Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
భయం, ఆందోళన మాయం.. ఈ మంత్రాలను జపిస్తే మీలో అంతులేని ధైర్యం!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద శత్రువు మానసిక ఒత్తిడి. పొద్దున్నే నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఆందోళన, తీరని ఆలోచనల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాధ్యతల భారం, సమయంతో పరుగుల వల్ల మన మెదడు తీవ్రమైన అలసటకు గురవుతోంది.
దీనివల్ల ఏ పనిపైనా సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోవడం, కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. ఈ ఒత్తిడి కేవలం వృత్తిగత జీవితాన్నే కాకుండా, మన వ్యక్తిగత జీవితాన్ని, బంధాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మరి ఈ ఆందోళనల నుండి బయటపడి, మానసిక ప్రశాంతతను పొందే మార్గం లేదా?

మన ప్రాచీన మత గ్రంథాలు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందించాయి. కొన్ని నిర్దిష్టమైన మంత్రాలను జపించడం ద్వారా మెదడులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుందని విశ్వాసం. ఒత్తిడిని జయించి, ఏకాగ్రతను పెంచే ఆ అద్భుతమైన మంత్రాలు ఏమిటో ఇక్కడ చూడండి.
మహామృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.
పరమశివునికి అంకితం చేయబడిన ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మనస్సులోని భయాలు, ఆందోళనలు మంచులా కరిగిపోతాయి. నెగెటివిటీ దూరమై, మనస్సు చెప్పలేనంత ఆనందంతో, ప్రశాంతతతో నిండిపోతుంది.
ఆంజనేయ స్వామి మంత్రాలు
-ఓం హాం హనుమతే నమః.
-ఓం హాం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్.
-ఓం నమో భగవతే హనుమతే నమః.
ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక అయిన హనుమంతుడి మంత్రాలు మానసిక సమస్యలకు దివ్యౌషధం. మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు ఈ మంత్రాలను జపించడం వల్ల గుండెల్లో ధైర్యం కట్టలు తెంచుకుంటుంది. అకారణ భయాలు, మానసిక ఆందోళనలు పటాపంచలు అవుతాయి.
అమ్మవారి (శక్తి) మంత్రాలు
మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పొందడానికి ఆ జగన్మాతను స్మరించడం ఎంతో ఉత్తమం.
-యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా..నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.
-సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే..శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
-ఓం జటా జూట సమాయుక్తమర్ధేన్దు కృత లక్షణామ్..లోచనత్రయ సంయుక్తాం పద్మేన్దు సదృశాననామ్.
ఈ దేవీ మంత్రాలను పఠించడం వల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. అంతర్గతంగా తాము చాలా బలవంతులమనే భావన కలుగుతుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోగల మనోధైర్యం లభిస్తుంది.
వీటితో పాటు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా' చదవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Disclaimer: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. బోల్డ్ స్కై తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.



Click it and Unblock the Notifications