Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
Mahashivratri: మహాశివరాత్రి నాడు ఈ పండు నైవేద్యంగా పెడితే..ఐశ్వర్యవంతులైపోతారు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మహాశివరాత్రిని జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు పరమేశ్వరుడి ఆశిస్సుల కోసం పూజలు చేస్తారు,ఉపవాసం ఉంటారు,రాత్రంతా జాగారం చేస్తారు. అయితే మహాశివరాత్రి నాడు పూజ సమయంలో చాలామంది బంతి పువ్వులు, ధూతుర పువ్వులను ఉపయోగిస్తారు. పరమేశ్వరుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఒక పండు లేకుండా శివుని పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అదే బేల్ పండు.
బేల్ పండు.. భారతదేశంలోని పురాతన పండ్లలో ఒకటి, దీని గురించి రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. దీనిని బిల్వ పండు,మారేడు పండు, ఉడ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. భారతదేశంతో పాటు ఈ పండు చైనా, యూరప్, రష్యా,అనేక ఇతర దేశాలలో పండిస్తారు. ఇది శరీర రోగనిరోధక శక్తిని, ఎముకలను బలోపేతం చేసే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. శివయ్యకు ఈ పండు అంటే చాలా ఇష్టం, ఈ బెల్ పండు ఆయనకు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పండును శివుడి పూజలో మాత్రమే కాకుండా, ఆయనకు ఇష్టమైన నైవేద్యం కూడా సమర్పిస్తారు.

బిల్వ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మారేడు పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది..హైపర్ టెన్షన్ తగ్గుతుంది..కొలెస్ట్రాల్ కరుగుతుంది..గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. బిల్వ వృక్షం ఆకులు కూడా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనవి.
బిల్వ ఆకులు.. మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి. బిల్వ పత్రాలు, పండ్లతో జ్వరం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్ తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. బిల్వ ఆకుల రసం తాగితే చాలు ఒంట్లో వేడి పోతుంది.
శివుడికి నివేదన చేసేందుకు తమలపాకులను కూడా ఉపయోగిస్తారు. తమలపాకులను ఉపయోగించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.



Click it and Unblock the Notifications