Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
భయం, ఆందోళన మాయం.. ఈ మంత్రాలను జపిస్తే మీలో అంతులేని ధైర్యం!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద శత్రువు మానసిక ఒత్తిడి. పొద్దున్నే నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఆందోళన, తీరని ఆలోచనల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాధ్యతల భారం, సమయంతో పరుగుల వల్ల మన మెదడు తీవ్రమైన అలసటకు గురవుతోంది.
దీనివల్ల ఏ పనిపైనా సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోవడం, కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. ఈ ఒత్తిడి కేవలం వృత్తిగత జీవితాన్నే కాకుండా, మన వ్యక్తిగత జీవితాన్ని, బంధాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మరి ఈ ఆందోళనల నుండి బయటపడి, మానసిక ప్రశాంతతను పొందే మార్గం లేదా?

మన ప్రాచీన మత గ్రంథాలు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందించాయి. కొన్ని నిర్దిష్టమైన మంత్రాలను జపించడం ద్వారా మెదడులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుందని విశ్వాసం. ఒత్తిడిని జయించి, ఏకాగ్రతను పెంచే ఆ అద్భుతమైన మంత్రాలు ఏమిటో ఇక్కడ చూడండి.
మహామృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.
పరమశివునికి అంకితం చేయబడిన ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మనస్సులోని భయాలు, ఆందోళనలు మంచులా కరిగిపోతాయి. నెగెటివిటీ దూరమై, మనస్సు చెప్పలేనంత ఆనందంతో, ప్రశాంతతతో నిండిపోతుంది.
ఆంజనేయ స్వామి మంత్రాలు
-ఓం హాం హనుమతే నమః.
-ఓం హాం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్.
-ఓం నమో భగవతే హనుమతే నమః.
ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక అయిన హనుమంతుడి మంత్రాలు మానసిక సమస్యలకు దివ్యౌషధం. మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు ఈ మంత్రాలను జపించడం వల్ల గుండెల్లో ధైర్యం కట్టలు తెంచుకుంటుంది. అకారణ భయాలు, మానసిక ఆందోళనలు పటాపంచలు అవుతాయి.
అమ్మవారి (శక్తి) మంత్రాలు
మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పొందడానికి ఆ జగన్మాతను స్మరించడం ఎంతో ఉత్తమం.
-యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా..నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.
-సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే..శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
-ఓం జటా జూట సమాయుక్తమర్ధేన్దు కృత లక్షణామ్..లోచనత్రయ సంయుక్తాం పద్మేన్దు సదృశాననామ్.
ఈ దేవీ మంత్రాలను పఠించడం వల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. అంతర్గతంగా తాము చాలా బలవంతులమనే భావన కలుగుతుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోగల మనోధైర్యం లభిస్తుంది.
వీటితో పాటు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా' చదవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Disclaimer: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. బోల్డ్ స్కై తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.



Click it and Unblock the Notifications