Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
Mahashivratri: మహాశివరాత్రి నాడు ఈ పండు నైవేద్యంగా పెడితే..ఐశ్వర్యవంతులైపోతారు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రిని జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు పరమేశ్వరుడి ఆశిస్సుల కోసం పూజలు చేస్తారు,ఉపవాసం ఉంటారు,రాత్రంతా జాగారం చేస్తారు. అయితే మహాశివరాత్రి నాడు పూజ సమయంలో చాలామంది బంతి పువ్వులు, ధూతుర పువ్వులను ఉపయోగిస్తారు. పరమేశ్వరుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఒక పండు లేకుండా శివుని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అదే బేల్ పండు.
బేల్ పండు.. భారతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి, దీని గురించి రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని బిల్వ పండు,మారేడు పండు, ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. భారతదేశంతో పాటు ఈ పండు చైనా, యూరప్, రష్యా,అనేక ఇతర దేశాలలో పండిస్తారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని, ఎముకలను బలోపేతం చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. శివయ్యకు ఈ పండు అంటే చాలా ఇష్టం, ఈ బెల్ పండు ఆయనకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండును శివుడి పూజలో మాత్రమే కాకుండా, ఆయనకు ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పిస్తారు.

బిల్వ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారేడు పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది..హైపర్ టెన్షన్ తగ్గుతుంది..కొలెస్ట్రాల్ కరుగుతుంది..గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బిల్వ వృక్షం ఆకులు కూడా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి.
బిల్వ ఆకులు.. మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు ఒంట్లో వేడి పోతుంది.
శివుడికి నివేదన చేసేందుకు తమలపాకులను కూడా ఉపయోగిస్తారు. తమలపాకులను ఉపయోగించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.



Click it and Unblock the Notifications











