Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
దీపావళి రోజు తప్పక కొనాల్సిన మూడు వస్తువులు.. ధర కూడా చాలా తక్కువ.. ఎక్కడ దొరుకుతుందంటే?
దీపావళి.. ఇది అయిదు రోజుల అతిపెద్ద పండుగ. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. పిల్లా పాపల నుంచి కురు వృద్ధుల వరకు ఈ పండగను ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో నిర్వహించుకుంటారు. కేవలం హిందువులు మాత్రమే కాదు, సిక్కులు, జైనులు కూడా ఈ పండగను వేడుకగా నిర్వహించుకుంటూ ఉంటారు. అతడి గొప్ప చరిత్ర కలిగిన ఈ పండగను ఈనెల 31వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు.
అయితే పవిత్రమైన గొప్ప పండగ అయిన దీపావళి రోజు కొన్ని కొన్ని వస్తువులు కొంటే ఎంతో శుభప్రదమని భక్తులు, ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా కొనడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడు సంతృప్తి చెంది, మనపై కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారని చెబుతున్నారు. అయితే ఆ వస్తువులు ఏంటి, ఎందుకు వాటిని కొనాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా దీపావళి రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం..
శ్రీరాముడు రావణాసురుడిని చంపి అయోధ్యకు వచ్చినందుకు దీపావళిని జరుపుకుంటారని చెప్పుకుంటారు. అలాగే నరకాసురుడిపై కృష్ణుడు విజయం సాధించిన దానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారని చెప్పుకుంటారు. ఈ దీపావళి రోజు ఇల్లంతా శుభ్రంగా అలంకరించి, వేడుకగా ముస్తాబు చేస్తారు. రంగు రంగుల ముగ్గులు గీసి, వాటిలో దీపాలను పేర్చి ఆవు నెయ్యి, లేదా ఇతర దీపం నూనెలతో దీపాలను వెలిగిస్తారు.
అనంతరం కుబేరుడు, గణేషుడిని పూజిస్తారు. దాని తరువాత దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి ఆర్ధిక సమస్యలను తొలగించడంతో పాటు, మనకు శాంతి శ్రేయస్సు పంచుతుందని నమ్ముతుంటారు.
దీపావళి రోజు ఎలాంటి వస్తువులు కొనాలంటే..
ఉప్పు: పవిత్రమైన దీపావళి పర్వదినం రోజున ఉప్పు కొనడం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. ఈ దీపావళి రోజున కొన్న ఉప్పును ఇంటి ప్రవేశ ద్వారం ముందు ఉంచడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు. అలాగే ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉండడంతో.. ఏదైనా ప్రతికూల శక్తులను మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు ఆపగలుగుతుందని చెబుతుంటారు.
పచ్చ కర్పూరం: సాధారణ కర్పూరం కంటే పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన వాసన కూడా అధికంగా వస్తుంది. అందుకే ఈ దీపావళి నాడు ఈ పచ్చ కర్పూపం కొని, ఇంట్లో వెలిగించడం వల్ల.. ఇంట్లోని ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల శక్తులు ఇంటి నుంచి వెళ్ళిపోతాయని, తద్వారా ఇంట్లో మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చెబుతుంటారు.
నల్ల పసుపు: ఈ పవిత్రమైన దీపావళి రోజున నల్ల పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళి రోజున నల్ల పసుపు కొనుక్కొని, దేవి ముందు ఉంచి పూజ చేయాలట. అలా పూజ చేసిన పసుపును డబ్బు లేదా ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో ఉంచడం ద్వారా, ఆర్ధిక సమస్యలు తొలిగి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. వీలైతే మీకు దగ్గరలోని దుకాణంలో లేదా వేరే ఏదైనా ప్రదేశంలో పైన పేర్కొనబడిన మూడు వస్తువులను దీపావళి రోజున కొనడానికి ప్రయత్నించండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ పలువురు జోతిష్య నిపుణులు, అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. అలాగే వీటిని విశ్వసించడమనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications