Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
Mahashivratri: మహాశివరాత్రి నాడు ఈ పండు నైవేద్యంగా పెడితే..ఐశ్వర్యవంతులైపోతారు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రిని జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు పరమేశ్వరుడి ఆశిస్సుల కోసం పూజలు చేస్తారు,ఉపవాసం ఉంటారు,రాత్రంతా జాగారం చేస్తారు. అయితే మహాశివరాత్రి నాడు పూజ సమయంలో చాలామంది బంతి పువ్వులు, ధూతుర పువ్వులను ఉపయోగిస్తారు. పరమేశ్వరుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఒక పండు లేకుండా శివుని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అదే బేల్ పండు.
బేల్ పండు.. భారతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి, దీని గురించి రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని బిల్వ పండు,మారేడు పండు, ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. భారతదేశంతో పాటు ఈ పండు చైనా, యూరప్, రష్యా,అనేక ఇతర దేశాలలో పండిస్తారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని, ఎముకలను బలోపేతం చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. శివయ్యకు ఈ పండు అంటే చాలా ఇష్టం, ఈ బెల్ పండు ఆయనకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండును శివుడి పూజలో మాత్రమే కాకుండా, ఆయనకు ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పిస్తారు.

బిల్వ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారేడు పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది..హైపర్ టెన్షన్ తగ్గుతుంది..కొలెస్ట్రాల్ కరుగుతుంది..గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బిల్వ వృక్షం ఆకులు కూడా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి.
బిల్వ ఆకులు.. మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు ఒంట్లో వేడి పోతుంది.
శివుడికి నివేదన చేసేందుకు తమలపాకులను కూడా ఉపయోగిస్తారు. తమలపాకులను ఉపయోగించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.



Click it and Unblock the Notifications