Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
భయం, ఆందోళన మాయం.. ఈ మంత్రాలను జపిస్తే మీలో అంతులేని ధైర్యం!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతిపెద్ద శత్రువు మానసిక ఒత్తిడి. పొద్దున్నే నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఆందోళన, తీరని ఆలోచనల సుడిగుండంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాధ్యతల భారం, సమయంతో పరుగుల వల్ల మన మెదడు తీవ్రమైన అలసటకు గురవుతోంది.
దీనివల్ల ఏ పనిపైనా సరిగ్గా ఏకాగ్రత పెట్టలేకపోవడం, కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. ఈ ఒత్తిడి కేవలం వృత్తిగత జీవితాన్నే కాకుండా, మన వ్యక్తిగత జీవితాన్ని, బంధాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మరి ఈ ఆందోళనల నుండి బయటపడి, మానసిక ప్రశాంతతను పొందే మార్గం లేదా?

మన ప్రాచీన మత గ్రంథాలు ఈ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందించాయి. కొన్ని నిర్దిష్టమైన మంత్రాలను జపించడం ద్వారా మెదడులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, సానుకూల శక్తి ప్రవహిస్తుందని విశ్వాసం. ఒత్తిడిని జయించి, ఏకాగ్రతను పెంచే ఆ అద్భుతమైన మంత్రాలు ఏమిటో ఇక్కడ చూడండి.
మహామృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.
పరమశివునికి అంకితం చేయబడిన ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని నిత్యం జపించడం వల్ల మనస్సులోని భయాలు, ఆందోళనలు మంచులా కరిగిపోతాయి. నెగెటివిటీ దూరమై, మనస్సు చెప్పలేనంత ఆనందంతో, ప్రశాంతతతో నిండిపోతుంది.
ఆంజనేయ స్వామి మంత్రాలు
-ఓం హాం హనుమతే నమః.
-ఓం హాం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్.
-ఓం నమో భగవతే హనుమతే నమః.
ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక అయిన హనుమంతుడి మంత్రాలు మానసిక సమస్యలకు దివ్యౌషధం. మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నప్పుడు ఈ మంత్రాలను జపించడం వల్ల గుండెల్లో ధైర్యం కట్టలు తెంచుకుంటుంది. అకారణ భయాలు, మానసిక ఆందోళనలు పటాపంచలు అవుతాయి.
అమ్మవారి (శక్తి) మంత్రాలు
మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పొందడానికి ఆ జగన్మాతను స్మరించడం ఎంతో ఉత్తమం.
-యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా..నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.
-సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే..శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
-ఓం జటా జూట సమాయుక్తమర్ధేన్దు కృత లక్షణామ్..లోచనత్రయ సంయుక్తాం పద్మేన్దు సదృశాననామ్.
ఈ దేవీ మంత్రాలను పఠించడం వల్ల వ్యక్తిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. అంతర్గతంగా తాము చాలా బలవంతులమనే భావన కలుగుతుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోగల మనోధైర్యం లభిస్తుంది.
వీటితో పాటు ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఏకాగ్రతతో హనుమాన్ చాలీసా' చదవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
Disclaimer: ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం. బోల్డ్ స్కై తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.



Click it and Unblock the Notifications