Latest Updates
-
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.!
బతికున్న నరసింహ స్వామి దేవాలయం.. దర్శించుకుంటే 24 గంటల్లో కోరికలు నెరవేరిపోతాయి! ఎక్కడుందంటే?
హిందూ దేవుళ్లలో నరసింహ స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడిగా పేరుంది. నరసింహ స్వామి ఆలయాలకు కూడా చాలా ప్రత్యేకతలు, చరిత్ర ఉంటుంది. ప్రజలందరినీ హింసిస్తున్న హిరణ్య కశ్యప అనే రాక్షసుడిని విష్ణువు నరసింహ స్వామి అవతారంలో అవతరించి అంతమొందించిన విషయం తెలిసిందే. సగం మనిషి, సగం జంతువు ఆకారంలో నరసింహ స్వామి తన చేతి గోళ్ళతో హిరణ్యకశ్యపుడి పొట్టను చీల్చి అతడిని చంపేశారు.
ఇలా చంపిన తరువాత నరసింహ స్వామి ఉగ్రరూపంలో భగభగా మండిపోతూ ఉంటారట. అలా ఉగ్ర రూపంలో ఊగిపోతున్న స్వామి వారిని చల్లబరిచేందుకు దేవతలు వెయ్యి నూతుల నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేశారట. అక్కడ ఉద్భవించిన గుడే కడప జిల్లాలోని వెయ్యి నూతుల నరసింహ స్వామి దేవాలయం. ఆ ఆలయం విశిష్టతలు ఏంటి? ఆ ఆలయ ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గుడి ఎక్కడుందంటే?
నరసింహ స్వామి వారు హిరణ్య కశ్యపుడిని చంపిన తరువాత కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం పెండ్లి మర్రి ప్రాంతంలోని వెయ్యి నూతుల కోన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఉగ్ర రూపంలో ఊగిపోతున్న స్వామి వారిని చల్లబరిచేందుకు దేవతలకు ఏం చేయాలో అర్ధం కాక, ఆ కొండ చివరలో వెయ్యి నూతులను సృష్టించారట.
ఆ నూతుల్లోని నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేసిన తరువాత స్వామి వారు శాంతించారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ దేవాలయంలో నరసింహస్వామి స్వయంభూగా వెలిశారని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడి నరసింహ స్వామి ఉగ్ర రూపానికి ప్రతీకమని, నిజమైన ఉగ్రరూపమని చెబుతుంటారు. స్వామి వారికి అతీతమైన శక్తులు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
స్వామి వారు కృతయుగంలో జన్మించారని అనడానికి ఈ దేవాలయము ఒక సాక్ష్యమని, నిదర్శనమని చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేవాలయం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడికి అనేక మంది భక్తులు వచ్చి తమ కోరికలు చెప్పుకొని, నోములు నోచుకోని, మొక్కులు చెల్లించుకుంటారు.
స్వామి వారి మహిమలు
ఇక్కడి నరసింహ స్వామి ఇంకా బతికే ఉన్నారనే వార్తలు వస్తుంటాయి. స్వామి వారు నిజంగానే ఆ క్షేత్రంలో తిరుగుతున్నారనే ఆనవాళ్లు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని భక్తులు చెబుతుంటారు. వారికి అతీతమైన మహిమలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక్కడి స్వామి వారిని దర్శించుకుంటే అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయని భక్తులు చెబుతుంటారు. ఈ దేవాలయానికి వచ్చి, స్వామి వారిని దర్శించుకొని వెళితే ఏ పని అయినా క్షణాల్లోనే పూర్తవుతుందని చెబుతుంటారు.
పైగా ఇక్కడ స్వయంభుగా వెలిసిన నరసింహుడు ఉగ్రరూపం తరువాత చల్లబడ్డాడు కాబట్టి, ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని భక్తులు చెబుతున్నారు. మీరు కూడా ఓసారి ఈ ఆలయాన్ని సందర్శించండి మరి. ఈ ఆలయాన్ని సందర్శించి, మనశ్శాంతితో పాటు స్వామి వారి ఆశీస్సులు పొందండి.



Click it and Unblock the Notifications