Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
దసరా రోజు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఈ నైవేద్యం సమర్పించాలి!
దేవి శరన్నవరాత్రులు దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల పూజలు పూర్తయ్యాయి. ఇంకో రెండుల్లో దసరా కూడా వచ్చేస్తుంది. అయితే మిగిలిన ఈ రెండు రోజులు దేవిని ఏ విధంగా పూజించాలి? అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనేది ఇప్పుడు చూద్దాం.
ఎనిమిదో రోజు:
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. అదే శాక్తేయ రూపంలో మహా గౌరీ అలంకారంలో భక్తులందరినీ దర్శనమిస్తుంది. ఎనిమిదో రోజు దుర్గాదేవి అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించాల్సిన అవసరముంటుంది. వాటిలో బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నైవేద్యంగా సమర్పించాలి. వీటిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి కటాక్షాలు అనుగ్రహించ వచ్చు.

తొమ్మిదో రోజు:
నవరాత్రుల్లో తొమ్మిదో రోజు అమ్మవారు సౌమ్య రూపంలో మహిషాసుర మర్ధిని అలంకారంలో దర్శనమిస్తుంది. అదే శాక్తేయ రూపంలో సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని రూపంలో ఉండే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే.. వడపప్పు పానకం, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. అదే సిద్ధిదాత్రి అలంకరణలో ఉండే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే.. పాయసాన్నం నైవేద్యంగా సమర్పిస్తే, అమ్మవారి దయ, కృప మీకు అనుగ్రహిస్తుంది.
దసరా రోజు:
నవరాత్రులు పూర్తయిన తరువాత దసరా రోజు(విజయదశమి రోజు) అమ్మవారు సౌమ్య రూపంలో శ్రీ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. అదే శాక్తేయ రూపంలో భ్రమరాంబిక అలంకరణలో భక్తులందరికీ తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది. దసరా రోజు సౌమ్య రూపంలో ఉండే శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలో ఉండే అమ్మవారి అనుగ్రహం పొందాలంటే.. కొబ్బరి కాయ ముక్కలు, అరటి పండు ముక్కలు, పాయసాన్నం నైవేద్యంగా సమర్పించాలి. అదే శాక్తేయ అలంకరణలో భ్రమరాంబిక అలంకరణలో ఉండే అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలంటే.. పులిహోరను నైవేద్యంగా సమర్పించొచ్చు.
ఇలా నవరాత్రి ఉత్సవాల్లో మిగిలిన మూడు రోజులు సౌమ్య రూపంలో ఉండే అమ్మవారు ఉండే అలంకరణను బట్టి, శాక్తేయ రూపంలో ఉండే అమ్మవారి అలంకరణను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, పూజ ముగిసిన తరువాత ఆ నైవేద్యాన్ని కుటుంబ సభ్యలందరూ తీసుకుంటే, అమ్మవారి కరుణా కటాక్షాలు, అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించి, పైన పేర్కొనబడిన నైవేద్యాల్లో మీకు వీలైన నైవేద్యాన్ని సమర్పించి.. అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము.



Click it and Unblock the Notifications