Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
తిరుమల శ్రీవారి భక్తులకు ఎగిరి గంతేసే శుభవార్త..ఇకపై అలా..
తిరుమల వెంకటేశ్వరస్వామి భక్తులకు గుడ్ న్యూస్. దర్శన టికెట్ విషయంలో మళ్లీ పాత పద్ధతినే పునరుద్దరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నిర్ణయించింది. గతంలో పర్యాటక శాఖ ద్వారా తిరుమల దర్శన టికెట్లు జారీ చేయగా ఆ తర్వాత ఈ పద్ధతిని రద్దు చేశారు. దీంతో ఏపీ టూరిజానికి గణనీయంగా ఆదాయం తగ్గింది. దీంతో టూరిజం శాఖ ఆదాయ మార్గాలను మెరుగుపరిచేలా టూరిజం శాఖ అధికారులు, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ కార్యాచరణ రూపొందించారు.
టూరిజం ఆదాయం గణనీయంగా తగ్గడానికి ముఖ్య కారణం తిరుమల టూర్ ప్యాకేజ్ తో పాటు జారీ చేసే ప్రత్యేక ప్రవేశ దర్శనం లేకపోవటమే కారణమని నిర్ధారణకు వచ్చారు. దీంతో గతంలో మాదిరిగానే మళ్లీ పర్యాటకశాఖ ద్వారా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నూకసాని బాలాజీ తెలిపారు. ఈ నిర్ణయంతో భక్తులకు మరింత ఈజీగా స్వామివారి దర్శనం లభించడమే కాకుండా పర్యాటక శాఖకు కూడా అదనపు ఆదాయం లభించనున్నట్లు చెప్పారు.

గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీలకు రూ.300 టికెట్లను భారీగా జారీచేసింది. ఏపీఎస్ఆర్టీసీ, టీజీఆర్టీసీ, కెఎస్ఆర్టీసీ, టిఎన్ఆర్టీసీ, ఏపీ టూరిజం, ఐఆర్సీటీసీ, ఇలా అనేక సర్వీసులకు టూరిజం కోటాలో మొత్తంగా అన్నింటికి కలిపి 5400 టికెట్లను కేటాయిస్తూ వస్తుంది టీటీడీ. ఆయా రాష్ట్రాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలను అభివృద్ధి చేసి ప్రజారవాణాకు ఆదాయాన్ని పెంచేందుకు ఈ టికెట్లను కేటాయించినట్లు అప్పట్లో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రకటించింది. అయితే
ఈ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో రూ. 5 వేలకు విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై అనేక ఆరోపణలు వచ్చాయి. పూర్తిస్థాయిలో దళారుల చేతిలో పడిపోయాయని టీటీడీకి అనేక విమర్శలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టి తర్వాత ఈ పద్దతిని టీటీడీ టీటీడీ రద్దు చేసింది. అయితే మళ్లీ ఏపీ టూరిజం ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో మళ్లీ పాత పద్దతి అమల్లోకి వస్తుంది.



Click it and Unblock the Notifications