Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు!
దత్తాత్రేయుడిని త్రిమూర్తుల అవతారమని ఎందుకంటారో తెలుసా...
దత్తాత్రేయ జయంతి వ్రతం యొక్క కథను తెలుగులో తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు.

ఈ సంవత్సరం దత్తాత్రేయ జయంతిని డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు జరుపుకుంటారు. అత్రి మరియు అనసూయ దేవి కుమారుడైన దత్తాత్రేయుడిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అవతారంగా భావిస్తారు.

ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలంటే.. ఈ వ్రతం కథ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే...

దత్తాత్రేయుని జననం..
పురాణాల ప్రకారం, మహర్షి అత్రి ముని, తన భార్య అనసూయ సాధువు యొక్క మూడు ప్రపంచాలలో కీర్తింపబడటం ప్రారంభమైంది. ఇది చూసిన పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి మాత కూడా తమ భర్త గురించి ఇలాగే జరగాలని కోరుకున్నారు. ఈ మేరకు వీరు ముగ్గురు తమ భర్తను అభ్యర్థించడం ప్రారంభించారు.

అత్రి ఆశ్రమానికి..
అప్పుడు బ్రాహ్మణులు అత్రి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సమయంలో మహర్షి అత్రి తన ఇంట్లో లేరు. సతీ అనసూయ అతడిని పలకరించడానికి అక్కడి చేరుకుంది. అప్పుడు బ్రాహ్మణుల రూపంలో వచ్చిన త్రిమూర్తులు ఒక పరీక్ష పెట్టారు.

వస్త్రాలు లేకుండా..
పురాణాల ప్రకారం.. సతి అనసూయ ఒంటిపై నూలు పోగు లేకుండా ఆ త్రిమూర్తులకు ఆహారం పెట్టాలని నిబంధన పెట్టారు. అయితే ఆమె కొంచెంసేపు సమయం తీసుకుని.. అందుకు అంగీకరించి.. తను ఒప్పుకుంది. అయితే అదే సమయంలో త్రిమూర్తులను 6 నెలల వయసు ఉన్నవారిగా మారిపోమని చెప్పింది.

తన శక్తులతో..
అలా అనసూయ తన యొక్క దైవిక శక్తులను ఉపయోగించి వారి ముగ్గురిని శిశువులుగా మార్చింది. అప్పుడు వారు ఏడుపు మొదలుపెట్టడంతో.. వారిని తన ఒడిలోకి తీసుకుని.. పాలిచ్చి.. వారిని ఊయలలో ఊపి అనంతరం వారికి ఆహారం కూడా ఇచ్చింది.

త్రిమూర్తుల భార్యల ఆందోళన..
అయితే అదే సమయంలో తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిమూర్తుల భార్యలైన పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి మాతలు ఆందోళన చెందుతారు. అదే సమయంలో నారదుడు అక్కడికి చేరుకుని.. జరిగిన విషయాన్ని అంతా వారికి చెబుతాడు. దీంతో వారు తమ పొరపాటును గ్రహించి.. సతి అనసూయ వద్దకు వెళ్లి క్షమాపణ చెబుతారు.

అసలైన రూపంలోకి..
ఆ తర్వాత అనసూయ త్రిమూర్తులను సాధారణ రూపంలోకి తీసుకొస్తుంది. ఈ సంఘటనతో సంతోషపడ్డ త్రిమూర్తులు ఆమెకు ఓ వరం ఇచ్చారు. అప్పుడు ఆమె త్రిమూర్తులకు తాను మళ్లీ శిశు రూపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది. అలా ఆమె కోరిక మేరకు.. అనసూయ గర్భం నుండి విష్ణువు, బ్రహ్మ, శివుని అంశలు కలిగిన దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకే దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.



Click it and Unblock the Notifications