దేవి నవ రాత్రుల్లో అయిదో రోజు అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసా?

దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారి పూజలు చాలా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. అందులో భాగంగా శరన్నవరాత్రుల్లో అయిదో రోజైన నేడు.. అమ్మవారు శ్రీ మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే అమ్మవారికి ఈ రూపం ఎలా వచ్చింది? ఈ రూపంలో అమ్మవారికి పూజలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

అమ్మవారికి ఈ రూపం ఎలా వచ్చిందంటే:

దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అయిదో రోజు అమ్మవారిని శ్రీ మహాచండీ రూపంలో పూజలు నిర్వహస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం.. మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారు శ్రీ మహాచండీగా ఉద్భవించారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీ దేవీ అవతారం. అందుకే శ్రీ మహాచండీ అమ్మవారిని పూజిస్తే.. సకల దేవతలను పూజించినట్లేనని చెబుతుంటారు.

Do you know how to praise lord Durgamma on day 5

శ్రీమహాచండీ రూపంలో అమ్మవారిని ఎలా పూజిచాలి:

శ్రీ మహాచండీ రూపంలో ఈరోజు అమ్మవారు సింహ వాహనంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు. పలు పుణ్య క్షేత్రాల్లో ఈరోజు అమ్మవారిని స్కందమాతగా కూడా పూజలు నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారిని ఈ రోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి.

ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఏం జరుగుతుంది:

శ్రీ మహాచండీ రూపంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. విద్య, కీర్తి ప్రతిష్టలు, సంపద పెరిగి సమాజంలో గుర్తింపు లభిస్తుందని భావిస్తారు. అలాగే శత్రువులు మిత్రువులుగా మారతారని ప్రతీతి.

Story first published: Monday, October 7, 2024, 10:22 [IST]
Desktop Bottom Promotion