్ట్ డ్రింక్ ఏది? -
ఇప్పటి ప్రేమ పరిచయాలు యువతను ఎందుకు మానసికంగా అలసిపోయేలా చేస్తోంది -
మధురై తణ్ణి చట్నీతో ఇడ్లీ, దోశల టేస్ట్ డబుల్!..ఎలా చేసుకోవాలంటే.. -
బాధ్యతలు ఏవైనా ఒత్తిడి సమానమే.. మహిళలూ వీటిపై నిర్లక్ష్యం వద్దు.!
కూతురు తల్లిదండ్రులకు తలకొరివి పెట్టవచ్చా..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హిందూ శాస్త్రం ప్రకారం సంతానం వున్న వారికే మోక్షం లభిస్తుందని అనడంలో నిజం లేదు. సంతానం లేని వారికి కూడా మోక్షం లభిస్తుంది. కొడుకులు పెట్టలేదని చాలా మంది తల్లిదండ్రులు ఏడుస్తూ వుంటారు. దృతరాష్ట్రుడికి కూడా 100 మంది కొడుకులు పుట్టినా చివరికి తలకొరివి పెట్టడానికి కూడా ఎవ్వరూ లేరు. ఎంతమంది కొడుకులను కన్నా కూడా ఇప్పటికీ చాలా మంది దృతరాష్ట్రుడిని తిడుతూ వుంటారు. వెంకటేశ్వరస్వామి భక్తురాలు వెంగమాంబకు కూడా సంతానం లేదు కానీ ఆమె మోక్షాన్ని పొందింది. ఆదిశంకరాచార్య స్వామి పెళ్లి చేసుకోకపోయినా ఆయనకు మోక్షం లభించింది. నారదుడు, భీష్ముడు ఇలా ఎంతో మంది సంతానం లేకపోయినా మోక్షాన్ని పొందారు.

కొడుకులు లేకపోయినా మనం చేసే సత్కర్మల వల్ల మనకు మంచి జరుగుతుంది, మనకు మోక్షం లభిస్తుంది. బిడ్డలు లేనటువంటి వారు మంచి దాన ధర్మాలు చేస్తూ, పూజలు చేస్తూ వుంటే మోక్షాన్ని పొందుతారు. ఆడపిల్లలు మాత్రమే వున్నారని, కొడుకులు లేరని చాలా మంది బాధపడిపోతుంటారు. ఆడపిల్లలను కన్నవాళ్లే అదృష్టవంతులు. ఒక్క ఆడపిల్ల వున్నా వంశం మొత్తం తరిస్తుంది అని శాస్త్రాల్లో పురాణాల్లో వుంది.
ఆడపిల్లకు పెళ్లి చేసే సమయంలో కన్యాదానం చేసే సందర్భంలో ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావిస్తారు. పెళ్లి కొడుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కన్యాదానం సమయంలో అమ్మాయి తల్లిదండ్రుల చేత ఓ విష్ణు స్వరూపుడా నీకు నా కూతురును లక్ష్మీదేవిగా భావించి నీకు కన్యాదానం చేస్తున్నాను. కన్యాదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూర్వం ఆడపిల్లలు లేని వారు ఎవరైనా ఒక ఆడపిల్లను కన్యాదానం చేసేవారు.
కన్యాదానం చేయడం వల్ల తల్లిదండ్రులు శాశ్వతంగా స్వర్గలోకంలో వుంటారని శాస్త్రం చెబుతోంది. కన్యాదానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కాబట్టి ఆడపిల్లలను కన్న వాళ్లు అదృష్టవంతులుగా భావించాలి. సీతాదేవిని కన్యాదానం చేసి జనకమహారాజు మోక్షాన్ని పొందాడు. ఆడపిల్లలను కన్నవారికి శాశ్వత బ్రహ్మనివాసం వుంది.

ఆడపిల్ల తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేసి దహన సంస్కారాలు చేయవచ్చు. కూతురుకి కొడుకు లేకపోతే, లేదా తల్లిదండ్రులకు శిశ్యుడు లేకపోతే, బంధువుల్లో ఎవరైనా తలకొరివి పెట్టవచ్చు, వాళ్లు కూడా లేకపోతే అల్లుడు తలకొరివి పెట్టవచ్చు. అల్లుడు కూడా లేని సందర్భంలో కూతురు పిండ ప్రదానం చేసి దహనసంస్కారాలు చేయవచ్చు.
కూతురికి తల్లిదండ్రి లేకపోతే తాతను కన్యాదానం చేయవచ్చు, లేదంటే పెద్దమ్మ, పెద్దనాన్న చేయవచ్చు, లేదంటే చిన్ననాన్న, పిన్నమ్మ కన్యాదానం చేయవచ్చు. వీళ్లు కూడా లేకపోతే అన్నావదిన అయినా కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు. మేనమామ కూడా కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు. వీళ్లెవ్వరూ లేకపోయినా తల్లి కాళ్లు కడిగి కన్యాదానం చేయవచ్చు.
స్త్రీలు రెండవ పెళ్లి నిరభ్యరంతంగా చేసుకోవచ్చు. భర్త మరణిస్తే స్త్రీలు రెండవ పెళ్లి చేసుకోవచ్చు. పరాయి స్త్రీల వ్యామోహంలో పడితే కూడా రెండవ పెళ్లి చేసుకోవచ్చు. భర్త నపుంసకుడైనా కూడా స్త్రీ రెండవ పెళ్లి చేసుకోవచ్చు. భర్త సన్యాసంలో కలిసిపోయినా రెండవ పెళ్లి చేసుకోవచ్చు.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్ని ప్రముఖ జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి ప్రముఖ హిందూ శాస్త్ర పురాణాల గ్రంధాల నుంచి స్వీకరించింది. అయితే మేము వీటిని ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications