ఈ 3 ఆంజనేయస్వామి మంత్రాలను జపిస్తే..అన్నీ సమస్యలు తొలగిపోతాయ్

హిందూ పురాణాల్లో ఒక్కోరోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. ఆ విధంగా మంగళవారం ఆంజనేయస్వామికి అంకితం చేయడింది. సనాతన ధర్మంలో హనుమంతుడిని కలియుగ దేవుడు అంటారు. రాముడికి నమ్మిన బంటుగా,తనలోని శక్తి తనకు తెలియని అమాయకుడిగా,శుత్రువుగా ఎదురుగా నిలబడితే తన పరాక్రమంతో వారిని చిత్తు చేసే బలవంతుడుగా హనుమంతుడిని చూస్తారు.

హిందూమతంలో ఎక్కువమంది కొలిచే దైవం ఆంజనేయస్వామి. ఆంజనేయ స్వామి బలం, ధైర్యం, భక్తికి చిహ్నంగా పూజించబడతాడు. హిందువులు మాత్రమే కాదు అనేక మతాలకు చెందినవాళ్లు కూడా హనుమంతుడిని కొలుస్తారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా కూడా హనుమంతుడి భక్తుడే. ఆయన తన జేబులో ఎప్పుడూ ఆంజనేయస్వామి ప్రతియను పెట్టుకుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను లోగా ఫీల్ అయినప్పుడు హనుమాన్ ని చూడం ద్వారా తనలో కొత్త శక్తి వస్తుందని ఆయన చెప్పారు.

chant these three mantras of lord hanuman and get rid of all problems

హనుమాన్ మంత్రాలను పఠించడం ద్వారా ఆధ్యాత్మిక, మానసిక శాంతిని పొందవచ్చు. ఇది జీవితంలో ఆనందం,శ్రేయస్సు, విజయాన్ని సాధించడంలో కూడా సహాయపడుతుంది. 3 ముఖ్యమైన హనుమంతుడి మంత్రాలను జపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

మూడు ముఖ్యమైన హనుమాన్ మంత్రాలు
- ఓం శ్రీ హనుమతే నమః
- ఓం హనుమతే నమః
- ఓం శ్రీ రామదూతాయ నమః

ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు
-ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
-జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయం సాధించవచ్చు.
-హనుమాన్ దయతో ధైర్యం, బలం పొందుతారు
-మంత్రాన్ని పఠించడం వల్ల వ్యక్తి మనస్సు,ఆత్మ శుద్ధి అవుతుంది.

మంత్రాన్ని జపించడానికి ఈ పద్ధతిని అనుసరించండి
-మంత్రం జపించే ముందు స్నానం చేయండి.
-శుభ్రమైన, నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చోండి.
-మీ చేతుల్లో నీటితో మంత్రాన్ని జపించడానికి ప్రతిజ్ఞ తీసుకోండి.
-హనుమాన్ జీ మంత్రాన్ని జపించడం ప్రారంభించండి.
-మంత్రాన్ని జపించేటప్పుడు మీ మనస్సును ఏకాగ్రతతో ఉంచుకోండి.
-జపం చేసిన తర్వాత మీ చేతుల్లోని నీటిని నేలపై వదిలివేయండి.

Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని పాటించడం వ్యక్తుల సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Story first published: Tuesday, November 26, 2024, 11:28 [IST]
Desktop Bottom Promotion