Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
అప్పులన్నీ తీరిపోవాలా..? అయితే ప్రతీ అమావాస్య రోజున ఇలా చేయండి..!!
ప్రతి ఒక్కరికి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది. ఈ జన్మనక్షత్రాలతో కొన్ని రోజులు వస్తాయ్. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోవాలి. తరువాత అమావాస్య రోజున ఉదయమే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి. మీకు కుదిరితే సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని పూజకు సిద్ధంగా ఉండాలి. ఆ రోజున తయారు చేయించనటువంటి మామిడి చెక్కకు పసుపు రాయాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీ దేవి అమ్మవారి ఫోటో లైదంటే విగ్రహం పెట్టాలి.

ఇత్తడి చెండు లేదంటే వెండి చెంబుకు కంకణం కట్టి కళషంగా చేయాలి. అందులో నీళ్లు పోసి, లవంగాలు, యాలాకులు, దాల్చిన చెక్క, పచ్చ కర్పూరం వేయాలి. చెంబులో మామిడాకులు పెట్టి అందులో కొబ్బరికాయ పెడితే కళశం స్థాపన అవుతుంది.
తరువాత లక్ష్మీ అమ్మవారికి 108 ఎర్ర గులాబీలు, లేదంటే 108 తామరపువ్వులు సమర్పించుకోవాలి. నైవేద్యానికి ఏదైనా ఒక తియ్యని ప్రసాదాన్ని రెడీ చేసుకోవాలి. అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆరోజు రాత్రి కూడా దీపారాధన చేసుకొని, ధూప, దీప, నైవేద్యాలు చెల్లించుకోవాలి. తరువాత చంద్రుడిని దర్శనం చేసుకొని నేలపైన పడుకోవాలి. పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకొని పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయమే లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని పూజా గదిలోకి వెళ్లి అక్కడు ఉన్న కళశంలోని నీటిని ఒక బాటిల్లో పోసుకోవాలి. పూజకు సంబంధించిన పువ్వులు, కర్పూరం, అగరబత్తీలు ఉపయోగించినవి ఏవైతే ఉన్నాయో, వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో కట్టివేసి ఏదైనా నదిలో వేయాలి. కళశం నీరు పోసుకున్న బాటిల్కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయాలి. ఇలా ప్రతీ అమావాస్యకు చేసుకుంటూ ఉండాలి. బాటిల్లో ఉన్న కళశపు నీటిని మొక్కలకు పోయాలి.
ప్రతీ అమావాస్యకు ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం చేసిన అప్పులు క్రమంగా తీరిపోవడం జరుగుతుంది. మంచి అవకాశాలు కూడా వస్తాయ్. లక్ష్మీ అమ్మవారికి ఈ పూజ చేసేటప్పుడు చాలా భక్తితో చేయాలి. అప్పుడు చక్కని ఫలితాలను మనం చూడగలుగుతాం. కేవలం అప్పు బాధలే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తగ్గిపోతాయ్.



Click it and Unblock the Notifications