Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
దీపావళి రోజు తప్పక కొనాల్సిన మూడు వస్తువులు.. ధర కూడా చాలా తక్కువ.. ఎక్కడ దొరుకుతుందంటే?
దీపావళి.. ఇది అయిదు రోజుల అతిపెద్ద పండుగ. దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండగను జరుపుకుంటారు. పిల్లా పాపల నుంచి కురు వృద్ధుల వరకు ఈ పండగను ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమతో నిర్వహించుకుంటారు. కేవలం హిందువులు మాత్రమే కాదు, సిక్కులు, జైనులు కూడా ఈ పండగను వేడుకగా నిర్వహించుకుంటూ ఉంటారు. అతడి గొప్ప చరిత్ర కలిగిన ఈ పండగను ఈనెల 31వ తేదీన దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు.
అయితే పవిత్రమైన గొప్ప పండగ అయిన దీపావళి రోజు కొన్ని కొన్ని వస్తువులు కొంటే ఎంతో శుభప్రదమని భక్తులు, ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలా కొనడం వల్ల లక్ష్మీదేవి, కుబేరుడు సంతృప్తి చెంది, మనపై కరుణా కటాక్షాలు ప్రసాదిస్తారని చెబుతున్నారు. అయితే ఆ వస్తువులు ఏంటి, ఎందుకు వాటిని కొనాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా దీపావళి రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం..
శ్రీరాముడు రావణాసురుడిని చంపి అయోధ్యకు వచ్చినందుకు దీపావళిని జరుపుకుంటారని చెప్పుకుంటారు. అలాగే నరకాసురుడిపై కృష్ణుడు విజయం సాధించిన దానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారని చెప్పుకుంటారు. ఈ దీపావళి రోజు ఇల్లంతా శుభ్రంగా అలంకరించి, వేడుకగా ముస్తాబు చేస్తారు. రంగు రంగుల ముగ్గులు గీసి, వాటిలో దీపాలను పేర్చి ఆవు నెయ్యి, లేదా ఇతర దీపం నూనెలతో దీపాలను వెలిగిస్తారు.
అనంతరం కుబేరుడు, గణేషుడిని పూజిస్తారు. దాని తరువాత దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి ఆర్ధిక సమస్యలను తొలగించడంతో పాటు, మనకు శాంతి శ్రేయస్సు పంచుతుందని నమ్ముతుంటారు.
దీపావళి రోజు ఎలాంటి వస్తువులు కొనాలంటే..
ఉప్పు: పవిత్రమైన దీపావళి పర్వదినం రోజున ఉప్పు కొనడం శుభప్రదంగా భక్తులు భావిస్తారు. ఈ దీపావళి రోజున కొన్న ఉప్పును ఇంటి ప్రవేశ ద్వారం ముందు ఉంచడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు. అలాగే ఉప్పుకు ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉండడంతో.. ఏదైనా ప్రతికూల శక్తులను మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు ఆపగలుగుతుందని చెబుతుంటారు.
పచ్చ కర్పూరం: సాధారణ కర్పూరం కంటే పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన వాసన కూడా అధికంగా వస్తుంది. అందుకే ఈ దీపావళి నాడు ఈ పచ్చ కర్పూపం కొని, ఇంట్లో వెలిగించడం వల్ల.. ఇంట్లోని ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల శక్తులు ఇంటి నుంచి వెళ్ళిపోతాయని, తద్వారా ఇంట్లో మంచి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని చెబుతుంటారు.
నల్ల పసుపు: ఈ పవిత్రమైన దీపావళి రోజున నల్ల పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళి రోజున నల్ల పసుపు కొనుక్కొని, దేవి ముందు ఉంచి పూజ చేయాలట. అలా పూజ చేసిన పసుపును డబ్బు లేదా ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో ఉంచడం ద్వారా, ఆర్ధిక సమస్యలు తొలిగి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. వీలైతే మీకు దగ్గరలోని దుకాణంలో లేదా వేరే ఏదైనా ప్రదేశంలో పైన పేర్కొనబడిన మూడు వస్తువులను దీపావళి రోజున కొనడానికి ప్రయత్నించండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ పలువురు జోతిష్య నిపుణులు, అధ్యయనాలు, ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. అలాగే వీటిని విశ్వసించడమనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications