భక్తుల వివాదాన్ని స్వయంగా ప్రత్యక్షమై పరిష్కరించిన ఆంజనేయ స్వామి.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా

హిందూమతంలో ఎక్కువమంది కొలిచే దైవం ఆంజనేయస్వామి. హిందువులు మాత్రమే కాదు అనేక ఇతర మతాలకు చెందినవాళ్లు కూడా హనుమంతుడిని కొలుస్తారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామా కూడా హనుమంతుడి భక్తుడే. సనాతన ధర్మంలో హనుమంతుడిని కలియుగ దేవుడు అంటారు. రాముడికి నమ్మిన బంటుగా,తనలోని శక్తి తనకు తెలియని అమాయకుడిగా,శుత్రువుగా ఎదురుగా నిలబడితే తన పరాక్రమంతో వారిని చిత్తు చేసే బలవంతుడుగా హనుమంతుడిని చూస్తారు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హనుమాన్ మందిరాలు ఉన్నాయి. మనదేశంలో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గల్లీకో హనుమాన్ ఆలయం ఉంటది. అయితే ఒక హనుమాన్ ఆలయం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది. అత్యంత పురాతనమైన ఆలయమే కాకుండా ఈ ఆలయానికి వెళ్లి హనుమాన్ ని ఏది కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాడని భక్తుల నమ్మకం. స్వయంగా ఆంజనేయస్వామి ఈ ఆలయంకి వచ్చి భక్తుల వివాదాన్ని పరిష్కరించినట్లు చెబుతుంటారు. ఈ హనుమాన్ టెంపుల్ ఎక్కడ ఉంది..ఈ టెంపుల్ ఎందుకు అత్యంత ప్రత్యేకమైనదో ఇప్పుడు చూద్దాం.

famous kundaliya hanuman temple in gujarat jamnagar significance and history

ఈ ఆలయం ప్రత్యేకతలు ఇవే
ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం మనదేశంలో ఉండదు. కానీ స్వయంభూగా దర్శనమిచ్చే దేవాలయాలు చాలా తక్కువ, వాటిలో కూడా రెండు విగ్రహాలు ఉండటం చాలా అరుదు. గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌ నగర్‌ ను ఛోటీ కాశీ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. జామ్‌ నగర్ జిల్లా ప్రజలు కొంచెం ఎక్కువ ఆధ్యాత్మిక,భక్తి భావం కలిగి ఉంటారు. జామ్ నగర్ జిల్లాలోని కుంట గ్రామంలో ఉన్న కుండలియా హనుమాన్‌ దేవాలయం దాదాపు 500 సంవత్సరాల పురాతనమైనది.

ఇక్కడ హనుమతుండు స్వయంగా వెలిసినట్లు చెప్తారు. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉన్నాయి, రెండు విగ్రహాలు దక్షిణ దిశలో ఉండటం విశేషం. ఈ ఆలయంలో కుండలియ హనుమంతుడు స్వయంభూ రూపంలో దర్శనమిస్తాడు. భక్తుల కోరికలు తీరుస్తున్నందున పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఇక్కడికి వెళ్తుంటారు. శనివారాలు,ప్రత్యేక సందర్భాలలో,పండుగల సమయంలో చాలా మంది భక్తులు దర్శనం కోసం కాలినడకన కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ ఆలయంతో పాటు గోశాల కూడా ఉంది.

భక్తుల వివాదాం పరిష్కరించిన ఆంజనేయస్వామి

ఒక నమ్మకం ప్రకారం ఇంతకుముందు హనుమంతుడి విగ్రహం ఒకటి మాత్రమే ఈ ఆలయంలో ఉండేది. ఆ సమయంలో ఓ రోజు ఉదయం పూజ ఎవరు చేస్తారనే దానిపై పూజారికి, భక్తుల మధ్య వివాదం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి దేవునికి ప్రార్థన చేశారు. అప్పుడు ప్రధాన విగ్రహం వెనుక రెండవ విగ్రహం స్వయంగా కనిపించిందని చెబుతారు. ఈ ఆలయం జామ్‌ నగర్ ఉనికి కంటే ముందే ఉంది. ఇక్కడ కొన్నేళ్లుగా సాధువులు, మహంతులు పూజలు చేస్తున్నారు.

Desktop Bottom Promotion