Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
వినాయకుని కథలో నేర్చుకోతగ్గ పేరెంటింగ్ టిప్స్
వినాయక చవిథి వచ్చెస్తోంది.ప్రతీ ఇల్లు, వీధి,నగరం లోనే కాదు దేశమంతా మహా వైభవం గా ఈ పండగ ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది .
వినాయక చవితి పెద్దలకి సరదాగా అనిపిస్తే పిల్లలకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొస్తుంది.ఈ పండుగని ఇళ్ళల్లో, దుకాణాల్లో, వీధుల్లో అన్నిచోట్లా జరుపుకుంటారు.వినాయుకుడిని “విఘ్న వినాశకుడు”అని కూడా పిలుస్తారు, అనగా విఘ్నాలని తొలగించేవాడని అర్ధం. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలలో ఆయన మనకూడా ఉండి మనల్ని ఆశీర్వదించడం వల్ల మనకి భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పడుతుంది.

ఉత్సవాలు జరిగిన తొమ్మిది రోజులూ ప్రజలందరూ ఆడి పాడి సంతోషంగా ఉంటారు.ఈ ఉత్సవాలని వైభవం గా నిర్వహించడానికి వినాయకుడు మనకి ఈ తొమ్మిది రోజులూ "ఈవెంట్ మేనేజర్” అవ్వడానికి అవకాశం ఇస్తాడన్నమాట. గణేశుడి కధని తరచి చూస్తే మనందరం నేర్చుకునే విషయాలెన్నో తెలుస్తాయి.”వినాయక జననం”కధ ద్వారా తెలుసుకోవాల్సిన పేరెంటింగ్ టిప్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాము ...

1.గణేశుడి తల్లి పార్వతి ఆయనని తన శక్తి తో సృష్టించింది కానీ మహా శివుడికి ఈ విషయం గురించి తెలీక ఈ బాలుడు కైలాసం లో తనకి ప్రవేశం నిరాకరించడం చూసి ఆగ్రహంతో బాలుడిని సంహరించాడు.ఆ తరువాత తన అర్ధాంగి ద్వారా ఈ బాలుడి గురించి తెలుసుకుని పశ్చాతాపం చెందుతాడే కానీ ఈ అబ్బాయి ఉనికి గురించి పార్వతిని మాత్రం ప్రశ్నించడు.
నేర్చుకోవలసిన నీతి:పిల్లల విషయం లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లి తండ్రులు ఒకళ్ళనొకళ్ళు అస్సలు నిందించుకోకూడడు.పిల్లల భవిష్యత్తు ఆలోచించి వారి ప్రవర్తన కి తామే బాధ్యత వహించాలి.తప్పు నీదంటే నీది అని వాదులాడూకునే బదులు సమస్య కి తగిన పరిష్కారం ఆలోచించాలి.

2.మహాశివుడు తన పరివారానికి కనిపించిన మొదటి జంతువు తల ని నరికి తీసురమ్మని ఆదేశించాడు. వారు ఏనుగు తల తేవడం వల్ల అదే గణేశుడు ముఖం అయ్యింది.మన హిందూ పురాణాల ప్రకారం ఏనుగు ముఖం దివ్యమైనది, ధ్యానం చేయునప్పుడు ఏనుగు ముఖం మీద మనస్సు కేంద్రీకరించడం ఉత్తమం.
నేర్చుకోవలసిన నీతి:తండ్రి పిల్లల కోసం ఏమైనా చేసినప్పుడు తల్లి ప్రశ్నించరాదు, అలాగే తల్లి ఏదైనా చేస్తే తండ్రి కూడా ప్రశ్నించరాదు.అలా ఒకరినొరకు ప్రశ్నించుకునే బదులు తమ పిల్లల భవిష్యత్తు కోసం తపన పడే వారు తమని మించి ఎవరూ లేరని గుర్తెరగాలి.

3.ఒకరోజు తన పుట్టినరోజు నాడు భుక్తాయాసంతో గణేశుడు అడుగు తీసి అడుగెయ్యలేక ఇబ్బంది పడ్డాడు.మహా శివుని ఫాలా భాగం లో ఉన్న చద్రునికి ఈ దృశ్యం హాస్యాస్పదం గా అనిపించి ఫక్కున నవ్వాడు.గణేశునికి ఇది అవమానకరం గా అనిపించి చంద్రునిపై తన తల్లికి ఫిర్యాదు చేసాడు.ఆగ్రహించిన పార్వతి వెంటనే చంద్రుడిని శపించి ఆ తరువాత దానికి సడలింపు ఇచ్చింది.
నేర్చుకోవలసిన నీతి: మీ పిల్ల/పిల్లాడి మీద మీరు వాత్సల్యం చూపించడం నిజంగా అభినందనీయమే కానీ అది ఇతరులకి ఇబ్బంది కలిగించేది గా ఉండకూడదు.పిల్లల్ని గారాబం చెయ్యండి కానీ అంత కంటే ముందు మీరు ఒక సామాజిక బాధ్యత కలిగిన దేశ పౌరుడిని కూడా తీర్చిదిద్దాలని మరువవద్దు.

పండగలు మన జీవితం లో భాగం.ఇవి మనం మనిషిగా ఎలా ఉండాలో గుర్తు చెయ్యడానికే వస్తాయి.పండగల యొక్క అంతరార్ధాన్ని తెలుసుకున్నప్పుడే ఈ ఉత్సవాలు మరింత అర్ధవంతమవుతాయి.



Click it and Unblock the Notifications