Latest Updates
-
బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్తో నో యూజ్.. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ఈ టిఫిన్స్ తప్పనిసరి.! -
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి దీన్ని మించింది లేదు..కొండలను పిండి చేసే శక్తి! -
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.?
దత్తాత్రేయుడిని త్రిమూర్తుల అవతారమని ఎందుకంటారో తెలుసా...
దత్తాత్రేయ జయంతి వ్రతం యొక్క కథను తెలుగులో తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు.

ఈ సంవత్సరం దత్తాత్రేయ జయంతిని డిసెంబర్ 29వ తేదీన అంటే మంగళవారం నాడు జరుపుకుంటారు. అత్రి మరియు అనసూయ దేవి కుమారుడైన దత్తాత్రేయుడిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అవతారంగా భావిస్తారు.

ఈ పవిత్రమైన రోజున భక్తులందరూ ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలంటే.. ఈ వ్రతం కథ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే...

దత్తాత్రేయుని జననం..
పురాణాల ప్రకారం, మహర్షి అత్రి ముని, తన భార్య అనసూయ సాధువు యొక్క మూడు ప్రపంచాలలో కీర్తింపబడటం ప్రారంభమైంది. ఇది చూసిన పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి మాత కూడా తమ భర్త గురించి ఇలాగే జరగాలని కోరుకున్నారు. ఈ మేరకు వీరు ముగ్గురు తమ భర్తను అభ్యర్థించడం ప్రారంభించారు.

అత్రి ఆశ్రమానికి..
అప్పుడు బ్రాహ్మణులు అత్రి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సమయంలో మహర్షి అత్రి తన ఇంట్లో లేరు. సతీ అనసూయ అతడిని పలకరించడానికి అక్కడి చేరుకుంది. అప్పుడు బ్రాహ్మణుల రూపంలో వచ్చిన త్రిమూర్తులు ఒక పరీక్ష పెట్టారు.

వస్త్రాలు లేకుండా..
పురాణాల ప్రకారం.. సతి అనసూయ ఒంటిపై నూలు పోగు లేకుండా ఆ త్రిమూర్తులకు ఆహారం పెట్టాలని నిబంధన పెట్టారు. అయితే ఆమె కొంచెంసేపు సమయం తీసుకుని.. అందుకు అంగీకరించి.. తను ఒప్పుకుంది. అయితే అదే సమయంలో త్రిమూర్తులను 6 నెలల వయసు ఉన్నవారిగా మారిపోమని చెప్పింది.

తన శక్తులతో..
అలా అనసూయ తన యొక్క దైవిక శక్తులను ఉపయోగించి వారి ముగ్గురిని శిశువులుగా మార్చింది. అప్పుడు వారు ఏడుపు మొదలుపెట్టడంతో.. వారిని తన ఒడిలోకి తీసుకుని.. పాలిచ్చి.. వారిని ఊయలలో ఊపి అనంతరం వారికి ఆహారం కూడా ఇచ్చింది.

త్రిమూర్తుల భార్యల ఆందోళన..
అయితే అదే సమయంలో తమ భర్తలు తిరిగి రాకపోవడంతో త్రిమూర్తుల భార్యలైన పార్వతి, లక్ష్మీదేవి, సరస్వతి మాతలు ఆందోళన చెందుతారు. అదే సమయంలో నారదుడు అక్కడికి చేరుకుని.. జరిగిన విషయాన్ని అంతా వారికి చెబుతాడు. దీంతో వారు తమ పొరపాటును గ్రహించి.. సతి అనసూయ వద్దకు వెళ్లి క్షమాపణ చెబుతారు.

అసలైన రూపంలోకి..
ఆ తర్వాత అనసూయ త్రిమూర్తులను సాధారణ రూపంలోకి తీసుకొస్తుంది. ఈ సంఘటనతో సంతోషపడ్డ త్రిమూర్తులు ఆమెకు ఓ వరం ఇచ్చారు. అప్పుడు ఆమె త్రిమూర్తులకు తాను మళ్లీ శిశు రూపాన్ని ఇవ్వాలని అనుకుంటున్నానని చెబుతుంది. అలా ఆమె కోరిక మేరకు.. అనసూయ గర్భం నుండి విష్ణువు, బ్రహ్మ, శివుని అంశలు కలిగిన దత్తాత్రేయుడు జన్మించాడు. అందుకే దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల త్రిమూర్తుల ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.



Click it and Unblock the Notifications