Maha Kumbh Mela 2025: 1000 అశ్వమేథ యాగాలు చేస్తే వచ్చే ఫలితం..కుంభమేళాలో ఆ రోజున స్నానం చేస్తే లభిస్తుంది!

ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన, ఆథ్యాత్మిక కార్యక్రమైన మహాకుంభమేళా ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ప్రారంభమైంది. దేశ విదేశాల నిత్యం లక్షల మంది భక్తులు, నాగసాధువులు, సన్యాసులు, బుషులతో ప్రయాగరాజ్ నగరవీధులు కిక్కిరిసిపోతున్నాయి. కోట్ల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తతెల్తకుండా అన్ని ఏర్పాట్లును యూపీ ప్రభుత్వం పకగడ్బందీగా ఫ్లాన్ చేసింది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు మహాకుంభమేళా కొనసాగుతుంది.

144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన మహాకుంభమేళా సమయంలో ప్రయాగరాజ్ లోని గంగా,యమునా,సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే అప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయని,మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే కుంభమేళా సమయంలో కూడా కొన్ని ప్రత్యేక తేదీల్లో స్నానం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయంట. శనిదేషాలు అన్నీ తొలగిపోతాయంట.

Maha Kumbh Mela 2025 Amrit Snan on Mauni Amavasya is equal to 1000 Ashwamedha Yagnas

అమృత స్నానం జరిగే తేదీలివే
పౌష పూర్ణిమ,జనవరి 13
మకర సంక్రాంతి(మొదటి శని స్నానం)
మౌని అమావాస్య,జనవరి 29(రెండవ శని స్నానం)
వసంత పంచమి,ఫిబ్రవరి 3(మూడవ శని స్నానం)
అచల సప్తమి,ఫిబ్రవరి 4,2025.
మాఘ పూర్ణిమ,ఫిబ్రవరి 12,2025.
మహా శివరాత్రి,ఫిబ్రవరి 26,2025.

రెండవ అమృత స్నానం
కుంభమేళాలో మెదటి అమృత స్నానం మకర సంక్రాంతి నాడు పూర్తవగా..రెండో అమృత స్నానం జనవరి 29,2025న ఉంటుంది. దీనికి ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 13 నాగ సాధు అఖాడాలు సంగం నది ఒడ్డున తమ శిబిరాలను ఏర్పాటు చేసుకుని భగవంతుని భక్తిలో మునిగిపోయారు. ఈ నాగ సాధువులే అమృత స్నానం రోజున ముందుగా స్నానం చేస్తారు. ఋషులు,సన్యాసులకు ఈ స్నానం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

అమృత స్నానం చేయడం ద్వారా 1000 అశ్వమేధ యాగాలకు సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మహా కుంభమేళాలో అమృత స్నానం చేసిన తర్వాత ఋషులు, సాధువులు భగవంతుడిని ధ్యానిస్తారు. ఈ కారణంగానే సాధువులు, ఋషులు లోక సంక్షేమం, మోక్షం కోసం మహా కుంభమేళాకు వస్తారు.

Desktop Bottom Promotion