Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
ఈ 2 మంత్రాలు హనుమాన్ చాలీసాలోనే శక్తివంతమైనవి.. ఇలా జపిస్తే 21 రోజుల్లో ఎలాంటి కోరిన అయినా నెరవేరుతుంది!
హనుమాన్ జయంతి వచ్చేసింది. నేడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే అన్నీ హనుమాన్ ఆలయాన్నీ ముస్తాబయ్యాయి. హనుమంతుడి ఊరేగింపు కోసం వేదికలు కూడా సిద్ధమయ్యాయి. అయితే మన దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని పూజిస్తుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా హనుమంతుడి గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. హనుమంతుడిని మోక్షం కోసం పూజిస్తుంటారు. అయితే హనుమంతుడి అనుగ్రహం కలగాలంటే కొన్ని మంత్రాలను పాటించాల్సి ఉంటుంది. ఇవి అత్యంత శక్తివంతమైన మంత్రాలని, వీటిని పఠిస్తే కోరుకున్న కార్యాలన్నీ నెరవేరిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ మంత్రాలను పఠించడం వలన శక్తివంతమైన వ్యక్తులుగా మారుతామని చెబుతున్నారు. అసలు ఇంతకీ ఆ హనుమంతుడి మంత్రాలు ఏంటి? వాటిని ఏ విధంగా పఠించాలి? వాటిని పఠించడం వలన ఎలాంటి ఉపయోగాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ మంత్రాలు దేనికి పనికొస్తాయి..
హనుమంతుడి కోసం జపించే మంత్రాల్లో ఈ రెండు మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. ఈ రెండు మంత్రాలు కోరికలు తీర్చుకోవడానికి, అలాగే ఎలాంటి వ్యాధులను కూడా నయం చేసుకోవడానికి పని చేస్తాయని చెబుతుంటారు. ఈ మంత్రాలు అత్యంత శక్తివంతమైవిగా ఉండడంతో పాటు.. కోరుకున్న కోరికలు 21 రోజుల లోపు లేదా 2 నెలల్లో పూర్తవుతాయి. ఇప్పటికే చాలా మంది తమ తమ కోరికలు పూర్తయ్యాయని చెప్పారు కూడా. అయితే ఈ మంత్రాలను ఎలా చదవాలి, ఎలా చదివితే మంత్రాలు ఫలిస్తాయి అనేది చూద్దాం..

మంత్రాలను పఠించే విధానం..
ఈ రెండు శక్తివంతమైన మంత్రాలను పఠనం చేసే విధానం రెండూ ఒకే విధంగా ఉంటాయి. మంత్రాలను చదివే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఈ మంత్రాలను చదివే ముందు ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ హనుమంతుడికి పూజలు నిర్వహించి.. హనుమంతుడి చుటూ 108 ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాలను చదవాలి. అలాగే ఈ మంత్రాలు చదివేటప్పుడు మంచి ద్రుష్టి ఉండాలి. ఎలాంటి దుర్బుద్ధితో ఉన్నా మీ కోరికలు ఫలించవు. అలాగే ఆ మంత్రాలు పనికిరాకుండా పోతాయి.
మంత్రాలు ఏంటంటే
కోరికలు తీర్చే మంత్రం..
ఆంజనేయం మహావీరం
బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్కప్రభమ్ శాంతం
ఆంజనేయ నమామ్యహం
ఈ మంత్రం చదివేటప్పుడు హనుమంతుడి చుటూ 108 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రం చదివితేనే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ మంత్రం ఫలిస్తుంది. అలాగే ప్రదక్షిణలు చేసేటప్పుడు పేపర్పై ప్రదక్షణలను కౌంట్ చేయకూడదు. ఈ మంత్రాలను చదివేటప్పుడు చేసే ప్రదక్షణలను కేవలం పూలతో మాత్రమే కౌంట్ చేయాలి. ఒక కవర్లో ఈ పూలను వేసుకొని.. ప్రదక్షణ పూర్తనైప్పుడు ఒక్కో పూలను బాక్సులో వేస్తుండాలి. ఇలా చేస్తూ ఈ మంత్రాన్ని పూజించాలి. అలాంటప్పుడు ఈ మంత్రం ఫలిస్తుంది.
రోగాలను నయం చేసుకోవడానికి..
హనుమాన్ అంజనా సూనో వాయుపుత్రో
మహాబలః, అకస్మాత గతోత్పాతం
నాశయాసు నమోస్తుతే!
ఈ మంత్రాన్ని చదివే ఆ హనుమంతుడి అనుగ్రహం మనపై కలిగి.. మనలో ఉన్న రోగాలు నయమైపోతాయని హనుమంతుడి భక్తులు విశ్వసిస్తుంటారు. అలాగే ఈ మంత్రానికి చాలా శక్తి ఉంటుందని చెబుతుంటారు. ఈ మంత్రం చదివేటప్పుడు కూడా పైన చెప్పిన విధానాన్నే పాటించాలి. పైన చెప్పిన విధంగా మంత్రాన్ని జపిస్తే కచ్చితంగా ఉపశమనం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.



Click it and Unblock the Notifications