Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
అప్పులన్నీ తీరిపోవాలా..? అయితే ప్రతీ అమావాస్య రోజున ఇలా చేయండి..!!
ప్రతి ఒక్కరికి ఓ జన్మ నక్షత్రం ఉంటుంది. ఈ జన్మనక్షత్రాలతో కొన్ని రోజులు వస్తాయ్. మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ రోజున మామిడి చెక్కతో మీరు పీట చేయించుకోవాలి. తరువాత అమావాస్య రోజున ఉదయమే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేయాలి. మీకు కుదిరితే సాంప్రదాయ వస్త్రాలు వేసుకొని పూజకు సిద్ధంగా ఉండాలి. ఆ రోజున తయారు చేయించనటువంటి మామిడి చెక్కకు పసుపు రాయాలి. దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, తెల్లని వస్త్రం పరిచి దానిపైన లక్ష్మీ దేవి అమ్మవారి ఫోటో లైదంటే విగ్రహం పెట్టాలి.

ఇత్తడి చెండు లేదంటే వెండి చెంబుకు కంకణం కట్టి కళషంగా చేయాలి. అందులో నీళ్లు పోసి, లవంగాలు, యాలాకులు, దాల్చిన చెక్క, పచ్చ కర్పూరం వేయాలి. చెంబులో మామిడాకులు పెట్టి అందులో కొబ్బరికాయ పెడితే కళశం స్థాపన అవుతుంది.
తరువాత లక్ష్మీ అమ్మవారికి 108 ఎర్ర గులాబీలు, లేదంటే 108 తామరపువ్వులు సమర్పించుకోవాలి. నైవేద్యానికి ఏదైనా ఒక తియ్యని ప్రసాదాన్ని రెడీ చేసుకోవాలి. అమ్మవారికి ఈ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆరోజు రాత్రి కూడా దీపారాధన చేసుకొని, ధూప, దీప, నైవేద్యాలు చెల్లించుకోవాలి. తరువాత చంద్రుడిని దర్శనం చేసుకొని నేలపైన పడుకోవాలి. పడుకునే ముందు ఏదైనా అల్పాహారం తీసుకొని పడుకోవాలి.
మరుసటి రోజు ఉదయమే లేచిన తరువాత కాలకృత్యాలు తీర్చుకొని పూజా గదిలోకి వెళ్లి అక్కడు ఉన్న కళశంలోని నీటిని ఒక బాటిల్లో పోసుకోవాలి. పూజకు సంబంధించిన పువ్వులు, కర్పూరం, అగరబత్తీలు ఉపయోగించినవి ఏవైతే ఉన్నాయో, వాటిని అక్కడ ఉన్న ఎర్రని వస్త్రంలో కట్టివేసి ఏదైనా నదిలో వేయాలి. కళశం నీరు పోసుకున్న బాటిల్కు గ్రీన్ కలర్ దారం కట్టి ఇంటికి ఈశాన్యం వైపున వేలాడదీయాలి. ఇలా ప్రతీ అమావాస్యకు చేసుకుంటూ ఉండాలి. బాటిల్లో ఉన్న కళశపు నీటిని మొక్కలకు పోయాలి.
ప్రతీ అమావాస్యకు ఈ పరిహారం చేయడం వల్ల కుటుంబం చేసిన అప్పులు క్రమంగా తీరిపోవడం జరుగుతుంది. మంచి అవకాశాలు కూడా వస్తాయ్. లక్ష్మీ అమ్మవారికి ఈ పూజ చేసేటప్పుడు చాలా భక్తితో చేయాలి. అప్పుడు చక్కని ఫలితాలను మనం చూడగలుగుతాం. కేవలం అప్పు బాధలే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తగ్గిపోతాయ్.



Click it and Unblock the Notifications











