Latest Updates
-
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే!
ఆ నిమ్మకాయల పవర్ అలాంటిది, లక్షలు పెట్టి ఆ స్వామి గుడిలో తీసుకుంటున్న భక్తులు
వేసవి ప్రారంభంలోనే మంచినీరు, శీతల పానీయాల ధరలు పెరిగాయి. నిమ్మకాయ ధర రూ 5 నుంచి రూ 6 రూపాయలు పలుకుతోంది. వేసవిలో నిమ్మకాయల ధరలు రూ.10 నుండి రూ. 15, ఒక్కోసారి రూ 20 రూపాయలు పలుకుతుంది. ఇక్కడ నిమ్మకాయల ధరల గురించి మాట్లాడటం లేదు. ఓ గుడిలో 9 నిమ్మకాయలు లక్షల రూపాయలకు కొనుగోలు చెయ్యడం ఇక్కడ అసలు టాపిక్.
ఓ ఆలయంలో పూజించిన నిమ్మ పండ్ల ధర గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మురుగన్ ఆలయంలో ఉన్నఈటెను అలంకరించే పవిత్రమైన నిమ్మకాయల ధర వింటే షాక్ అవుతారు. ఈ ఆలయానికి వందల ఏళ్ల నాటి చరిత్ర, సంప్రదాయాలు ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ పూజించే నిమ్మకాయలను వేలానికి పెడతారు. ఒక నిమ్మకాయను లక్షల రూపాయలకు వేలం వేస్తారు.

ఇటీవల నిర్వహించిన వేలంలో రూ. 2.36 లక్షలకు తొమ్మిది నిమ్మకాయలను భక్తులు దక్కించుకున్నారు. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ పవిత్రమైన పండ్లతో తయారు చేసిన నిమ్మరసం తాగడం వలన వ్యాధులను నయం చేయడానికి, కుటుంబాలకు శ్రేయస్సును తీసుకురావడానికి కీలకమని పురాణాలు చెబుతున్నాయని భక్తులు అంటున్నారు. ఈ ప్రాంతంలోని మురుగన్ ఆలయం పవిత్రమైన నిమ్మకాయలకు ప్రసిద్ధి చెందింది. మురుగన్ విగ్రహం ముందు త్రిశూలానికి చెక్కిన నిమ్మకాయలకు అద్భుత శక్తులు వస్తాయని, అలాంటి శక్తులు నిమ్మకాయలకు ఉంటాయని భక్తులు, స్థానిక ప్రజలు బలంగా నమ్ముతారు.
వార్షిక పంగుని ఉతిరం పండుగ సందర్భంగా తిరువానైనల్లూర్ గ్రామంలోని రెండు కొండల సంగమం మధ్య ఉన్న ఈ మురుగన్ ఆలయానికి వేలాది మంది భక్తులు వచ్చి వెలుతుంటారు. ముఖ్యంగా సంతానం లేని దంపతులు తరలివస్తారు. ఇక్కడ పూజించే నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వేలంలో ప్రజలు లక్షల్లో డబ్బు చెల్లించి నిమ్మకాయలను సొంతం చేసుకుంటారు. ఈ నిమ్మకాయలను దేవుని ఆశీర్వాదంగా తీసుకుంటామని భక్తులు అంటున్నారు.
దీనికి గల కారణాన్ని గ్రామస్థుడు వివరిస్తూ సంతానం లేని దంపతులు ఎక్కువగా నిమ్మకాయలను కొనుగోలు చేస్తారని, సంతానలేమిని నిమ్మకాయలు నయం చేస్తుందని, వ్యాపారులు తమ వ్యాపారాల్లో లాభాలు తెచ్చుకోవడానికి, కుటుంబం బాగుండాలని ఈ నిమ్మకాయలను కొనుగోలు చేస్తారని తెలిపారు. ప్రతిరోజు ఒక నిమ్మకాయను త్రిశూలం ఈటెపై గుచ్చుతారు. ఈ తొమ్మిది రోజుల సంప్రదాయానికి చివరి రోజున ఆ నిమ్మకాయలను వేలానికి ఉంచారు.
ఈ వేలం ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ పండుగలో మొదటి రోజున కుట్టిన నిమ్మకాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని భక్తులు నమ్ముతారు. ఈ దీవించిన నిమ్మకాయలను వేలంలో దక్కించుకున్న భక్తులు దేవాలయం సమీపంలోనే స్నానం చేసి, ఆలయ పూజారి ముందు భక్తితో మోకరిల్లి వాటిని స్వీకరిస్తారు.
కులత్తూరు గ్రామానికి చెందిన దంపతులు ఒక్క నిమ్మకాయలను రూ.50, 500లకు దక్కించుకున్నారు. సంప్రదాయం, విశ్వాసంతో నిండిన ఈ పండుగ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా కొనసాగుతుంది. ఇది పురాతన సంప్రదాయాలు, నమ్మకాలను శాశ్వతంగా నిలబెట్టుతుందని భక్తులు, స్థానికులు అంటున్నారు. ఈ పండుగకు తమిళనాడుతో పాటు పొరుగు రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని గ్రామస్తులు అంటున్నారు.



Click it and Unblock the Notifications











