Guru Purnima : గురు పూర్ణిమ తేదీ, ప్రాముఖ్యత మరియు శుభ సమయాన్ని తెలుసుకోండి

Guru Purnima 2024: గురు పూర్ణిమ పండుగను ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. గురు పూర్ణిమను ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు వేదవ్యాసుడి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. గురు పూర్ణిమ రోజున పూజ మరియు ఉపవాసం చేయడం వల్ల మనిషి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. అంతేకాకుండా, ఈ రోజున తమ గురువులను పూజించడం కూడా చాలా ముఖ్యమైనది. ఈసారి గురు పూర్ణిమ తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. గురు పూర్ణిమ ఏ రోజు జరుపుకుంటారో తెలుసుకుందాం. అలాగే పవిత్రమైన సమయం, ప్రాముఖ్యత మరియు పూజా విధానాన్ని తెలుసుకుందాం.

Guru Purnima 2024

గురు పూర్ణిమ 2024 ఎప్పుడు?
హిందు పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసం పూర్ణిమ తిథి జూలై 20 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై జూలై 21 సాయంత్రం 3:47 గంటలకు ముగుస్తుంది. శాస్త్రాలలో నిర్దేశించిన నియమాల ప్రకారం చంద్రోదయం పూర్ణిమ నాడు మాత్రమే పౌర్ణమి ఉపవాసం ఆచరిస్తారు. ఇందులో కూడా పూర్ణిమ తిథి వచ్చిన రాత్రిపూట ఉపవాసం, పూజలు చేస్తారు. అందుచేత జూలై 20న పౌర్ణమి వ్రతాన్ని ఆచరించి, 21న గురు పౌర్ణమి రోజున దానధర్మాలు చేస్తారు.

Guru Purnima 2024

గురు పూర్ణిమ పూజ విధానం
1) గురు పూర్ణిమ రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత విష్ణుమూర్తిని ధ్యానించాలి.

2) పూజ గదిని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత, విష్ణువు, లక్ష్మి మరియు వేదవ్యాసుడి విగ్రహాలను ప్రతిష్టించి, గంధం కుంకుమ బొట్లు పెట్టండి మరియు ఉపవాసం కోసం సంకల్పం చేసుకోండి.

3) విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించే ముందు పంచామృతంతో అభిషేకం చేసి వస్త్రాలు సమర్పించాలి. విష్ణువుతో పాటు, లక్ష్మీ దేవిని మరియు వేదవ్యాసుడిని కూడా పూజించండి.

4) దీని తర్వాత గురు చాలీసా పఠించండి.

5) విష్ణువు, లక్ష్మిదేవి మరియు వేదవ్యాసుడి ముందు స్వీట్లు, పండ్లు మరియు పాయసం మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించండి. గురు పూర్ణిమ వ్రత కథను కూడా పఠించండి.

6) చివరగా విష్ణువు లక్ష్మీదేవికి ఆరతి చేయండి.

Guru Purnima 2024

గురు పూర్ణిమ ప్రాముఖ్యత

హిందూ మతంలో గురువు స్థానం చాలా ముఖ్యమైనది. గురువు శిష్యుడిని అజ్ఞానమనే చీకట్లనుండి జ్ఞాన వెలుగులోకి తీసుకువస్తాడు. గురు పూర్ణిమ రోజున, శిష్యులు తమ గురువు పట్ల కృతజ్ఞత మరియు గౌరవాన్ని తెలియజేస్తారు.

పురాణాల ప్రకారం, గురు పూర్ణిమ పండుగను మహాభారత రచయిత వేదవ్యాసుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున వేదవ్యాసుడు నాలుగు వేదాలను రచించాడని ఒక నమ్మకం కూడా ఉంది. ఈ రోజున గురువు తన శిష్యులకు కూడా దీక్షను ఇస్తాడు. ఈ రోజున ప్రజలు తమ గురువులను పూజిస్తారు.

Story first published: Saturday, July 20, 2024, 17:10 [IST]
Desktop Bottom Promotion