Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Maha Kumbh Mela 2025: 1000 అశ్వమేథ యాగాలు చేస్తే వచ్చే ఫలితం..కుంభమేళాలో ఆ రోజున స్నానం చేస్తే లభిస్తుంది!
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆథ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళా ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ప్రారంభమైంది. దేశ విదేశాల నిత్యం లక్షల మంది భక్తులు, నాగసాధువులు, సన్యాసులు, బుషులతో ప్రయాగరాజ్ నగరవీధులు కిక్కిరిసిపోతున్నాయి. కోట్ల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తతెల్తకుండా అన్ని ఏర్పాట్లును యూపీ ప్రభుత్వం పకగడ్బందీగా ఫ్లాన్ చేసింది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహాకుంభమేళా కొనసాగుతుంది.
144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన మహాకుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ లోని గంగా,యమునా,సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయని,మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే కుంభమేళా సమయంలో కూడా కొన్ని ప్రత్యేక తేదీల్లో స్నానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట. శనిదేషాలు అన్నీ తొలగిపోతాయంట.

అమృత స్నానం జరిగే తేదీలివే
పౌష పూర్ణిమ,జనవరి 13
మకర సంక్రాంతి(మొదటి శని స్నానం)
మౌని అమావాస్య,జనవరి 29(రెండవ శని స్నానం)
వసంత పంచమి,ఫిబ్రవరి 3(మూడవ శని స్నానం)
అచల సప్తమి,ఫిబ్రవరి 4,2025.
మాఘ పూర్ణిమ,ఫిబ్రవరి 12,2025.
మహా శివరాత్రి,ఫిబ్రవరి 26,2025.
రెండవ అమృత స్నానం
కుంభమేళాలో మెదటి అమృత స్నానం మకర సంక్రాంతి నాడు పూర్తవగా..రెండో అమృత స్నానం జనవరి 29,2025న ఉంటుంది. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 13 నాగ సాధు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోయారు. ఈ నాగ సాధువులే అమృత స్నానం రోజున ముందుగా స్నానం చేస్తారు. ఋషులు,సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
అమృత స్నానం చేయడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మహా కుంభమేళాలో అమృత స్నానం చేసిన తర్వాత ఋషులు, సాధువులు భగవంతుడిని ధ్యానిస్తారు. ఈ కారణంగానే సాధువులు, ఋషులు లోక సంక్షేమం, మోక్షం కోసం మహా కుంభమేళాకు వస్తారు.



Click it and Unblock the Notifications











